నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారుతున్నాడంటే.. ఆశ్చర్యంగా చూసిన వాళ్లే ఎక్కువ. ఇతనేంటి దర్శకుడేంటి అని చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ అతను చాలా తక్కువ బడ్జెట్లో, ఎన్నో పరిమితుల మధ్య ‘చి ల సౌ’ లాంటి మంచి సినిమాను అందించి ఆశ్చర్యపరిచాడు. ఓ తొలి చిత్ర దర్శకుడు ఇంత బాగా సినిమా తీయడం అందరికీ పెద్ద షాక్. పైగా ఓ నటుడు దర్శకుడిగా మారి ఇలాంటి ఔట్ పుట్ ఇవ్వడమూ ఆశ్చర్యమే.
ఐతే తొలి సినిమాతో తనపై భారీగా పెరిగిన అంచనాలను రెండో సినిమాతో రాహుల్ అందుకోలేకపోయాడు. అక్కినేని నాగార్జున లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశాన్ని అతను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ‘మన్మథుడు-2’ లాంటి డిజాస్టర్ అందించాడు. దీంతో రాహుల్పై పెరిగిన అంచనాలన్నీ తలకిందులు అయిపోయాయి. అతడి కెరీర్ డోలాయమానంలో పడిపోయింది.
‘మన్మథుడు-2’ రిలీజై ఏడాదిన్నర దాటిపోగా రాహుల్ ఇప్పటికీ తన తర్వాతి సినిమాను ప్రకటించలేకపోయాడు. అతను నటుడిగా కూడా సినిమాలేమీ చేస్తున్నట్లు కనిపించడం లేదు. మరి దర్శకుడిగా అతడికి అవకాశం ఇచ్చేదెవరు అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఐతే టాలీవుడ్లో బిజీయెస్ట్ బేనర్లలో ఒకటైన గీతా ఆర్ట్స్ అతడితో సినిమా తీయడానికి రెడీ అయినట్లు సమాచారం బయటికి వచ్చింది.
రాహుల్ రవీంద్రన్ చెప్పిన ఒక లేడీ ఓరియెంటెడ్ కథకు అల్లు అరవింద్, బన్నీ వాసు ఆమోద ముద్ర వేశారు. త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కబోతోంది. వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాహుల్తో జీఏ-2 బేనర్లో సినిమా రాబోతోందని బన్నీ వాసు స్వయంగా ధ్రువీకరించాడు. మరి రాహుల్ కథలో లీడ్ రోల్ చేయబోయే హీరోయిన్ ఎవరన్నది ఆసక్తికరం. రెండో సినిమా తరహాలో నేల విడిచి సాము చేయకుండా తన పరిధిలో రాహుల్ మంచి సినిమా అందిస్తాడని ఆశిద్దాం.
This post was last modified on March 17, 2021 3:57 pm
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ వేగంగా జరిగిపోతోంది. మార్చి 26 రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ హఠాత్తుగా మార్చి…
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ లో ఒకటిగా నిర్మాణంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్యాన్ ప్యాన్…
విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది.…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న జనసేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాన్ని గత నెలలోనే ప్రారంభించిన…
పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా నాయకులు పనిచేయాలని.. ఎమ్మెల్యేలు-ఎంపీలు కలివిడిగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు సూచించారు. నంద్యాల…
సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో.. దేనికి మురిసిపోతారో? ఏ విషయానికి ఆగ్రహానికి గురవుతారో అంచనా వేయటం అంత తేలికైన విషయం…