‘బాహుబలి’ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన ప్రభాస్ కొత్త చిత్రం ‘సాహో’ డిజాస్టర్ అయింది. ఐతేనేం పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ క్రేజ్ ఏమీ తగ్గిపోలేదు. అతడితో సినిమాలు చేయడానికి బాలీవుడ్లో అగ్ర దర్శకులు, బడా నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ‘ఆదిపురుష్’తో నేరుగా బాలీవుడ్లోకి అడుగు పెడుతున్నాడు. ఓం రౌత్ లాంటి క్రేజీ డైరెక్టర్, భూషణ్ కుమార్ లాంటి అగ్ర నిర్మాత ఈ సినిమా కోసం చేతులు కలిపారు.
మరోవైపు కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా లాంటి అగ్ర నిర్మాతలు ప్రభాస్తో సినిమా చేయడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. వీరిలో ఆదిత్య.. ప్రభాస్ నుంచి కమిట్మెంట్ తీసుకున్నాడని, ఒక సంచలన మల్టీస్టారర్ మూవీకి అతను రంగం సిద్ధం చేస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ 24వ సినిమాగా తెరకెక్కబోయే ఆ చిత్రం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
ప్రభాస్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో ఒక భారీ మల్టీస్టారర్ తీయడానికి యశ్ రాజ్ ఫిలిమ్స్ గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్లు సమాచారం. ఇంతకుముందు హృతిక్ రోషన్-టైగర్ ష్రాఫ్ కలయికలో ‘వార్’ లాంటి భారీ చిత్రం తీసిన సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట. టైగర్ స్థాయి తక్కువ అయినప్పటికీ ‘వార్’ బ్లాక్బస్టర్ అయింది. అలాంటిది హృతిక్ రోషన్ ఎదురుగా ప్రభాస్ ఉంటే.. వీరితో సిద్దార్థ్ మార్కు యాక్షన్ ఎంటర్టైనర్ తీస్తే ఎలా ఉంటుందన్న ఊహే ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇస్తుంది. ప్రస్తుతం సిద్దార్థ్.. షారుఖ్ ఖాన్ హీరోగా ‘పఠాన్’ అనే భారీ యాక్షన్ మూవీ చేస్తున్నాడు.
ఆ సినిమా తర్వాత ఈ దర్శకుడి స్థాయి ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్తో చేయబోయే సినిమాలతో ప్రభాస్ రేంజ్ కూడా ఇంకా పెరగడం ఖాయం. హృతిక్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక యశ్ రాజ్ ఫిలిమ్స్కు ఉన్న పేరుకు ఆ సంస్థ స్థాయికి తగ్గట్లు సినిమా తీస్తే ఇండియన్ సినిమా రికార్డులన్నీ బద్దలైపోవడం ఖాయం.
This post was last modified on March 9, 2021 8:35 am
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…