టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లలో గీతా ఆర్ట్స్ ఒకటి. దాదాపు నాలుగు దశాబ్దాల ఈ బేనర్లో సినిమాలు తీస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్లతో భారీ చిత్రాలు తీసి పెద్ద విజయాలు అందుకున్న ఘనత ఆ సంస్థ సొంతం.
ఐతే ఇలా భారీ చిత్రాలకు పరిమితం కాకుండా.. చిన్న, మీడియం బడ్జెట్లలో సినిమాలు తీయడం కోసం కొన్నేళ్ల కిందట ‘జీఏ2 పిక్చర్స్’ పేరుతో కొత్త సంస్థను నెలకొల్పారు అల్లు అరవింద్.
అల్లు అర్జున్కు అత్యంత సన్నిహితుడు, గీతా ఆర్ట్స్లో ప్రొడక్షన్ పనులు చూసే బన్నీ వాసు ఈ సంస్థ బాధ్యతలు చేపట్టాడు. యువి క్రియేషన్స్ భాగస్వామ్యంతో జీఏ2 నిర్మించిన తొలి చిత్రం ‘భలే భలే మగాడివోయ్’ బ్లాక్బస్టర్ అయి ఈ సంస్థకు శుభారంభాన్నందించింది. ఆ తర్వాత ఈ బేనర్ నుంచి వచ్చిన ప్రతి సినిమా సక్సెస్ అయింది.
‘గీత గోవిందం’, ‘ట్యాక్సీవాలా’; ‘ప్రతి రోజూ పండగే’.. ఈ సినిమా ఫలితాలేంటో తెలిసిందే. కన్నడలో ‘భలే భలే మగాడివోయ్’ రీమేక్ చేస్తే అది కూడా మంచి విజయం సాధించింది. ఇలా మొదలైనప్పటి సక్సెస్ స్ట్రీక్ కొనసాగిస్తున్న ఈ సంస్థను ఇప్పుడు తొలి పరాజయం పలకరించినట్లే ఉంది. జీఏ2లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘చావు కబురు చల్లగా’ అంచనాల్ని అందుకోలేకపోయింది.
ఈ సినిమా గురించి అల్లు అర్జున్ సహా అందరూ చాలా గొప్పగా చెప్పేశారు కానీ.. చివరికి చూస్తే అంత విషయం లేదని ప్రేక్షకులు తేల్చేశారు. జీఏ2కు ఉన్న గుడ్ విల్ వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ పర్వాలేదు. తొలి రోజు ఓపెనింగ్స్ కూడా ఓ మోస్తరుగా వచ్చాయి. కానీ నెగెటివ్ టాక్, రివ్యూలు సినిమాను దెబ్బ కొట్టాయి. రెండో రోజు నుంచి ఈ చిత్రానికి వసూళ్లు పడిపోయాయి. వీకెండ్ వరకు ఎలాగోలా నెట్టుకురావచ్చు కానీ.. తర్వాత సినిమా నిలబడ్డం కష్టంలాగే ఉంది. జీఏ2 ఖాతాలో తొలి ఫ్లాప్ జమ కావడం లాంఛనమే.
This post was last modified on March 21, 2021 2:30 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…