విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నాల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎంత బాగుంటుందో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో చూశాం. నిజం చెప్పాలంటే వాళ్ల ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీకి కూడా తిరుగులేదు. గీత గోవిందం సినిమాకు అదే పెద్ద ప్లస్ అయింది. సోషల్ మీడియాలో, బయట సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లలో వీళ్ల గిల్లికజ్జాలు గీత గోవిందంకు మంచి హైపే తెచ్చాయి. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే.
డియర్ కామ్రేడ్కు కూడా ఈ జోడీ మంచి హైపే తేగలిగింది కానీ.. సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఈ ఇద్దరూ కలిసి రెండో సినిమా చేస్తున్న సమయంలో వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం గట్టిగా నడిచిన సంగతి తెలిసిందే. ఎంగేజ్మెంట్ చేసుకున్న రక్షిత్ శెట్టి నుంచి రష్మిక విడిపోవడానికి కూడా విజయే కారణమన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. ఐతే విజయ్, రష్మిక తర్వాత కలిసి నటించకపోవడంతో ఈ ప్రచారానికి కొంచెం బ్రేక్ పడింది.
ఐతే విజయ్ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన సమయంలో రష్మిక ఆ వేడుకకు హాజరు కావడం తెలిసిందే. ఇప్పుడు విజయ్ను ఆమె ముంబయిలో కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ కార్లోంచి దిగి ఓ ఇంట్లోకి వెళ్తుండగా కెమెరాలకు చిక్కారు. ఈ సందర్భంగా రష్మిక చేతిలో పుష్పగుచ్ఛం ఉంది. బహుశా విజయ్ చేస్తున్న లైగర్ సినిమా నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ను కలవడానికి రష్మికను వెంటబెట్టుకుని వెళ్తుండొచ్చని భావిస్తున్నారు.
లైగర్ షూటింగ్ కోసం చాలా రోజుల నుంచి ముంబయిలోనే ఉంటున్నాడు విజయ్. తన బాలీవుడ్ ఎంట్రీ మూవీ మిషన్ మజ్ను చిత్రీకరణ కోసం రష్మిక కూడా ముంబయికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కలిసినట్లున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు కావడం వల్లే కలిసి ఉండొచ్చు. అంతకుమించి ఈ కలయిక గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదన్నది వారి సన్నిహితుల మాట.
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…