గుత్తా జ్వాల త్వరలోనే మళ్లీ పెళ్లి కూతురు కాబోతోంది. ఈ విషయాన్ని ఆమెకు కాబోయే భర్త, తమిళ నటుడు విష్ణు విశాల్ ధ్రువీకరించాడు. రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన అరణ్య సినిమా తెలుగు, తమిళ వెర్షన్లలో విష్ణు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్కు వచ్చిన విష్ణు.. జ్వాలతో తన ప్రేమాయణం, పెళ్లి గురించి వెల్లడించాడు.
కొన్ని నెలల కిందట విష్ణు పుట్టిన రోజు సందర్భంగా అతడితో జ్వాల రింగ్ తొడిగించుకుని తామిద్దరం ఎంగేజ్ అయినట్లుగా వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ తర్వాత పెళ్లి గురించే ఏ చర్చా లేకపోయింది. ఐతే అరణ్య ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. జ్వాల, తాను అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని.. తెలుగు అల్లుడు కాబోతున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు విష్ణు.
జ్వాలను పెళ్లి చేసుకోవడమే కాదు.. ఆమె జీవితాన్ని వెండితెరపైకి తీసుకొస్తానని విష్ణు తెలిపాడు. జ్వాల జీవితంలో సినిమాకు సరిపడా డ్రామా ఉందని, ఆమె ఆటలో గొప్ప స్థాయిని అందుకుందని విష్ణు అన్నాడు. తన సొంత బేనర్లో జ్వాలపై సినిమా తీయబోతున్నట్లు అతను వెల్లడించాడు. తెలుగులోకి రీమేక్ అయిన భీమిలి కబడ్డీ జట్టు, సిల్లీ ఫెలోస్, రాక్షసుడు లాంటి చిత్రాల మాతృకలతో తమిళంలో పెద్ద విజయాలందుకున్నాడు విష్ణు.
ప్రస్తుతం అతను హీరోగా మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. విష్ణుకు సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. అతడి తండ్రి ఐపీఎస్ అధికారి. తమిళనాట పెద్ద పోస్టులో ఉన్నారు. విష్ణుకు ఇంతకుముందు ఓ అమ్మాయితో పెళ్లవగా.. తనతో పొసగక విడాకులు తీసుకున్నాడు. జ్వాల సైతం తన సహచర బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ను పెళ్లి చేసుకుని కొన్నేళ్ల తర్వాత అతడి నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే.
This post was last modified on March 24, 2021 7:19 am
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…