ఒక సినిమా ప్రమోషన్లలో అత్యంత కీలకం హీరోనే. హీరోయిన్, దర్శకుడు, నిర్మాత, మిగతా నటీనటులు, టెక్నీషియన్లు.. ఇలా ఎందరు సినిమాను ప్రమోట్ చేసినా, హీరో రంగంలోకి దిగితే వచ్చే పబ్లిసిటీనే వేరు. ముఖ్యంగా హీరోల చుట్టూనే అన్నీ తిరిగే టాలీవుడ్లో.. సినిమాల ప్రమోషన్లలో వారి పాత్ర ఇంకా కీలకం. గత కొన్నేళ్లలో లాంగ్ రన్కు కాలం చెల్లి.. తొలి వారం వసూళ్లే అత్యంత ప్రధానంగా మారిన నేపథ్యంలో స్టార్ హీరోలందరూ ప్రమోషన్ ప్రాధాన్యాన్ని గుర్తించి తమ చిత్రాలకు మాంచి పబ్లిసిటీ ఇస్తున్నారు. ఒకప్పుడు తన సినిమాల వేడుకల్లో కూడా పాల్గొనని మహేష్ బాబు సైతం ఈ మధ్య తన చిత్రం విడుదల అనగానే ప్రెస్ మీట్లలో పాల్గొనడంతో పాటు టీవీ ఛానెళ్లకు కూడా వెళ్లి ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇలాంటి రోజుల్లో కూడా ప్రమోషన్లకు దూరంగా ఉంటున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే.
పవన్ మహా అయితే తన సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు వస్తాడు. అక్కడ కూడా సినిమా అలా ఉంది ఇలా ఉంది అనేమీ మాట్లాడడు. ప్రమోషన్కు పెద్దగా ఉపయోగపడని మాటలేవో కొన్ని మాట్లాడి వెళ్లిపోతాడు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లాంటి ఒకటీ అరా చిత్రాలకు మాత్రమే పవన్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అంతకుమించి తన సినిమాలను ప్రమోట్ చేసింది లేదు. మూడేళ్ల విరామం తర్వాత తన నుంచి ‘వకీల్ సాబ్’ సినిమా వస్తుంటే.. ఇప్పుడు కూడా పవన్లో ఏమీ కదలిక లేదు. ఈ సినిమా గురించి ఒక్క ట్వీట్ కూడా వేయలేదు పవన్. ఇక బయట ప్రమోషన్ల గురించి చెప్పాల్సిన పని లేదు.
దర్శకుడు వేణు శ్రీరామ్, సంగీత దర్శకుడు తమన్, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి కలిసి టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలిస్తూ సినిమాను ప్రమోట్ చేస్తుండటం విశేషం. దుండిగల్లో ఏర్పాటు చేసిన మ్యూజిక్ ఫెస్టివల్లో కూడా వీళ్లే కీలకం కానున్నారు. పవన్ ఈ వేడుకకు వచ్చే అవకాశం లేదు. ఏప్రిల్ 3న ప్రి రిలీజ్ ఈవెంట్లో మాత్రమే పవన్ పాల్గొనబోతున్నాడు. ఐతే పవన్ ‘వకీల్ సాబ్’ను ప్రమోట్ చేయకపోతేనేం.. కేవలం ప్రోమోలతోనే ఆ చిత్రం కావాల్సినంత క్రేజ్ సంపాదించుకుంది. నిజానికి పవన్ తన సినిమాను ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎప్పుడూ లేదు. ఆయన ప్రతి చిత్రానికీ కావాల్సినంత హైప్ వస్తుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే హైప్ డబుల్ అవుతుంది. వసూళ్ల మోత మోగిపోతుంది. ఇలాంటి క్రేజ్ అందరు స్టార్లకూ సాధ్యం కాదు.
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…