మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘ఆచార్య’ వేసవి కానుకగా మే 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది కొరటాల శివ. ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు తెలుగు రాష్ట్రాల అవతల కూడా క్రేజ్ ఉంటుందనే అంచనా వేస్తున్నారు. ఐతే ఈ చిత్రానికి ఓ భారీ హిందీ చిత్రం నుంచి పోటీ ఎదురు కాబోతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన కొత్త చిత్రం ‘రాధె’ను కూడా మే 13నే విడుదల చేయాలని నిర్ణయించాడు.
‘రాధె’ చిత్రం రంజాన్ కానుకగా విడుదలవుతుందని సల్మాన్ ఇంతకుముందే ప్రకటించాడు. ఇప్పుడు డేట్ కూడా ఇచ్చేశాడు. చిరుతో సల్మాన్కు మంచి స్నేహమే ఉంది కానీ.. పోటీ మాత్రం అనివార్యమైంది. చిరు సినిమాకు ఉత్తరాదిన ‘రాధె’ వల్ల కొంచెం డెంట్ పడొచ్చు. అలాగే సల్మాన్ చిత్రానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో చిరు సినిమా గండి కొట్టే అవకాశముంది. ఐతే రెండూ వేర్వేరు భాషా చిత్రాలు.. ఒక సినిమా వల్ల ఇంకో సినిమాకు జరిగే నష్టం తక్కువ కావడంతో ఈ పోటీ గురించి చిరు, సల్మాన్ ఆలోచించే పరిస్థితి లేదు.
ఇక ‘రాధె’ విషయానికి వస్తే.. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ నటిస్తున్న మూడో చిత్రమిది. వీరి కలయికలో ‘పోకిరి’కి రీమేక్గా వచ్చిన తొలి సినిమా ‘వాంటెడ్’ బ్లాక్బస్టర్ అయింది. సల్మాన్ వరుస ఫ్లాపుల నుంచి బయటపడి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది ఈ సినిమాతోనే. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూసుకోలేదు. సల్మాన్-ప్రభుదేవా కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ‘దబంగ్-3’ సరిగా ఆడలేదు. అయినా సరే.. ఈ దర్శకుడితో వెంటనే ‘రాధె’ చేశాడు. ‘మోస్ట్ వాంటెడ్ భాయ్’ అంటూ ఒక ఆసక్తికర క్యాప్షన్ జోడించారీ చిత్రానికి. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ సంస్థతో పాటు జీ స్టూడియోస్ ఉమ్మడిగా నిర్మించాయి.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…