నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారుతున్నాడంటే.. ఆశ్చర్యంగా చూసిన వాళ్లే ఎక్కువ. ఇతనేంటి దర్శకుడేంటి అని చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ అతను చాలా తక్కువ బడ్జెట్లో, ఎన్నో పరిమితుల మధ్య ‘చి ల సౌ’ లాంటి మంచి సినిమాను అందించి ఆశ్చర్యపరిచాడు. ఓ తొలి చిత్ర దర్శకుడు ఇంత బాగా సినిమా తీయడం అందరికీ పెద్ద షాక్. పైగా ఓ నటుడు దర్శకుడిగా మారి ఇలాంటి ఔట్ పుట్ ఇవ్వడమూ ఆశ్చర్యమే.
ఐతే తొలి సినిమాతో తనపై భారీగా పెరిగిన అంచనాలను రెండో సినిమాతో రాహుల్ అందుకోలేకపోయాడు. అక్కినేని నాగార్జున లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశాన్ని అతను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ‘మన్మథుడు-2’ లాంటి డిజాస్టర్ అందించాడు. దీంతో రాహుల్పై పెరిగిన అంచనాలన్నీ తలకిందులు అయిపోయాయి. అతడి కెరీర్ డోలాయమానంలో పడిపోయింది.
‘మన్మథుడు-2’ రిలీజై ఏడాదిన్నర దాటిపోగా రాహుల్ ఇప్పటికీ తన తర్వాతి సినిమాను ప్రకటించలేకపోయాడు. అతను నటుడిగా కూడా సినిమాలేమీ చేస్తున్నట్లు కనిపించడం లేదు. మరి దర్శకుడిగా అతడికి అవకాశం ఇచ్చేదెవరు అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఐతే టాలీవుడ్లో బిజీయెస్ట్ బేనర్లలో ఒకటైన గీతా ఆర్ట్స్ అతడితో సినిమా తీయడానికి రెడీ అయినట్లు సమాచారం బయటికి వచ్చింది.
రాహుల్ రవీంద్రన్ చెప్పిన ఒక లేడీ ఓరియెంటెడ్ కథకు అల్లు అరవింద్, బన్నీ వాసు ఆమోద ముద్ర వేశారు. త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కబోతోంది. వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాహుల్తో జీఏ-2 బేనర్లో సినిమా రాబోతోందని బన్నీ వాసు స్వయంగా ధ్రువీకరించాడు. మరి రాహుల్ కథలో లీడ్ రోల్ చేయబోయే హీరోయిన్ ఎవరన్నది ఆసక్తికరం. రెండో సినిమా తరహాలో నేల విడిచి సాము చేయకుండా తన పరిధిలో రాహుల్ మంచి సినిమా అందిస్తాడని ఆశిద్దాం.
This post was last modified on March 17, 2021 3:57 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…