రెండు రోజులుగా సినీ ప్రియుల చర్చలన్నీ జాతీయ అవార్డుల చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ అవార్డుల్లో కొన్నిటి పట్ల సానుకూలత వ్యక్తమవుతోంది. ‘వెల్ డిజర్వ్డ్’ అంటున్నారు. కొన్ని అవార్డుల విషయంలో వ్యతిరేకతా కనిపిస్తోంది. ఆ సంగతలా వదిలేస్తే తెలుగులో జాతీయ అవార్డులు పొందిన రెండు సినిమాల గురించి కూడా అందరూ బాగానే చర్చించుకుంటున్నారు. కానీ ఈ అవార్డులు పొందిన వారిలో ఒక వ్యక్తి గురించి పెద్దగా డిస్కషన్ లేదు. ఒక నటుడికి అవార్డు వస్తే దాని గురించి ఇండస్ట్రీ హోరెత్తిపోతుంది. దర్శకుడు లేదా సంగీత దర్శకుడికి పురస్కారం దక్కినా దాని గురించి అందరూ చర్చించుకుంటారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయి. కానీ ఒక ఎడిటర్కు అవార్డు అనేసరికి దాని గురించి పెద్దగా చర్చే లేదు. మామూలుగానే సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగాల గురించి మాట్లాడుకునేటపుడు ఎడిటింగ్ గురించి జరిగే చర్చ తక్కువ.
ఎడిటర్ల ప్రతిభ గురించి ఎవ్వరూ పెద్దగా మాట్లాడుకోరు. ఇప్పుడు ‘జెర్సీ’ సినిమాకు ఎడిటింగ్ విభాగంలో జాతీయ పురస్కారం పొందిన నవీన్ నూలి గురించి కూడా సోషల్ మీడియాలో కానీ, బయట కానీ పెద్దగా డిస్కషన్ లేదు. సినిమాకు సంబంధించి అత్యంత కీలకమైన విభాగం ఎడిటింగ్ అని తెలిసినా ఇండస్ట్రీ జనాలు సైతం.. నవీన్ నూలికి పురస్కారం దక్కడం గురించి పెద్దగా స్పందించకపోవడం, అతడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
నిజానికి ఈసారి తెలుగు సినిమాలకు దక్కిన నాలుగు అవార్డుల్లో అత్యంత విలువైనది నవీన్కు దక్కిన పురస్కారమే. ఒక తెలుగు ఎడిటర్కు జాతీయ అవార్డుల్లో వ్యక్తిగత పురస్కారం దక్కినందుకు మనం గర్వించాలి. వేరే టెక్నీషియన్ అయితే సోషల్ మీడియాలో హంగామా చేయించుకునేవాడేమో కానీ.. నవీన్ మామూలుగా కూడా పెద్దగా హడావుడి చేసే వ్యక్తి కాదు. సైలెంటుగా తన పని తాను చేసుకుపోతుంటాడు. సినిమా వేడుకల్లో కూడా పెద్దగా కనిపించడు. నాన్నకు ప్రేమతో, ధ్రువ, రంగస్థలం,అరవింద సమేత లాంటి ఎన్నో భారీ చిత్రాలకు అతను ఎడిటింగ్ చేశాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. రెండు నంది అవార్డులు కూడా సాధించిన నవీన్కు ఇప్పుడు ఏకంగా జాతీయ ఉత్తమ ఎడిటర్ పురస్కారం దక్కింది. ఈ సైలెంట్ హీరోను అభినందించడానికి ఇండస్ట్రీ జనాలు ఇప్పటికైనా ముందుకొస్తారేమో చూడాలి.
This post was last modified on March 24, 2021 1:50 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…