‘లాభం’ అని ఒక తమిళ సినిమా. త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కొంత కాలంగా చాలా బిజీగా ఉన్నాడు దాని దర్శకుడు జననాథన్. ఆ పని పూర్తి కావస్తుండగా ఉన్నట్లుండి తీవ్ర అనారోగ్యం పాలై.. ఇప్పుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి కొంచెం విషమంగానే ఉన్నట్లు, ప్రాణాలతో పోరాడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ పరిణామం తమిళ సినీ పరిశ్రమను ఆందోళనలోకి నెట్టింది.
జననాథన్ జాతీయ అవార్డు గెలిచిన దర్శకుడు. 2003లో ఆయన సినిమా ‘ఇయర్కై’ ఆ సంవత్సరానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు సాధించింది. 61 ఏళ్ల జననాథన్ ఇప్పటిదాకా తమిళంలో నాలుగు సినిమాలు రూపొందించాడు. లాభంలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించాడు. శ్రుతి హాసన్ హీరోయిన్. మన జగపతిబాబు విలన్ పాత్రలో నటించాడు. వ్యవసాయంలో దళారుల దందా నేపథ్యంలో నడిచే కథ ఇది. లాక్ డౌన్ టైంలో బ్రేక్ పడ్డ ఈ సినిమాను.. తర్వాత పూర్తి చేశారు. ఇప్పటికే ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. అది ఆకట్టుకుంది. వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
కాగా కొన్ని రోజులుగా జననాథన్ రేయింబవళ్లు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటున్నాడు. గురువారం ఉదయం జననాథన్ ఎడిటింగ్ పనులను పర్యవేక్షించి భోజనం కోసం ఇంటికి వెళ్లారు. తర్వాత తిరిగి రాలేదు. ఫోన్ చేసినా స్పందించలేదు. ఆయన కోసం అసిస్టెంట్ డైరెక్టర్లు వెళ్లగా.. ఆయన స్పృహ లేకుండా పడి ఉండటం గమనించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. జననాథన్ మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు వైద్యులు గుర్తించారు. ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.
This post was last modified on March 13, 2021 1:46 pm
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…