టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. గత ఏడాది లాక్ డౌన్ టైంలో ఉన్నట్లుండి పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె కెరీర్ ఒకప్పటంత జోరుగా లేకపోయినా.. తనకు అవకాశాలకైతే కొదవలేదు. చేతిలో పెద్ద సినిమాలే ఉన్నాయి. ఇంకా కొన్నేళ్లు కథానాయికగా కొనసాగడానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినా ఆమె వేరే స్టార్ హీరోయిన్లతో పోలిస్తే కొంచెం త్వరగానే పెళ్లి పీటలు ఎక్కేసింది. తన స్నేహితుడైన గౌతమ్ కిచ్లును ఆమె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఐతే కొన్ని నెలల ముందు వరకు ప్రేమ-పెళ్లి గురించి ఎలాంటి సంకేతాలూ ఇవ్వకుండా సడెన్గా పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి హఠాత్తుగా కాజల్ ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంది.. గౌతమ్తో అంతకుముందు ఆమె ముందు ఎలాంటి అనుబంధం ఉండేది.. తనతో పెళ్లికి దారి తీసిన పరిస్థితులేంటి.. ఈ ప్రశ్నలకు ‘మోసగాళ్ళు’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సమాధానం చెప్పింది కాజల్. ఇంతకీ ఆమె ఏమందంటే..?
‘‘గౌతమ్తో నా ప్రేమ వ్యవహారం గురించి పూర్తిగా చెబితే అదొక సినిమా కథ అవుతుంది. నేను, గౌతమ్ మంచి స్నేహితులం. పదేళ్లుగా మేం ఒకరికి ఒకరం తెలుసు. కానీ మేం ఎప్పుడూ డేటింగ్ చేయలేదు. లాక్ డౌన్ టైంలో మా స్నేహం ఇంకొంచెం బలపడింది. ఆ టైంలో నీతో జీవితాంతం ఎవరు తోడుంటే బాగుంటుంది అనే ప్రశ్న ఒకరికి ఒకరం వేసుకున్నాం. అప్పుడు ఒకరికొకరు కనిపించాం. అప్పుడే మేమిద్దరం కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాం. వెంటనే గౌతమ్ వచ్చి మా నాన్నతో మాట్లాడారు. ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. ఒక రకంగా మాది లాక్ డౌన్ పెళ్లి అన్నమాట. ఇప్పుడు మా ఇద్దరినీ చూసి నాన్న చాలా సంతోషిస్తున్నారు. పెళ్లి తర్వాత జీవితంలో పెద్ద మార్పులేమీ లేవు. కానీ వైవాహిక జీవితం కొత్త అనుభూతిని ఇస్తోంది. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉద్యోగాలు, ఇతరత్రా పనులు చేసే మహిళల మీద ఇంకా గౌరవం పెరిగింది’’ అని కాజల్ వివరించింది. పెళ్లి తర్వాత కాజల్ నుంచి వస్తున్న ‘మోసగాళ్ళు’ ఈ శుక్రవారమే రిలీజవుతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 17, 2021 2:07 pm
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…