షూటింగ్ పూర్తి చేసుకున్నాక కొన్ని నెలల పాటు వార్తల్లో లేకుండా పోయిన అక్కినేని నాగార్జున సినిమా వైల్డ్ డాగ్ ఈ మధ్యే మళ్లీ జనాల దృష్టిలో పడింది. ముందు ఈ సినిమాను ఓటీటీలో నేరుగా రిలీజ్ చేద్దామనుకున్న నిర్మాతలు.. తర్వాత మనసు మార్చుకుని ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల చేయడానికి నిర్ణయిస్తూ ఇటీవలే ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే.
కొన్ని రోజుల కిందటే వైల్డ్ డాగ్ థియేట్రికల్ ట్రైలర్ను కూడా లాంచ్ చేశారు. దానికి మంచి స్పందనే వస్తోంది. ట్రైలర్లో కొన్ని ఉత్కంఠభరిత సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అలాగే విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి. ప్రస్తుతం టాలీవుడ్లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనదగ్గ తమన్ ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ చేశాడు. ఐతే ముందు ఈ సినిమాకు తమన్ను సంగీత దర్శకుడిగా అనుకోలేదట. సినిమా పూర్తయ్యాక అతణ్ని అడిగారట.
తనకు ఖాళీ లేకపోయినా నాగ్ అడిగాడని తమన్ ఒప్పుకుని చాలా తక్కువ సమయంలో ఈ సినిమాకు ఔట్ పుట్ ఇచ్చాడట. వైల్డ్ డాగ్ ప్రమోషన్లలో భాగంగా నాగ్ ఈ విషయం వెల్లడించాడు. టాకీ పార్ట్ అంతా అయ్యాక తమన్ను మ్యూజిక్ చేయమని అడిగామని, అతడికి అసలేమాత్రం ఖాళీ లేదని.. అయినా తన కోసం ఒప్పుకున్నాడని నాగ్ చెప్పాడు.
టైం లేకపోయినా కూడా క్వాలిటీ విషయంలో తమన్ రాజీ పడలేదని.. ఒకటికి మూడు రకాల ట్రాక్స్ ఇచ్చాడని.. తాము సంతృప్తి అయ్యే వరకు పని చేస్తూనే ఉన్నాడని నాగ్ చెప్పాడు. సినిమాకు రీరికార్డింగ్ ఎంతో ముఖ్యమని.. అందులోనూ తమన్ టాప్ క్లాస్ ఔట్పుట్ ఇచ్చాడని, సినిమాకు ఆర్ఆర్ మేజర్ హైలైట్ అవుతుందని నాగ్ ధీమా వ్యక్తం చేశాడు. మహర్షి రచయిత సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. నాగ్ ఇందులో ఎన్ఐఏ ఆఫీసర్గా కనిపించనున్నాడు.
This post was last modified on March 16, 2021 12:28 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…