ఒక సినిమా ఆడియో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్లో ఒక అనుకోని అతిథి కనిపించాడు అంటే.. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారితో తర్వాత ఆ వ్యక్తికి ఏదో ఒక భాగస్వామ్యం ఉండబోతోందని సంకేతాలు అందుతున్నట్లే. చాలా కొత్త కాంబినేషన్లు ఇలాగే బయటికి వస్తుంటాయి. ఇటీవల ‘చావు కబురు చల్లగా’ ప్రి రిలీజ్ ఈవెంట్కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రావడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు.
ఎందుకంటే అది తమ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్లో తెరకెక్కిన సినిమా కాబట్టి.. బన్నీ వచ్చి ప్రమోట్ చేయడం సహజమే. కానీ అదే వేడుకలో దర్శకుడు సుకుమార్ కనిపించడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ‘పుష్ప’ పనుల్లో తీరిక లేకుండా ఉన్న ఆయన.. ఇక్కడికి ఎలా వచ్చాడని చాలామంది సందేహించారు. బన్నీ, అరవింద్ అడిగితే వచ్చాడా.. లేదా ఇంకేదైనా కారణం ఉందా అన్న చర్చ జరిగింది. ఐతే వేరే కారణంతోనే ఆ వేడుకకు సుక్కు వచ్చాడని ఇప్పుడు స్పష్టమైంది.
కార్తికేయతో సినిమా తీయడానికి సుకుమార్ రంగం సిద్ధం చేసుకున్నాడు. ఐతే ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు కాదు కానీ.. ఆయన పాత్ర అత్యంత కీలకంగా ఉండబోతోంది. సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించనున్న సినిమాలో కార్తికేయ హీరోగా నటించబోతున్నట్లు శుక్రవారం ప్రెస్ నోట్ బయటికి వచ్చింది. ‘సుకుమార్ రైటింగ్స్’ బేనర్ మీద ఈ సినిమా తెరకెక్కనుంది. అంటే ‘కుమారి 21 ఎఫ్’ మాదిరే ఈ చిత్రానికి కూడా సుక్కు అన్నీ తానై వ్యవహరించనున్నాడన్నమాట. ఎవరో ఒక సుకుమార్ శిష్యుడే ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశముంది. ఆ వ్యక్తి ఎవరో ఇంకా వెల్లడించలేదు.
ఈ సినిమాకు సంబంధించి ఇంకే విశేషాలు, వివరాలు కూడా బయటికి రాలేదు. జస్ట్ సుకుమార్ స్క్రిప్టుతో కార్తికేయ సినిమా అనేది మాత్రమే వెల్లడైంది. ఇప్పటికే సుకుమార్ స్క్రిప్టుతో యువ కథానాయకుడు నిఖిల్ ప్రధాన పాత్రలో ‘18 పేజెస్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు.
This post was last modified on March 12, 2021 3:03 pm
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…