Movie News

రీల్ విలన్.. ఇప్పుడెంత దారుణ స్థితిలో ఉన్నారంటే?

వెండి తెరపై ప్రతినాయక పాత్రల్లో చెలరేగిపోయిన నటుల్లోఒకరు పొన్నంబళం. భారీ కాయంతో పాటు.. అతడి విలనీ భయంకరంగా ఉండేది. రీల్ పై శక్తివంతమైన విలనీ క్యారెక్టర్లు చేసిన అతడు ఇప్పుడు ప్రాణాల్ని నిలుపుకోవటం కోసం పోరాడుతున్నాడు. తనకున్న ఆర్థిక ఇబ్బందుల గురించి చెబుతూ.. తనను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాడు. తాజాగా తాను ఉన్న పరిస్థితి గురించి వివరాల్ని ఒక ప్రకటన ద్వారా మీడియాకు అందించాడు.

తెలుగు.. తమిళంతో పాటు పలు భాషా చిత్రాల్లో ప్రతినాయక పాత్రల్ని పోషించిన పొన్నంబళం ఇప్పుడు తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనారోగ్యంతో ఉన్న ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా అతడి కిడ్నీలు పాడైపోవటంతో ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. కిడ్నీ మార్పిడికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. దీనికి అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించాల్సిందిగా కోరుతున్నారు.

ఐదేళ్లుగా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని.. ప్రాణాల్ని నిలుపుకోవటానికి పోరాడుతున్నానని.. ఆదుకోవాలన్నారు. తనకు కిడ్నీ దానం చేయటానికి తన సోదరి కొడుకు సిద్ధంగా ఉన్నాడని చెప్పారు. అయితే.. ఈ శస్త్రచికిత్సకు అవసరమైన డబ్బులు తన దగ్గర లేవని.. తనకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని ఆయన కోరుతున్నారు.

తమిళ సినీ రంగ ప్రముఖుల పేర్లను ప్రస్తావిస్తూ.. ఆదుకోవాలని కోరారు. గతంలో తన ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పడు రజీన..కమల్.. రాధిక శరత్ కుమార్.. ధాను ధనుష్.. రవికుమార్.. లారెన్స్ లాంటి ప్రముఖులు సాయం చేశారన్నారు. ప్రస్తుతం కిడ్నీ మార్పిడి చికిత్స కోసం ఆర్థిక సాయం అవసరమైందని పేర్కొన్నాడు. మరి.. పొన్నాంబళం విన్నపానికి తెలుగు.. తమిళ చిత్ర పరిశ్రమ ఎలా స్పందిస్తుందో చూడాలి.

This post was last modified on March 14, 2021 12:09 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

5 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

5 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

7 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

7 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

7 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

9 hours ago