ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసినా ‘జాతిరత్నాలు’ గురించే చర్చంతా. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వచ్చింది. హీరో నవీన్ పొలిశెట్టి అయితే ఈ సినిమాతో మంచి మార్కెట్ తెచ్చుకుని మంచి స్థాయికి వెళ్లేట్లే కనిపిస్తున్నాడు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలకు ఇంకా డిమాండ్ పెరిగేలా ఉంది. ఈ చిత్రంతోనే కథానాయికగా పరిచయం అయిన ఫారియా అబ్దుల్లాకు సైతం చాలా మంచి పేరే వచ్చింది. కాకపోతే ట్రెడిషనల్ గ్లామర్ హీరోయిన్ల లాగా కాకుండా టిపికల్గా కనిపించే ఈ అమ్మాయికి కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు దక్కుతాయా.. ఆమెను గ్లామర్ తారగా చూడ్డానికి జనాలు ఇష్టపడతారా అన్నదే కొంచెం సందేహంగా ఉంది. కానీ టాలీవుడ్ ఫిలిం మేకర్స్ అలా ఏమీ ఆలోచిస్తున్నట్లు లేరు. ఆమెకు ఒక పెద్ద స్టార్ సరసన ఓ కమర్షియల్ సినిమాలోనే కథానాయికగా అవకాశం దక్కడం విశేషం.
తన రెండో సినిమాలో మాస్ రాజా రవితేజతో రొమాన్స్ చేయబోతోంది ఫారియా అబ్దుల్లా. ప్రస్తుతం ‘ఖిలాడి’లో నటిస్తున్న రవితేజ.. దీని తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు ఖరారయ్యారు. తమిళ అమ్మాయి ఐశ్వర్యా మీనన్తో పాటు కన్నడ భామ శ్రీలీలను కథానాయికలుగా ఎంపిక చేశారు. అంతటితో హీరోయిన్ల సంగతి ఓకే అయినట్లే అనుకున్నారు. కానీ ఈ చిత్రంలో ఫారియా సైతం ఒక పాత్రకు ఎంపిక కావడం విశేషం. అదేమీ స్పెషల్ రోల్ కూడా కాదు. రవితేజకు జోడీగానే ఆమె కూడా నటించబోతున్నట్లు చెబుతున్నారు. మరి ముగ్గురు హీరోయిన్లకు ఈ సినిమాలో ఎంత స్కోప్ ఉంటుందో.. ఫారియా ఏమాత్రం తన ప్రత్యేకతను చాటుకుంటుందో చూడాలి. తొలి చిత్రంలో ఒక మామూలు అమ్మాయిలా కనిపించిన ఫారియా.. ఈ చిత్రంలో గ్లామరస్గా కనిపించి తనలో కొత్త కోణాన్ని చూపిస్తుందేమో చూడాలి.
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…