గుత్తా జ్వాల త్వరలోనే మళ్లీ పెళ్లి కూతురు కాబోతోంది. ఈ విషయాన్ని ఆమెకు కాబోయే భర్త, తమిళ నటుడు విష్ణు విశాల్ ధ్రువీకరించాడు. రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన అరణ్య సినిమా తెలుగు, తమిళ వెర్షన్లలో విష్ణు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్కు వచ్చిన విష్ణు.. జ్వాలతో తన ప్రేమాయణం, పెళ్లి గురించి వెల్లడించాడు.
కొన్ని నెలల కిందట విష్ణు పుట్టిన రోజు సందర్భంగా అతడితో జ్వాల రింగ్ తొడిగించుకుని తామిద్దరం ఎంగేజ్ అయినట్లుగా వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ తర్వాత పెళ్లి గురించే ఏ చర్చా లేకపోయింది. ఐతే అరణ్య ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. జ్వాల, తాను అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని.. తెలుగు అల్లుడు కాబోతున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు విష్ణు.
జ్వాలను పెళ్లి చేసుకోవడమే కాదు.. ఆమె జీవితాన్ని వెండితెరపైకి తీసుకొస్తానని విష్ణు తెలిపాడు. జ్వాల జీవితంలో సినిమాకు సరిపడా డ్రామా ఉందని, ఆమె ఆటలో గొప్ప స్థాయిని అందుకుందని విష్ణు అన్నాడు. తన సొంత బేనర్లో జ్వాలపై సినిమా తీయబోతున్నట్లు అతను వెల్లడించాడు. తెలుగులోకి రీమేక్ అయిన భీమిలి కబడ్డీ జట్టు, సిల్లీ ఫెలోస్, రాక్షసుడు లాంటి చిత్రాల మాతృకలతో తమిళంలో పెద్ద విజయాలందుకున్నాడు విష్ణు.
ప్రస్తుతం అతను హీరోగా మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. విష్ణుకు సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. అతడి తండ్రి ఐపీఎస్ అధికారి. తమిళనాట పెద్ద పోస్టులో ఉన్నారు. విష్ణుకు ఇంతకుముందు ఓ అమ్మాయితో పెళ్లవగా.. తనతో పొసగక విడాకులు తీసుకున్నాడు. జ్వాల సైతం తన సహచర బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ను పెళ్లి చేసుకుని కొన్నేళ్ల తర్వాత అతడి నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే.
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…