‘శ్రీకారం’ సినిమాతో దర్శకుడు హరీష్ శంకర్కు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈ చిత్రాన్ని నిర్మించిన ‘14 రీల్స్ ప్లస్’ సంస్థతో మాత్రం మంచి అనుబంధం ఉంది. ‘14 రీల్స్’ నుంచి బయటికి వచ్చి రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట ‘14 రీల్స్ ప్లస్’ సంస్థ పెట్టాక అందులో తొలి సినిమాగా వచ్చిన ‘గద్దలకొండ గణేష్’కు దర్శకుడు హరీషే. ఈ ఈ అనుబంధంతోనే ‘శ్రీకారం’ సినిమాను రిలీజ్కు కొన్ని రోజుల ముందే హరీష్ శంకర్ చూసేశాడట.
‘శ్రీకారం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ సినిమా చాలా గొప్పగా ఉందని కితాబిచ్చాడు హరీష్. అన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది.. ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అని తాను చెప్పను అని.. కానీ ‘శ్రీకారం’ చాలా నిజాయితీగా తీసిన మంచి ప్రయత్నం అని.. కోట్ల మంది హృదయాలను ఇది తడుతుందని హరీష్ కొనియాడాడు. ఈ సినిమా చూస్తూ ఏడెనిమిది చోట్ల తాను ఏడ్చేశానని.. సాయిమాధవ్ బుర్రా అద్భుతమైన డైలాగులు రాశాడని.. అవి నేరుగా గుండెల్ని తాకుతాయని హరీష్ చెప్పాడు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన కేటీఆర్కు హరీష్ ఒక విజ్ఞప్తి కూడా చేశాడు. రైతుల గురించి, వ్యవసాయం గురించి ఈ సినిమాలో చాలా గొప్పగా చెప్పారని.. ఇది సమాజానికి ఉపయోగపడే సినిమా అని.. దీనికి ప్రభుత్వం విధించే వినోద పన్నును మినహాయించాలని హరీష్ కోరాడు. ఈ సినిమా చూశాను కాబట్టి ఇది ఆ కేటగిరి కిందికి వస్తుందని బలంగా నమ్ముతున్నానని.. కేటీఆర్ కూడా ఈ చిత్రాన్ని చూసి దీనికి ఆ అర్హత ఉంది అనిపిస్తే వినోద పన్ను మినహాయించే అవకాశాన్ని పరిశీలించాలని కోరాడు.
పన్ను మినహాయింపు వస్తే నిర్మాతలకు పెద్దగా ఒరిగేదేమీ లేదని.. కానీ టికెట్ల ధరలు తగ్గి సినిమాకు రీచ్ పెరుగుతుందన్నదే తన అభిమతం అని హరీష్ అన్నాడు. ఇక కేటీఆర్ గురించి మాట్లాడుతూ.. బయట అయినా, సోషల్ మీడియాలో అయినా సమస్య అని ఆయన దృష్టికి వస్తే వెంటనే స్పందించి పరిష్కరించే తీరు ఆయన్ని గొప్ప నాయకుడిని చేసిందన్నాడు. ట్విట్టర్లో ఆయన టైం లైన్ చూస్తే.. ఇలా సమస్యల గురించి స్పందించిన ట్వీట్లే చాలా కనిపిస్తాయని హరీష్ అన్నాడు.
This post was last modified on March 10, 2021 2:56 pm
‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…
పాప్ కార్న్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. కాలక్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్కజొన్న లోని…
ఆగస్ట్ నెల దాదాపు అయిపో వచ్చింది. ఆదర్శ కుటుంబం విడుదల అక్కడి నుంచి కేవలం ఒక నెల రోజులు మాత్రమే…
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…