Movie News

రామావ‌తారంలో ప్ర‌భాస్‌.. ముహూర్తం ఫిక్స్

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ ఆ స్థాయిలో చేయ‌బోతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆదిపురుష్‌. గ‌త ఏడాది ఇండియాలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చారిత్ర‌క చిత్రం తానాజీ రూప‌క‌ర్త ఓం రౌత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రామాయ‌ణ గాథ‌ను ఈ సినిమా ద్వారా ఇప్పుడున్న టెక్నాల‌జీతో భారీ స్థాయిలో వెండితెర‌పైకి తేవ‌డానికి ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.

బాహుబ‌లిలో చ‌క్ర‌వ‌ర్తి అవ‌తారంలో అంద‌రినీ మెస్మ‌రైజ్ చేసిన ప్ర‌భాస్.. రాముడి అవ‌తారంలో ఎలా ఉండ‌బోతున్నాడ‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది. ఆ అవ‌తారంలో అత‌ణ్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఉత్కంఠ‌తో ఉన్నారు అభిమానులు. ఇందుకు ముహూర్తం ఇప్ప‌టికే కుదిరిన‌ట్లు స‌మాచారం. ఇంకో నెల రోజుల్లోపే ప్ర‌భాస్‌ను రామావ‌తారంలో చూడ‌బోతున్నామ‌న్న‌ది తాజా క‌బురు.

ఏప్రిల్ 21న శ్రీరామ న‌వ‌మి పండుగ రాబోతోంది. ఆదిపురుష్ ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేయ‌డానికి ఇంత‌కంటే మంచి ముహూర్తం మ‌రొక‌టి ఉండ‌ద‌ని చిత్ర బృందం భావిస్తోంది. ఇప్ప‌టికే ఆదిపురుష్ చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. రాముడిగా ప్ర‌భాస్ మేక‌ప్ కూడా వేసుకున్నాడు. కొన్ని స్టిల్స్ కూడా తీశారు. అందులోంచి ఉత్త‌మమైంది తీసుకుని.. దానికి మ‌రిన్ని మెరుగులు దిద్ది ఫ‌స్ట్ లుక్ వ‌ద‌లాల‌ని చిత్ర బృందం నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

దాదాపు రూ.500 కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కున్న ఈ చిత్రాన్ని ఓం రౌత్, భూషణ్ కుమార్‌ల‌తో పాటు ఇంకో ముగ్గురు నిర్మాత‌లు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సీతగా కృతి స‌న‌న్, రావ‌ణుడిగా సైఫ్ అలీ ఖాన్ న‌టిస్తున్నారు. దాదాపు ఏడాది పాటు ప్రి ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చేశాక ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లారు. సినిమాలో స‌గం బ‌డ్జెట్‌ను విజువల్ ఎఫెక్ట్స్ కోస‌మే కేటాయించ‌డం విశేషం.

This post was last modified on March 25, 2021 7:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

34 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

12 hours ago