తమిళ సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తుతూ జననాథన్ అనే మంచి అభిరుచి ఉన్న, సీనియర్ దర్శకుడు మూడు రోజుల కిందటే మృతి చెందాడు. ఈయన విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్, జగపతిబాబుల కలయికలో లాభం అనే సినిమా తీశాడు ఈ మధ్యే. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగానే హఠాత్తుగా అనారోగ్యం పాలై ప్రాణాలు విడిచారు.
ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తేల్చారు. ఇంకో మూడు రోజులకే, అంటే మార్చి 14న ఆయన తుది శ్వాస విడిచారు. ఆ రోజే అంత్యక్రియలు జరిగాయి. ఐతే మరో మూడు రోజులకే జననాథన్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి లక్ష్మి గుండెపోటుతో బుధవారం మరణించడం అందరినీ కలచి వేస్తోంది.
లక్ష్మి జననాథన్ అంత్యక్రియల్లోనూ పాల్గొంది. ఆమె ఆ రోజు తీవ్ర విషాదంలో మునిగిపోయినట్లు సన్నిహితులు చెబుతున్నారు. సోదరుడి మరణాన్ని తట్టుకోలేకే లక్ష్మి గుండెపోటుకు గురై ఉండొచ్చని భావిస్తున్నారు. జననాథన్ మృతినే తట్టుకోలేకపోతున్న ఆ కుటుంబం.. ఆయన సోదరిని కూడా కోల్పోవడంతో మరింత విషాదంలో మునిగిపోయింది.
ఇదిలా ఉండగా జననాథన్ చివరి సినిమాలో కథానాయకుడిగా నటించిన విజయ్ సేతుపతి తన దర్శకుడి కుటుంబానికి అండగా నిలిచిన వైనం ప్రశంసలందుకుంటోంది. జననాథన్ ఆసుపత్రి ఖర్చులన్నీ అతనే చూసుకోవడమే కాదు.. అంత్యక్రియల బాధ్యత కూడా అతనే తీసుకున్నాడట. వేరే సినిమా షూటింగ్లో ఉన్నవాడు.. జననాథన్కు పరిస్థితి విషమం కాగానే ఆసుపత్రికి వచ్చేసి ఆయన చనిపోయాక అంత్యక్రియలన్నీ పూర్తయ్యే వరకు ఆ కుటుంబానికి తోడుగా ఉన్నట్లు సమాచారం.
This post was last modified on March 18, 2021 9:10 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…