రామ్ గోపాల్ వర్మకు ట్విట్టర్లో ఎవరో ఒకరిని గిచ్చడం అలవాటు. చురుక్కుమనేలా కామెంట్లు చేసి అవతలి వాళ్లను ఇరుకున పెడుతుంటాడు. ఆయన మాటల చాతుర్యానికి భయపడో.. లేక ఈయనతో పెట్టుకోవడం ఎందుకు అనో చాలామంది ఆయన ట్వీట్లకు బదులివ్వరు. ఒక ఫిలిం మేకర్గా వర్మ తన స్థాయిని కోల్పోయి చాలా కాలం అయింది. గత కొన్నేళ్లలో మరీ పతనం అయిపోయాడు. ఈ నేపథ్యంలో అందరూ ఆయన్ని ఇగ్నోర్ చేస్తున్నారు కూడా. దీంతో వర్మ ఎవరిని ఏ కామెంట్ చేసినా చెల్లిపోతోంది.
కానీ కంగనా రనౌత్ లాంటి విషయంలో ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆమె తన మీద ఏదైనా కామెంట్ చేస్తే ఊరుకునే రకం కాదు. తన విషయంలో చమత్కారం చూపించినా కూడా వెంటనే కౌంటర్ వేసేస్తుంటుంది. తాజాగా ఆమె నటించిన ‘తలైవి’ ట్రైలర్ చూసి వర్మ ఒక ట్వీట్ వేశాడు. దానికి ఆమె తనదైన శైలిలో బదులిస్తూ వర్మకు కౌంటర్ వేసింది.
తలైవి ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ అని.. జయలలిత స్వర్గం నుంచి ఈ ట్రైలర్ చూసి థ్రిల్ అయి ఉంటుందని.. ఇందులో కంగనా సూపర్ డూపర్ స్పెషల్గా ఉందని కామెంట్ చేశాడు. అంత వరక బాగానే ఉంది కానీ.. కంగనా కొన్ని అంశాల్లో పరిమితికి మించి వెళ్లిపోతుందని.. ఆ విషయంలో తాను ఆమెతో ఏకీభవించనని నర్మగర్భమైన వ్యాఖ్య చేశాడు. దీనికి కంగనా తనదైన శైలిలో బదులిచ్చింది.
తాను వర్మతో ఏ విషయంలోనూ ఏకీభవించకపోవడం ఉండదని.. ఆయనంటే తనకు ఇష్టమని, చాలా విషయాల్లో ఆయన్ని అభినందిస్తానని పేర్కొంది. ఇగోలు రాజ్యమేలే ఈ ప్రపంచంలో వర్మ దేనికీ హర్టవడని.. అలాగే వర్మ ఏ విషయాన్నీ సీరియస్గా తీసుకోడని, చివరికి తనను తాను కూడా సీరియస్గా తీసుకోడని కంగనా పేర్కొంది. ఆయన కాంప్లిమెంట్లకు కృతజ్ఞతలని కూడా కంగనా వ్యాఖ్యానించింది. ఐతే వర్మ మరీ నాన్ సీరియస్ అని, తనను తాను సీరియస్గా తీసుకోకపోవడం వల్ల ఆయన స్థాయి పడిపోయిందని పరోక్షంగా కంగనా కౌంటర్ వేయడం గురించి సోషల్ మీడియా చర్చ జరుగుతోంది. వర్మ పొగుడుతున్నట్లే ఆయనకు భలే కౌంటర్ వేసిందంటూ ఆమెను వర్మ వ్యతిరేకులు పొగుడుతున్నారు.
This post was last modified on March 24, 2021 3:51 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…