ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ కొందరు మాత్రం ముందు రచ్చ గెలిచి ఇంట గెలవడానికి వస్తుంటారు. సినీ రంగంలో ఇది చాలామంది విషయంలో జరిగింది. ఐశ్వర్యా రాజేష్ కూడా ఈ కోవకే వస్తుంది. ఈమె తెలుగమ్మాయి అనే సంగతి చాలామందికి తెలియదు. ఆమె తండ్రి రాజేష్ 80ల్లో తెలుగులో బిజీ ఆర్టిస్ట్. అనారోగ్యంతో తక్కువ వయసులోనే అతను కాలం చేశాడు. ముందు నుంచి రాజేష్ కుటుంబం చెన్నైలోనే ఉండటంతో ఆయన పోయాక కూడా కుటుంబం అక్కడే ఉండిపోయింది. తండ్రి మరణానంతరం ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని, కొంతం కాలం ఉద్యోగం చేసి.. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టి చిన్న చిన్న పాత్రలతో సత్తా చాటి.. ఆ తర్వాత కథానాయికగా స్థిరపడింది ఐశ్వర్య.
ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరుగా ఉంటోంది ఐశ్వర్య. ఐతే ఆమె రెగ్యులర్ స్టార్ హీరోయిన్ల లాగా గ్లామర్ రోల్స్ పెద్దగా చేయదు. ఏదో ఒక ప్రత్యేకత ఉంటే తప్ప ఏ పాత్రా ఒప్పుకోని ఐశ్వర్య.. కాకా ముట్టై, వడ చెన్నై, కనా లాంటి సినిమాలతో సత్తా చాటింది. ఇప్పుడు ఐశ్వర్య కెరీర్లో మైలురాయిగా నిలిచే అవకాశమున్న మరో పాత్ర ఆమె తలుపు తట్టింది. మలయాళంలో గొప్ప సినిమాగా పేరు తెచ్చుకున్న ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ తమిళ రీమేక్లో ఐశ్వర్య ప్రధాన పాత్ర పోషించనుంది. ఇందులో ఆమెకు జోడీగా రాహుల్ రవీంద్రన్ నటించనుండటం విశేషం.
ఒక సంప్రదాయ కుటుంబంలోకి కోడలిగా వచ్చిన అమ్మాయి అక్కడి కట్టుబాట్ల వల్ల ఎలా ఇబ్బంది పడింది.. ఇంతగా అభివృద్ధి చెందాక కూడా మహిళల్ని సమాజం ఎలా తక్కువగా చూస్తుంది.. చదువుకున్న భర్తలు కూడా కట్టుబాట్ల పేరుతో మహిళల పట్ల ఎలా వివక్ష చూపిస్తారనే అంశాల్ని చాలా సున్నితంగా చర్చించిన సినిమా ఇది. చిన్న కాన్సెప్ట్ తీసుకుని హృద్యంగా తెరకెక్కించిన ఈ చిత్రం గొప్ప ప్రశంసలు అందుకుంది. ఒరిజినల్లో సూరజ్, నిమిష ప్రధాన పాత్రలు పోషించారు. సినిమాలో హీరోయిన్దే అత్యంత కీలక పాత్ర. అలాంటి క్యారెక్టర్ ఐశ్వర్యను వెతుక్కుంటూ వచ్చింది. ఈ సినిమాతో ఐష్ పేరు మరోసారి కోలీవుడ్లో హాట్ టాపిక్ అవడం గ్యారెంటీ అంటున్నారు. రాహుల్, ఐశ్వర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయమే కాబట్టి ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.
This post was last modified on March 23, 2021 1:05 pm
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…