విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నాల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎంత బాగుంటుందో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో చూశాం. నిజం చెప్పాలంటే వాళ్ల ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీకి కూడా తిరుగులేదు. గీత గోవిందం సినిమాకు అదే పెద్ద ప్లస్ అయింది. సోషల్ మీడియాలో, బయట సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లలో వీళ్ల గిల్లికజ్జాలు గీత గోవిందంకు మంచి హైపే తెచ్చాయి. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే.
డియర్ కామ్రేడ్కు కూడా ఈ జోడీ మంచి హైపే తేగలిగింది కానీ.. సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఈ ఇద్దరూ కలిసి రెండో సినిమా చేస్తున్న సమయంలో వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం గట్టిగా నడిచిన సంగతి తెలిసిందే. ఎంగేజ్మెంట్ చేసుకున్న రక్షిత్ శెట్టి నుంచి రష్మిక విడిపోవడానికి కూడా విజయే కారణమన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. ఐతే విజయ్, రష్మిక తర్వాత కలిసి నటించకపోవడంతో ఈ ప్రచారానికి కొంచెం బ్రేక్ పడింది.
ఐతే విజయ్ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన సమయంలో రష్మిక ఆ వేడుకకు హాజరు కావడం తెలిసిందే. ఇప్పుడు విజయ్ను ఆమె ముంబయిలో కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ కార్లోంచి దిగి ఓ ఇంట్లోకి వెళ్తుండగా కెమెరాలకు చిక్కారు. ఈ సందర్భంగా రష్మిక చేతిలో పుష్పగుచ్ఛం ఉంది. బహుశా విజయ్ చేస్తున్న లైగర్ సినిమా నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ను కలవడానికి రష్మికను వెంటబెట్టుకుని వెళ్తుండొచ్చని భావిస్తున్నారు.
లైగర్ షూటింగ్ కోసం చాలా రోజుల నుంచి ముంబయిలోనే ఉంటున్నాడు విజయ్. తన బాలీవుడ్ ఎంట్రీ మూవీ మిషన్ మజ్ను చిత్రీకరణ కోసం రష్మిక కూడా ముంబయికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కలిసినట్లున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు కావడం వల్లే కలిసి ఉండొచ్చు. అంతకుమించి ఈ కలయిక గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదన్నది వారి సన్నిహితుల మాట.
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 రావడం దాదాపు ఖాయమే.…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు పరామర్శలు వెల్లువలా తరలి వస్తున్నాయి. ఏపీ సహా తెలంగాణ…
ఇటీవల టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్లో పెద్ద గొడవ జరిగి అది మీడియా దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ…
బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు…
గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా…
భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష…