షూటింగ్ పూర్తి చేసుకున్నాక కొన్ని నెలల పాటు వార్తల్లో లేకుండా పోయిన అక్కినేని నాగార్జున సినిమా వైల్డ్ డాగ్ ఈ మధ్యే మళ్లీ జనాల దృష్టిలో పడింది. ముందు ఈ సినిమాను ఓటీటీలో నేరుగా రిలీజ్ చేద్దామనుకున్న నిర్మాతలు.. తర్వాత మనసు మార్చుకుని ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల చేయడానికి నిర్ణయిస్తూ ఇటీవలే ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే.
కొన్ని రోజుల కిందటే వైల్డ్ డాగ్ థియేట్రికల్ ట్రైలర్ను కూడా లాంచ్ చేశారు. దానికి మంచి స్పందనే వస్తోంది. ట్రైలర్లో కొన్ని ఉత్కంఠభరిత సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అలాగే విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి. ప్రస్తుతం టాలీవుడ్లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనదగ్గ తమన్ ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ చేశాడు. ఐతే ముందు ఈ సినిమాకు తమన్ను సంగీత దర్శకుడిగా అనుకోలేదట. సినిమా పూర్తయ్యాక అతణ్ని అడిగారట.
తనకు ఖాళీ లేకపోయినా నాగ్ అడిగాడని తమన్ ఒప్పుకుని చాలా తక్కువ సమయంలో ఈ సినిమాకు ఔట్ పుట్ ఇచ్చాడట. వైల్డ్ డాగ్ ప్రమోషన్లలో భాగంగా నాగ్ ఈ విషయం వెల్లడించాడు. టాకీ పార్ట్ అంతా అయ్యాక తమన్ను మ్యూజిక్ చేయమని అడిగామని, అతడికి అసలేమాత్రం ఖాళీ లేదని.. అయినా తన కోసం ఒప్పుకున్నాడని నాగ్ చెప్పాడు.
టైం లేకపోయినా కూడా క్వాలిటీ విషయంలో తమన్ రాజీ పడలేదని.. ఒకటికి మూడు రకాల ట్రాక్స్ ఇచ్చాడని.. తాము సంతృప్తి అయ్యే వరకు పని చేస్తూనే ఉన్నాడని నాగ్ చెప్పాడు. సినిమాకు రీరికార్డింగ్ ఎంతో ముఖ్యమని.. అందులోనూ తమన్ టాప్ క్లాస్ ఔట్పుట్ ఇచ్చాడని, సినిమాకు ఆర్ఆర్ మేజర్ హైలైట్ అవుతుందని నాగ్ ధీమా వ్యక్తం చేశాడు. మహర్షి రచయిత సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. నాగ్ ఇందులో ఎన్ఐఏ ఆఫీసర్గా కనిపించనున్నాడు.
This post was last modified on March 16, 2021 12:28 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…