గుత్తా జ్వాల త్వరలోనే మళ్లీ పెళ్లి కూతురు కాబోతోంది. ఈ విషయాన్ని ఆమెకు కాబోయే భర్త, తమిళ నటుడు విష్ణు విశాల్ ధ్రువీకరించాడు. రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన అరణ్య సినిమా తెలుగు, తమిళ వెర్షన్లలో విష్ణు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్కు వచ్చిన విష్ణు.. జ్వాలతో తన ప్రేమాయణం, పెళ్లి గురించి వెల్లడించాడు.
కొన్ని నెలల కిందట విష్ణు పుట్టిన రోజు సందర్భంగా అతడితో జ్వాల రింగ్ తొడిగించుకుని తామిద్దరం ఎంగేజ్ అయినట్లుగా వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ తర్వాత పెళ్లి గురించే ఏ చర్చా లేకపోయింది. ఐతే అరణ్య ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. జ్వాల, తాను అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని.. తెలుగు అల్లుడు కాబోతున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు విష్ణు.
జ్వాలను పెళ్లి చేసుకోవడమే కాదు.. ఆమె జీవితాన్ని వెండితెరపైకి తీసుకొస్తానని విష్ణు తెలిపాడు. జ్వాల జీవితంలో సినిమాకు సరిపడా డ్రామా ఉందని, ఆమె ఆటలో గొప్ప స్థాయిని అందుకుందని విష్ణు అన్నాడు. తన సొంత బేనర్లో జ్వాలపై సినిమా తీయబోతున్నట్లు అతను వెల్లడించాడు. తెలుగులోకి రీమేక్ అయిన భీమిలి కబడ్డీ జట్టు, సిల్లీ ఫెలోస్, రాక్షసుడు లాంటి చిత్రాల మాతృకలతో తమిళంలో పెద్ద విజయాలందుకున్నాడు విష్ణు.
ప్రస్తుతం అతను హీరోగా మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. విష్ణుకు సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. అతడి తండ్రి ఐపీఎస్ అధికారి. తమిళనాట పెద్ద పోస్టులో ఉన్నారు. విష్ణుకు ఇంతకుముందు ఓ అమ్మాయితో పెళ్లవగా.. తనతో పొసగక విడాకులు తీసుకున్నాడు. జ్వాల సైతం తన సహచర బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ను పెళ్లి చేసుకుని కొన్నేళ్ల తర్వాత అతడి నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే.
This post was last modified on March 24, 2021 7:19 am
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…