Movie News

సినిమా రిలీజ్ ముంగిట ఐసీయూలో దర్శకుడు

‘లాభం’ అని ఒక తమిళ సినిమా. త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కొంత కాలంగా చాలా బిజీగా ఉన్నాడు దాని దర్శకుడు జననాథన్. ఆ పని పూర్తి కావస్తుండగా ఉన్నట్లుండి తీవ్ర అనారోగ్యం పాలై.. ఇప్పుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి కొంచెం విషమంగానే ఉన్నట్లు, ప్రాణాలతో పోరాడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ పరిణామం తమిళ సినీ పరిశ్రమను ఆందోళనలోకి నెట్టింది.

జననాథన్ జాతీయ అవార్డు గెలిచిన దర్శకుడు. 2003లో ఆయన సినిమా ‘ఇయర్కై’ ఆ సంవత్సరానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు సాధించింది. 61 ఏళ్ల జననాథన్ ఇప్పటిదాకా తమిళంలో నాలుగు సినిమాలు రూపొందించాడు. లాభంలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించాడు. శ్రుతి హాసన్ హీరోయిన్. మన జగపతిబాబు విలన్ పాత్రలో నటించాడు. వ్యవసాయంలో దళారుల దందా నేపథ్యంలో నడిచే కథ ఇది. లాక్ డౌన్ టైంలో బ్రేక్ పడ్డ ఈ సినిమాను.. తర్వాత పూర్తి చేశారు. ఇప్పటికే ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. అది ఆకట్టుకుంది. వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

కాగా కొన్ని రోజులుగా జననాథన్ రేయింబవళ్లు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటున్నాడు. గురువారం ఉదయం జననాథన్ ఎడిటింగ్ పనులను పర్యవేక్షించి భోజనం కోసం ఇంటికి వెళ్లారు. తర్వాత తిరిగి రాలేదు. ఫోన్ చేసినా స్పందించలేదు. ఆయన కోసం అసిస్టెంట్ డైరెక్టర్లు వెళ్లగా.. ఆయన స్పృహ లేకుండా పడి ఉండటం గమనించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. జననాథన్ మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు వైద్యులు గుర్తించారు. ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.

This post was last modified on March 13, 2021 1:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విశ్వక్ అర్థం చేసుకున్న ట్రెండ్ నిజమేనా

నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…

22 minutes ago

సాయిపల్లవి బరిలో ఉంటే అవార్డ్ ఇవ్వాల్సిందే

హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…

1 hour ago

‘పవన్ హఠావో’ రచయిత మృతి కేసు మిస్టరీ వీడింది

“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…

2 hours ago

విన్యాసం మీదే బాక్సాఫీస్ ఆశలు

గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…

2 hours ago

ఇటు వివాదం… అటు ముహూర్తం

జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…

2 hours ago

కమల్ హీరో… రజినీ విలన్?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్‌ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…

3 hours ago