‘వకీల్ సాబ్’ ప్రోమోలు చూస్తున్న వాళ్లకు ఇది బాలీవుడ్ మూవీ ‘పింక్’కు రీమేక్ అంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుని చేసిన మార్పులు, చేర్పులతో దీని కలరే మారిపోయినట్లు కనిపిస్తోంది. ఒరిజినల్లో అమితాబ్ బచ్చన్ చేసిన పాత్రనే ఇక్కడ పవన్ చేస్తున్నాడు. కానీ అక్కడ ఆయన చేయని చాలా పనులు పవన్ చేసేలా కనిపిస్తున్నాడు. విలన్లతో ఫైటింగులు.. హీరోయిన్తో రొమాన్స్.. పాటలు, డ్యాన్సులు.. ఇలా చాలా వ్యవహారమే ఉన్నట్లుంది.
పవన్ పాత్రకు కొత్తగా ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ సైతం పెట్టినట్లున్నారు. అభిమానులు కోరుకునే అన్ని అంశాలను చేర్చడం, పవన్ పాత్ర నిడివి పెంచడంతో సినిమా ఓవరాల్ లెంగ్త్ కూడా బాగానే పెరిగినట్లు తెలుస్తోంది. చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘వకీల్ సాబ్’ దాదాపు మూడు గంటల సినిమా అట. ఆ నిడివికి ఐదారు నిమిషాలు మాత్రమే తక్కువగా ఉంటుందట.
‘పింక్’ రన్ టైం 2 గంటల 16 నిమిషాలు మాత్రమే. కేవలం ఒరిజినల్లోని కథను మాత్రమే తీసుకుంటే ‘వకీల్ సాబ్’ నిడివి కూడా అలాగే ఉండేది. కానీ పవన్ పాత్రను పెంచడం.. ఫ్లాష్ బ్యాక్, పాటలు యాడ్ చేయడంతో దీని నిడివి 40 నిమిషాల మేర పెరిగినట్లు తెలుస్తోంది. ఒక సినిమాను వేరే భాషలో రీమేక్ చేసినపుడు నిడివి ఇంతగా పెరిగిన సందర్భాలు దాదాపు జరిగి ఉండవు. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు.
తమ మనోభావాలను అర్థం చేసుకుని దర్శకుడు వేణు శ్రీరామ్ తాము కోరుకున్నట్లుగా సినిమాను తీర్చిదిద్దాడని అంటున్నారు. వేణును మాస్ గాడ్ అంటూ సరదాగా సంబోధిస్తుండటం.. ‘వకీల్ సాబ్’ను ఇప్పుడు బాలీవుడ్ వాళ్లు రీమేక్ చేసుకునేలా తయారైందని అంటుండటం విశేషం. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 28, 2021 6:42 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…