మెగా ఫోన్ పట్టి ఒక సినిమా తీయడం అంటే చిన్న విషయం కాదు. అందరూ ఆ పని చేయలేరు. వేరే విభాగాల్లో దశాబ్దాల అనుభవం ఉన్నప్పటికీ దర్శకత్వం చేయడానికి సాహసించరు. నటుల్లో డైరెక్షన్ వైపు అడుగులు వేసేవాళ్లు మరీ తక్కువమంది. ఒకవేళ దర్శకత్వం చేపట్టాలనుకున్నా సేఫ్గా ఒక కమర్షియల్ సినిమా తీయడానికి చూస్తారు. దర్శకులుగా మరీ రిస్క్ చేయడానికి చూడరు. కానీ మలయాళ నటుడు మోహన్ లాల్ మాత్రం మెగా ఫోన్ పెట్టి ఒక మెగా మూవీ తీయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.
ఆయన బరోజ్ అనే సినిమాతో దర్శకుడిగా మారనున్నట్లు ఇంతకుముందు సమాచారం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ సినిమాను అంగరంగ వైభవంగా మొదలుపెట్టాడు లాల్. మమ్ముట్టి, పృథ్వీరాజ్, దిలీప్, ప్రియదర్శన్ లాంటి అతిరథ మహారథులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుక నిర్వహించిన తీరుతోనే ఇదొక ప్రతిష్టాత్మక చిత్రం అనే విషయం అర్థమైపోయింది.
వాస్కోడిగామా దగ్గర నిధి పరిరక్షకుడిగా ఉన్న బరోజ్ ఆనే చరిత్రకారుడి కథతో ఈ సినిమా తెరకెక్కనుండటం విశేషం. ఇందులో బరోజ్ పాత్ర చేయబోతోంది మోహన్ లాలే. కేరళ-పోర్చుగల్ నేపథ్యంలో కొన్ని వందల కిందటి సంవత్సరాల పరిస్థితుల్లో ఈ కథ నడుస్తుందట. ప్రొడక్షన్ డిజైన్ అంతా కూడా ప్రపంచ స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నాడు మోహన్ లాల్. రూ.200 కోట్ల బడ్జెట్లో ఈ సినిమా తెరకెక్కనుందట. ఈ చిత్రాన్ని త్రీడీలో తీయబోతుండటం విశేషం.
ఇంత భారీ ప్రాజెక్టును కొమ్ములు తిరిగిన దర్శకులే డీల్ చేయడానికి భయపడతారు. అలాంటిది ఒక నటుడు దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ ఇంత భారీ సినిమాను నెత్తికెత్తుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. బరోజ్ ఫస్ట్ లుక్లో లాల్ అవతారం కూడా చాలా భిన్నంగా కనిపిస్తోంది. సినిమా గ్రాండియర్ను చాటేలా ఉంది ఫస్ట్ లుక్. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సమకూర్చనుండటం విశేషం. దృశ్యం-2 నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్లో ఈ సినిమా తెరకెక్కనుంది.
This post was last modified on March 25, 2021 10:18 am
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…