రాఘవేంద్రరావు టాలీవుడ్లో ఎంత పెద్ద కమర్షియల్ డైరెక్టరో.. ఆయన ఎలాంటి బ్లాక్ బస్టర్లు అందించారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే ఏ దర్శకుడికైనా మధ్యలో ఒక లీన్ ఫేజ్ ఉంటుంది. వరుస పరాజయాలతో ఇబ్బంది పడతాడు. అందులోనూ ఇప్పటి దర్శకుల్లా ఏడాదికి రెండేళ్లకు ఒక సినిమా చేయలేదు ఆయన. 30 ఏళ్ల వ్యవధిలో వంద సినిమాలు తీశారంటే ఎంత వేగం చూపించారో అర్థం చేసుకోవచ్చు.
ఆయన కూడా మధ్య మధ్యలో వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డారు. మంచి ఫాంలో ఉండగా ఆయన బాగా స్ట్రగులైన ఫేజ్ అంటే 1988-90 మధ్యే. మెగాస్టార్ చిరంజీవితో చేసిన యుద్ధభూమి, రుద్రనేత్ర సినిమాలతో పాటు నాగార్జునతో తీసిన అగ్ని, వెంకటేష్ హీరోగా తెరకెక్కించిన ఒంటరి పోరాటం ఫ్లాప్ అయ్యాయి. దీంతో రాఘవేంద్రరావు పనైపోయిందన్న కామెంట్లు వినిపించాయి.
అలాంటి సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకు సన్నాహాలు మొదలు పెట్టారు నిర్మాత అశ్వినీదత్. అప్పుడు దర్శకేంద్రుడి ఫామ్ చూసి.. ఆయనకు అవకాశమివ్వడమేంటి అని చాలామంది దత్ను వెనక్కి లాగారట. చిరంజీవితో వరుసగా రెండు ఫ్లాపులు ఇచ్చిన రాఘవేంద్రరావును ఎలా నమ్మారని ప్రశ్నించారట. కానీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి సినిమాను ఆయన మాత్రమే అందంగా తెరకెక్కించగలరని దత్ నమ్మారు.
చిరు కూడా ఆయనకే ఓటేశారు. తనపై వీళ్లు పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకేంద్రుడు ఎంతమాత్రం వమ్ము చేయలేదు. కెరీర్ తొలి రోజుల్లో తనేంటో రుజువు చేయడానికి ఎలా కసితో పని చేశారో.. ఈ చిత్రానికి కూడా అంతే కష్టపడ్డారు. ఈ సినిమాను దర్శకేంద్రుడు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో.. ఈ సినిమా ఫలితమేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చారిత్రక విజయాన్నందుకున్న ఈ సినిమా తర్వాత చిరు, రాఘవేంద్రరావు కలిసి ‘ఘరానా మొగుడు’ రూపంలో మరో ఇండస్ట్రీ హిట్ డెలివర్ చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on May 10, 2020 8:41 am
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిట్…