‘వకీల్ సాబ్’ ప్రోమోలు చూస్తున్న వాళ్లకు ఇది బాలీవుడ్ మూవీ ‘పింక్’కు రీమేక్ అంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుని చేసిన మార్పులు, చేర్పులతో దీని కలరే మారిపోయినట్లు కనిపిస్తోంది. ఒరిజినల్లో అమితాబ్ బచ్చన్ చేసిన పాత్రనే ఇక్కడ పవన్ చేస్తున్నాడు. కానీ అక్కడ ఆయన చేయని చాలా పనులు పవన్ చేసేలా కనిపిస్తున్నాడు. విలన్లతో ఫైటింగులు.. హీరోయిన్తో రొమాన్స్.. పాటలు, డ్యాన్సులు.. ఇలా చాలా వ్యవహారమే ఉన్నట్లుంది.
పవన్ పాత్రకు కొత్తగా ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ సైతం పెట్టినట్లున్నారు. అభిమానులు కోరుకునే అన్ని అంశాలను చేర్చడం, పవన్ పాత్ర నిడివి పెంచడంతో సినిమా ఓవరాల్ లెంగ్త్ కూడా బాగానే పెరిగినట్లు తెలుస్తోంది. చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘వకీల్ సాబ్’ దాదాపు మూడు గంటల సినిమా అట. ఆ నిడివికి ఐదారు నిమిషాలు మాత్రమే తక్కువగా ఉంటుందట.
‘పింక్’ రన్ టైం 2 గంటల 16 నిమిషాలు మాత్రమే. కేవలం ఒరిజినల్లోని కథను మాత్రమే తీసుకుంటే ‘వకీల్ సాబ్’ నిడివి కూడా అలాగే ఉండేది. కానీ పవన్ పాత్రను పెంచడం.. ఫ్లాష్ బ్యాక్, పాటలు యాడ్ చేయడంతో దీని నిడివి 40 నిమిషాల మేర పెరిగినట్లు తెలుస్తోంది. ఒక సినిమాను వేరే భాషలో రీమేక్ చేసినపుడు నిడివి ఇంతగా పెరిగిన సందర్భాలు దాదాపు జరిగి ఉండవు. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు.
తమ మనోభావాలను అర్థం చేసుకుని దర్శకుడు వేణు శ్రీరామ్ తాము కోరుకున్నట్లుగా సినిమాను తీర్చిదిద్దాడని అంటున్నారు. వేణును మాస్ గాడ్ అంటూ సరదాగా సంబోధిస్తుండటం.. ‘వకీల్ సాబ్’ను ఇప్పుడు బాలీవుడ్ వాళ్లు రీమేక్ చేసుకునేలా తయారైందని అంటుండటం విశేషం. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…