టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. గత ఏడాది లాక్ డౌన్ టైంలో ఉన్నట్లుండి పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె కెరీర్ ఒకప్పటంత జోరుగా లేకపోయినా.. తనకు అవకాశాలకైతే కొదవలేదు. చేతిలో పెద్ద సినిమాలే ఉన్నాయి. ఇంకా కొన్నేళ్లు కథానాయికగా కొనసాగడానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినా ఆమె వేరే స్టార్ హీరోయిన్లతో పోలిస్తే కొంచెం త్వరగానే పెళ్లి పీటలు ఎక్కేసింది. తన స్నేహితుడైన గౌతమ్ కిచ్లును ఆమె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఐతే కొన్ని నెలల ముందు వరకు ప్రేమ-పెళ్లి గురించి ఎలాంటి సంకేతాలూ ఇవ్వకుండా సడెన్గా పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి హఠాత్తుగా కాజల్ ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంది.. గౌతమ్తో అంతకుముందు ఆమె ముందు ఎలాంటి అనుబంధం ఉండేది.. తనతో పెళ్లికి దారి తీసిన పరిస్థితులేంటి.. ఈ ప్రశ్నలకు ‘మోసగాళ్ళు’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సమాధానం చెప్పింది కాజల్. ఇంతకీ ఆమె ఏమందంటే..?
‘‘గౌతమ్తో నా ప్రేమ వ్యవహారం గురించి పూర్తిగా చెబితే అదొక సినిమా కథ అవుతుంది. నేను, గౌతమ్ మంచి స్నేహితులం. పదేళ్లుగా మేం ఒకరికి ఒకరం తెలుసు. కానీ మేం ఎప్పుడూ డేటింగ్ చేయలేదు. లాక్ డౌన్ టైంలో మా స్నేహం ఇంకొంచెం బలపడింది. ఆ టైంలో నీతో జీవితాంతం ఎవరు తోడుంటే బాగుంటుంది అనే ప్రశ్న ఒకరికి ఒకరం వేసుకున్నాం. అప్పుడు ఒకరికొకరు కనిపించాం. అప్పుడే మేమిద్దరం కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాం. వెంటనే గౌతమ్ వచ్చి మా నాన్నతో మాట్లాడారు. ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. ఒక రకంగా మాది లాక్ డౌన్ పెళ్లి అన్నమాట. ఇప్పుడు మా ఇద్దరినీ చూసి నాన్న చాలా సంతోషిస్తున్నారు. పెళ్లి తర్వాత జీవితంలో పెద్ద మార్పులేమీ లేవు. కానీ వైవాహిక జీవితం కొత్త అనుభూతిని ఇస్తోంది. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉద్యోగాలు, ఇతరత్రా పనులు చేసే మహిళల మీద ఇంకా గౌరవం పెరిగింది’’ అని కాజల్ వివరించింది. పెళ్లి తర్వాత కాజల్ నుంచి వస్తున్న ‘మోసగాళ్ళు’ ఈ శుక్రవారమే రిలీజవుతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 17, 2021 2:07 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…