మెగాస్టార్ చిరంజీవి తెరపైనే కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ హీరోనే అని ఇండస్ట్రీ జనాలు చాలామంది అంటారు. ఆయన వివిధ సందర్భాల్లో తమకు చేసిన సాయాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంటారు. ఐతే టాలీవుడ్ జనాలు ఇలా చిరు గొప్పదనం గురించి చెప్పడం మామూలే. కానీ ఇప్పుడు ఓ అగ్ర తమిళ నటుడు చిరు సాయం గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.
తన జీవితాన్ని నిలబెట్టింది చిరునే అంటూ ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆ నటుడు శరత్ కుమార్ కావడం విశేషం. చిరుతో గ్యాంగ్ లీడర్, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమాల్లో శరత్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఐతే తాను హీరోగా నిలదొక్కుకోవడానికి ముందు ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నానని.. అప్పుడు తనను ఆదుకుంది చిరునే అని శరత్ వెల్లడించాడు.
తన భార్య రాధికతో కలిసి ఓ తెలుగు ఛానెల్తో మాట్లాడిన శరత్.. ఈ ఉదంతం గురించి వివరించారు. తన ఆర్థిక కష్టాల గురించి ఓ నిర్మాతతో చెబితే.. చిరంజీవి డేట్లు ఇప్పిస్తే సినిమా తీసి అందులోంచి వచ్చిన లాభంతో తన కష్టాలన్నీ తీరుస్తానని ఆయన చెప్పారని.. దీంతో తాను చిరును కలవడానికి వెళ్లానని శరత్ తెలిపాడు.
ఓ స్టూడియోలో షూటింగ్ జరుగుతుండగా.. తాను వెళ్లి పర్సనల్గా మాట్లాడాలని అంటే మధ్యాహ్నం తర్వాత షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ తనను చిరు ఇంటికి తీసుకెళ్లాడని.. భోజనం చేయించి తనకు వడ్డించాడని తర్వాత తాను తన కష్టం చెప్పుకున్నానని శరత్ వెల్లడించాడు. అప్పటికి ఓ సినిమా కమిట్మెంట్ ఉందని.. అదయ్యాక సినిమా చేస్తానన్నాడని.. రెమ్యూనరేషన్ గురించి అడిగితే, నువ్వు కష్టాల్లో ఉండి సాయం అడిగితే రెమ్యూనరేషన్ ఎలా తీసుకుంటానంటూ ఫ్రీగా కాల్ షీట్లు ఇచ్చాడని శరత్ తెలిపాడు.
ఈ సంగతి చెబుతూ.. శరత్ గొంతు బొంగురుబోయింది. కళ్లలో నీళ్లు కూడా తిరిగాయి. ఐతే చిరు కాల్ షీట్లతో తీసిన సినిమా ఏది అన్నది మాత్రం శరత్ చెప్పలేదు. ఐతే ఈ సాయం వల్లే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని మాత్రం అన్నాడు.
This post was last modified on May 10, 2020 5:09 pm
ఆగస్ట్ నుంచి తప్పుకున్నాక ది ప్యారడైజ్ కొత్త విడుదల తేదీ ఇప్పటిదాకా ప్రకటించలేదు. సెప్టెంబర్ 24 అని బలంగా ప్రచారం…
ఈ నెల 30 విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురంకు ప్రమోషన్లు జోరుగా జరుగుతున్నాయి. అయితే గ్రౌండ్ లెవెల్ లో మాత్రం…
ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తే కాక్రోచ్లు లేస్తాయని, ఆంధ్రప్రదేశ్లో తాము కూడా కాక్రోచ్లమేనని అని స్వయాన మాజీ ముఖ్యమంత్రి వైఎస్…
రాజకీయ రంగప్రవేశానికి ముందు ఇదే తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించుకున్న జన నాయకుడు థియేటర్లలో అడుగు పెట్టేసింది. తమిళనాడులో…
యువత, సోలో లాంటి చిత్రాలతో మెప్పించి.. ‘గీత గోవిందం’ చిత్రంతో తెలుగులో మంచి డిమాండ్ తెచ్చుకున్న దర్శకుడు పరశురామ్. ఆ…
వైద్య విద్య చదవాలని అనుకునే విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఏక కాలంలో నిర్వహించే 'నీట్' పరీక్షకు సంబధించిన ప్రశ్నపత్రం లీకై.. సరిగ్గా…