టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. గత ఏడాది లాక్ డౌన్ టైంలో ఉన్నట్లుండి పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె కెరీర్ ఒకప్పటంత జోరుగా లేకపోయినా.. తనకు అవకాశాలకైతే కొదవలేదు. చేతిలో పెద్ద సినిమాలే ఉన్నాయి. ఇంకా కొన్నేళ్లు కథానాయికగా కొనసాగడానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినా ఆమె వేరే స్టార్ హీరోయిన్లతో పోలిస్తే కొంచెం త్వరగానే పెళ్లి పీటలు ఎక్కేసింది. తన స్నేహితుడైన గౌతమ్ కిచ్లును ఆమె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఐతే కొన్ని నెలల ముందు వరకు ప్రేమ-పెళ్లి గురించి ఎలాంటి సంకేతాలూ ఇవ్వకుండా సడెన్గా పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి హఠాత్తుగా కాజల్ ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంది.. గౌతమ్తో అంతకుముందు ఆమె ముందు ఎలాంటి అనుబంధం ఉండేది.. తనతో పెళ్లికి దారి తీసిన పరిస్థితులేంటి.. ఈ ప్రశ్నలకు ‘మోసగాళ్ళు’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సమాధానం చెప్పింది కాజల్. ఇంతకీ ఆమె ఏమందంటే..?
‘‘గౌతమ్తో నా ప్రేమ వ్యవహారం గురించి పూర్తిగా చెబితే అదొక సినిమా కథ అవుతుంది. నేను, గౌతమ్ మంచి స్నేహితులం. పదేళ్లుగా మేం ఒకరికి ఒకరం తెలుసు. కానీ మేం ఎప్పుడూ డేటింగ్ చేయలేదు. లాక్ డౌన్ టైంలో మా స్నేహం ఇంకొంచెం బలపడింది. ఆ టైంలో నీతో జీవితాంతం ఎవరు తోడుంటే బాగుంటుంది అనే ప్రశ్న ఒకరికి ఒకరం వేసుకున్నాం. అప్పుడు ఒకరికొకరు కనిపించాం. అప్పుడే మేమిద్దరం కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాం. వెంటనే గౌతమ్ వచ్చి మా నాన్నతో మాట్లాడారు. ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. ఒక రకంగా మాది లాక్ డౌన్ పెళ్లి అన్నమాట. ఇప్పుడు మా ఇద్దరినీ చూసి నాన్న చాలా సంతోషిస్తున్నారు. పెళ్లి తర్వాత జీవితంలో పెద్ద మార్పులేమీ లేవు. కానీ వైవాహిక జీవితం కొత్త అనుభూతిని ఇస్తోంది. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉద్యోగాలు, ఇతరత్రా పనులు చేసే మహిళల మీద ఇంకా గౌరవం పెరిగింది’’ అని కాజల్ వివరించింది. పెళ్లి తర్వాత కాజల్ నుంచి వస్తున్న ‘మోసగాళ్ళు’ ఈ శుక్రవారమే రిలీజవుతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 17, 2021 2:07 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…