నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారుతున్నాడంటే.. ఆశ్చర్యంగా చూసిన వాళ్లే ఎక్కువ. ఇతనేంటి దర్శకుడేంటి అని చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ అతను చాలా తక్కువ బడ్జెట్లో, ఎన్నో పరిమితుల మధ్య ‘చి ల సౌ’ లాంటి మంచి సినిమాను అందించి ఆశ్చర్యపరిచాడు. ఓ తొలి చిత్ర దర్శకుడు ఇంత బాగా సినిమా తీయడం అందరికీ పెద్ద షాక్. పైగా ఓ నటుడు దర్శకుడిగా మారి ఇలాంటి ఔట్ పుట్ ఇవ్వడమూ ఆశ్చర్యమే.
ఐతే తొలి సినిమాతో తనపై భారీగా పెరిగిన అంచనాలను రెండో సినిమాతో రాహుల్ అందుకోలేకపోయాడు. అక్కినేని నాగార్జున లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశాన్ని అతను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ‘మన్మథుడు-2’ లాంటి డిజాస్టర్ అందించాడు. దీంతో రాహుల్పై పెరిగిన అంచనాలన్నీ తలకిందులు అయిపోయాయి. అతడి కెరీర్ డోలాయమానంలో పడిపోయింది.
‘మన్మథుడు-2’ రిలీజై ఏడాదిన్నర దాటిపోగా రాహుల్ ఇప్పటికీ తన తర్వాతి సినిమాను ప్రకటించలేకపోయాడు. అతను నటుడిగా కూడా సినిమాలేమీ చేస్తున్నట్లు కనిపించడం లేదు. మరి దర్శకుడిగా అతడికి అవకాశం ఇచ్చేదెవరు అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఐతే టాలీవుడ్లో బిజీయెస్ట్ బేనర్లలో ఒకటైన గీతా ఆర్ట్స్ అతడితో సినిమా తీయడానికి రెడీ అయినట్లు సమాచారం బయటికి వచ్చింది.
రాహుల్ రవీంద్రన్ చెప్పిన ఒక లేడీ ఓరియెంటెడ్ కథకు అల్లు అరవింద్, బన్నీ వాసు ఆమోద ముద్ర వేశారు. త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కబోతోంది. వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాహుల్తో జీఏ-2 బేనర్లో సినిమా రాబోతోందని బన్నీ వాసు స్వయంగా ధ్రువీకరించాడు. మరి రాహుల్ కథలో లీడ్ రోల్ చేయబోయే హీరోయిన్ ఎవరన్నది ఆసక్తికరం. రెండో సినిమా తరహాలో నేల విడిచి సాము చేయకుండా తన పరిధిలో రాహుల్ మంచి సినిమా అందిస్తాడని ఆశిద్దాం.
This post was last modified on March 17, 2021 3:57 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…