మెగాస్టార్ చిరంజీవి తెరపైనే కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ హీరోనే అని ఇండస్ట్రీ జనాలు చాలామంది అంటారు. ఆయన వివిధ సందర్భాల్లో తమకు చేసిన సాయాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంటారు. ఐతే టాలీవుడ్ జనాలు ఇలా చిరు గొప్పదనం గురించి చెప్పడం మామూలే. కానీ ఇప్పుడు ఓ అగ్ర తమిళ నటుడు చిరు సాయం గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.
తన జీవితాన్ని నిలబెట్టింది చిరునే అంటూ ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆ నటుడు శరత్ కుమార్ కావడం విశేషం. చిరుతో గ్యాంగ్ లీడర్, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమాల్లో శరత్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఐతే తాను హీరోగా నిలదొక్కుకోవడానికి ముందు ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నానని.. అప్పుడు తనను ఆదుకుంది చిరునే అని శరత్ వెల్లడించాడు.
తన భార్య రాధికతో కలిసి ఓ తెలుగు ఛానెల్తో మాట్లాడిన శరత్.. ఈ ఉదంతం గురించి వివరించారు. తన ఆర్థిక కష్టాల గురించి ఓ నిర్మాతతో చెబితే.. చిరంజీవి డేట్లు ఇప్పిస్తే సినిమా తీసి అందులోంచి వచ్చిన లాభంతో తన కష్టాలన్నీ తీరుస్తానని ఆయన చెప్పారని.. దీంతో తాను చిరును కలవడానికి వెళ్లానని శరత్ తెలిపాడు.
ఓ స్టూడియోలో షూటింగ్ జరుగుతుండగా.. తాను వెళ్లి పర్సనల్గా మాట్లాడాలని అంటే మధ్యాహ్నం తర్వాత షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ తనను చిరు ఇంటికి తీసుకెళ్లాడని.. భోజనం చేయించి తనకు వడ్డించాడని తర్వాత తాను తన కష్టం చెప్పుకున్నానని శరత్ వెల్లడించాడు. అప్పటికి ఓ సినిమా కమిట్మెంట్ ఉందని.. అదయ్యాక సినిమా చేస్తానన్నాడని.. రెమ్యూనరేషన్ గురించి అడిగితే, నువ్వు కష్టాల్లో ఉండి సాయం అడిగితే రెమ్యూనరేషన్ ఎలా తీసుకుంటానంటూ ఫ్రీగా కాల్ షీట్లు ఇచ్చాడని శరత్ తెలిపాడు.
ఈ సంగతి చెబుతూ.. శరత్ గొంతు బొంగురుబోయింది. కళ్లలో నీళ్లు కూడా తిరిగాయి. ఐతే చిరు కాల్ షీట్లతో తీసిన సినిమా ఏది అన్నది మాత్రం శరత్ చెప్పలేదు. ఐతే ఈ సాయం వల్లే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని మాత్రం అన్నాడు.
This post was last modified on May 10, 2020 5:09 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…