నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారుతున్నాడంటే.. ఆశ్చర్యంగా చూసిన వాళ్లే ఎక్కువ. ఇతనేంటి దర్శకుడేంటి అని చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ అతను చాలా తక్కువ బడ్జెట్లో, ఎన్నో పరిమితుల మధ్య ‘చి ల సౌ’ లాంటి మంచి సినిమాను అందించి ఆశ్చర్యపరిచాడు. ఓ తొలి చిత్ర దర్శకుడు ఇంత బాగా సినిమా తీయడం అందరికీ పెద్ద షాక్. పైగా ఓ నటుడు దర్శకుడిగా మారి ఇలాంటి ఔట్ పుట్ ఇవ్వడమూ ఆశ్చర్యమే.
ఐతే తొలి సినిమాతో తనపై భారీగా పెరిగిన అంచనాలను రెండో సినిమాతో రాహుల్ అందుకోలేకపోయాడు. అక్కినేని నాగార్జున లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశాన్ని అతను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ‘మన్మథుడు-2’ లాంటి డిజాస్టర్ అందించాడు. దీంతో రాహుల్పై పెరిగిన అంచనాలన్నీ తలకిందులు అయిపోయాయి. అతడి కెరీర్ డోలాయమానంలో పడిపోయింది.
‘మన్మథుడు-2’ రిలీజై ఏడాదిన్నర దాటిపోగా రాహుల్ ఇప్పటికీ తన తర్వాతి సినిమాను ప్రకటించలేకపోయాడు. అతను నటుడిగా కూడా సినిమాలేమీ చేస్తున్నట్లు కనిపించడం లేదు. మరి దర్శకుడిగా అతడికి అవకాశం ఇచ్చేదెవరు అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఐతే టాలీవుడ్లో బిజీయెస్ట్ బేనర్లలో ఒకటైన గీతా ఆర్ట్స్ అతడితో సినిమా తీయడానికి రెడీ అయినట్లు సమాచారం బయటికి వచ్చింది.
రాహుల్ రవీంద్రన్ చెప్పిన ఒక లేడీ ఓరియెంటెడ్ కథకు అల్లు అరవింద్, బన్నీ వాసు ఆమోద ముద్ర వేశారు. త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కబోతోంది. వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాహుల్తో జీఏ-2 బేనర్లో సినిమా రాబోతోందని బన్నీ వాసు స్వయంగా ధ్రువీకరించాడు. మరి రాహుల్ కథలో లీడ్ రోల్ చేయబోయే హీరోయిన్ ఎవరన్నది ఆసక్తికరం. రెండో సినిమా తరహాలో నేల విడిచి సాము చేయకుండా తన పరిధిలో రాహుల్ మంచి సినిమా అందిస్తాడని ఆశిద్దాం.
This post was last modified on March 17, 2021 3:57 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…