షూటింగ్ పూర్తి చేసుకున్నాక కొన్ని నెలల పాటు వార్తల్లో లేకుండా పోయిన అక్కినేని నాగార్జున సినిమా వైల్డ్ డాగ్ ఈ మధ్యే మళ్లీ జనాల దృష్టిలో పడింది. ముందు ఈ సినిమాను ఓటీటీలో నేరుగా రిలీజ్ చేద్దామనుకున్న నిర్మాతలు.. తర్వాత మనసు మార్చుకుని ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల చేయడానికి నిర్ణయిస్తూ ఇటీవలే ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే.
కొన్ని రోజుల కిందటే వైల్డ్ డాగ్ థియేట్రికల్ ట్రైలర్ను కూడా లాంచ్ చేశారు. దానికి మంచి స్పందనే వస్తోంది. ట్రైలర్లో కొన్ని ఉత్కంఠభరిత సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అలాగే విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి. ప్రస్తుతం టాలీవుడ్లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనదగ్గ తమన్ ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ చేశాడు. ఐతే ముందు ఈ సినిమాకు తమన్ను సంగీత దర్శకుడిగా అనుకోలేదట. సినిమా పూర్తయ్యాక అతణ్ని అడిగారట.
తనకు ఖాళీ లేకపోయినా నాగ్ అడిగాడని తమన్ ఒప్పుకుని చాలా తక్కువ సమయంలో ఈ సినిమాకు ఔట్ పుట్ ఇచ్చాడట. వైల్డ్ డాగ్ ప్రమోషన్లలో భాగంగా నాగ్ ఈ విషయం వెల్లడించాడు. టాకీ పార్ట్ అంతా అయ్యాక తమన్ను మ్యూజిక్ చేయమని అడిగామని, అతడికి అసలేమాత్రం ఖాళీ లేదని.. అయినా తన కోసం ఒప్పుకున్నాడని నాగ్ చెప్పాడు.
టైం లేకపోయినా కూడా క్వాలిటీ విషయంలో తమన్ రాజీ పడలేదని.. ఒకటికి మూడు రకాల ట్రాక్స్ ఇచ్చాడని.. తాము సంతృప్తి అయ్యే వరకు పని చేస్తూనే ఉన్నాడని నాగ్ చెప్పాడు. సినిమాకు రీరికార్డింగ్ ఎంతో ముఖ్యమని.. అందులోనూ తమన్ టాప్ క్లాస్ ఔట్పుట్ ఇచ్చాడని, సినిమాకు ఆర్ఆర్ మేజర్ హైలైట్ అవుతుందని నాగ్ ధీమా వ్యక్తం చేశాడు. మహర్షి రచయిత సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. నాగ్ ఇందులో ఎన్ఐఏ ఆఫీసర్గా కనిపించనున్నాడు.
This post was last modified on March 16, 2021 12:28 pm
తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…
అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…
ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…