Movie News

చిరంజీవితో సల్మాన్ ఢీ

మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘ఆచార్య’ వేసవి కానుకగా మే 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది కొరటాల శివ. ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు తెలుగు రాష్ట్రాల అవతల కూడా క్రేజ్ ఉంటుందనే అంచనా వేస్తున్నారు. ఐతే ఈ చిత్రానికి ఓ భారీ హిందీ చిత్రం నుంచి పోటీ ఎదురు కాబోతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన కొత్త చిత్రం ‘రాధె’ను కూడా మే 13నే విడుదల చేయాలని నిర్ణయించాడు.

‘రాధె’ చిత్రం రంజాన్ కానుకగా విడుదలవుతుందని సల్మాన్ ఇంతకుముందే ప్రకటించాడు. ఇప్పుడు డేట్ కూడా ఇచ్చేశాడు. చిరుతో సల్మాన్‌కు మంచి స్నేహమే ఉంది కానీ.. పోటీ మాత్రం అనివార్యమైంది. చిరు సినిమాకు ఉత్తరాదిన ‘రాధె’ వల్ల కొంచెం డెంట్ పడొచ్చు. అలాగే సల్మాన్ చిత్రానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో చిరు సినిమా గండి కొట్టే అవకాశముంది. ఐతే రెండూ వేర్వేరు భాషా చిత్రాలు.. ఒక సినిమా వల్ల ఇంకో సినిమాకు జరిగే నష్టం తక్కువ కావడంతో ఈ పోటీ గురించి చిరు, సల్మాన్ ఆలోచించే పరిస్థితి లేదు.

ఇక ‘రాధె’ విషయానికి వస్తే.. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ నటిస్తున్న మూడో చిత్రమిది. వీరి కలయికలో ‘పోకిరి’కి రీమేక్‌గా వచ్చిన తొలి సినిమా ‘వాంటెడ్’ బ్లాక్‌బస్టర్ అయింది. సల్మాన్ వరుస ఫ్లాపుల నుంచి బయటపడి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది ఈ సినిమాతోనే. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూసుకోలేదు. సల్మాన్-ప్రభుదేవా కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ‘దబంగ్-3’ సరిగా ఆడలేదు. అయినా సరే.. ఈ దర్శకుడితో వెంటనే ‘రాధె’ చేశాడు. ‘మోస్ట్ వాంటెడ్ భాయ్’ అంటూ ఒక ఆసక్తికర క్యాప్షన్ జోడించారీ చిత్రానికి. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ సంస్థతో పాటు జీ స్టూడియోస్ ఉమ్మడిగా నిర్మించాయి.

This post was last modified on March 13, 2021 2:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

24 minutes ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

3 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

3 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

4 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

6 hours ago