ఏంటి అందాల నిధి ఏమైనా బాబా అవతారం ఎత్తిందా? లేక ఈమె కొంపదీసి డాక్టరు చదివిందా …? అని ఆశ్చర్యపోతున్నారా? అదేం కాదు. ఆస్క్ నిధి అంటూ లాక్ డౌన్ లో ఖాళీగా ఉన్న నిధి అభిమానులతో ముచ్చటిస్తోంది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇస్తోంది. ఈ సమాధానాలు బట్టి చూస్తే… నిధికి మంచి టైమింగ్ ఉందనిపిస్తోంది. ఒక అభిమాని… ‘‘నీకు సూపర్ పవర్స్ ఉంటే ఏం చేసేదానివి’’ అని అడిగారు. దానికి చాలా స్పాంటేనియస్ గా… కరోనాను నయం చేస్తాను అంటూ చెప్పింది. ఈ సమాధానానికి అభిమానులు ఫిదా అయ్యారు.
మరో అభిమాని నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంట్లో చూసిన సంబంధం చేసుకుంటావా అంటే… నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా అంటూ ఆశ్చర్యపరిచింది. అంతకుముందు ఒక అభిమాని నువ్వు సింగిలా అని అడిగితే అవును సింగిలే అంది. అభిమానులను ఏమని వర్ణిస్తావు అంటే ’బంగారమ్స్’ అంటూ ముద్దుగా చెప్పింది. ఓ అభిమాని అందరికీ రిప్లై ఇస్తావు నాకెందుకు ఇవ్వవు అంటే… సారీ బంగారం నాకున్నది రెండు చేతులేగా అంటూ క్యూట్ గా చెప్పింది. అచ్చ తెలుగు అభిమాని అడగడానికి ఏమీ లేదన్నట్టు నీకు పచ్చళ్లు ఇష్టమా అని అడిగాడు. ఇంతకుముందు కాదు.. లాక్ డౌన్ కారణంగా వాటికి ఫ్యాన్ అయ్యాను, తెగ తింటున్నాను అని చెప్పింది. అపజయాలను ఎలా తీసుకుంటావు అని అడిగితే… త్రివిక్రమ్ స్టైల్లో విజయంతో చంపేస్తా, నవ్వుతో పూడ్చేస్తా అని పంచ్ పేల్చింది. కాఫీ తాగుతావా? టీ తాగుతావా? అని ఓ చిలిపి ప్రశ్న ఎదురవగా.. ఇంట్లో టీ, బయట కాఫీ అంటూ కాఫీ-టీ రెండింటి అభిమానులను మెప్పించింది. నువ్వు సినిమా చేసిన రామ్ గురించి ఓ మాట చెప్పమంటే… ఒకటి కాదు, రెండు చెప్తా అంటూ… ’’డబుల్ దిమాక్‘‘ అని వ్యాఖ్యానించింది.
ఇంకా ఏం చెప్పిందంటే… తాను నిత్యం ధ్యానం చేస్తానని, అనిమల్ లవర్ ని అని చెప్పింది. ఏ మాటకామాట… నిధిలో టైమింగ్ తో పాటు సెన్సాఫ్ హ్యూమర్ కాస్త ఎక్కువే ఉన్నట్టు అర్థమవుతోంది. ఏ సమాధానమైనా తుడుముకోకుండా చెప్పడమే కాకుండా… ఆసక్తికరంగా చెబుతోంది. అందాల నిధివే కాదు, జ్జాన నిధివి కూడా అనాలేమో !
This post was last modified on April 9, 2020 6:28 pm
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…