రాఘవేంద్రరావు టాలీవుడ్లో ఎంత పెద్ద కమర్షియల్ డైరెక్టరో.. ఆయన ఎలాంటి బ్లాక్ బస్టర్లు అందించారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే ఏ దర్శకుడికైనా మధ్యలో ఒక లీన్ ఫేజ్ ఉంటుంది. వరుస పరాజయాలతో ఇబ్బంది పడతాడు. అందులోనూ ఇప్పటి దర్శకుల్లా ఏడాదికి రెండేళ్లకు ఒక సినిమా చేయలేదు ఆయన. 30 ఏళ్ల వ్యవధిలో వంద సినిమాలు తీశారంటే ఎంత వేగం చూపించారో అర్థం చేసుకోవచ్చు.
ఆయన కూడా మధ్య మధ్యలో వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డారు. మంచి ఫాంలో ఉండగా ఆయన బాగా స్ట్రగులైన ఫేజ్ అంటే 1988-90 మధ్యే. మెగాస్టార్ చిరంజీవితో చేసిన యుద్ధభూమి, రుద్రనేత్ర సినిమాలతో పాటు నాగార్జునతో తీసిన అగ్ని, వెంకటేష్ హీరోగా తెరకెక్కించిన ఒంటరి పోరాటం ఫ్లాప్ అయ్యాయి. దీంతో రాఘవేంద్రరావు పనైపోయిందన్న కామెంట్లు వినిపించాయి.
అలాంటి సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకు సన్నాహాలు మొదలు పెట్టారు నిర్మాత అశ్వినీదత్. అప్పుడు దర్శకేంద్రుడి ఫామ్ చూసి.. ఆయనకు అవకాశమివ్వడమేంటి అని చాలామంది దత్ను వెనక్కి లాగారట. చిరంజీవితో వరుసగా రెండు ఫ్లాపులు ఇచ్చిన రాఘవేంద్రరావును ఎలా నమ్మారని ప్రశ్నించారట. కానీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి సినిమాను ఆయన మాత్రమే అందంగా తెరకెక్కించగలరని దత్ నమ్మారు.
చిరు కూడా ఆయనకే ఓటేశారు. తనపై వీళ్లు పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకేంద్రుడు ఎంతమాత్రం వమ్ము చేయలేదు. కెరీర్ తొలి రోజుల్లో తనేంటో రుజువు చేయడానికి ఎలా కసితో పని చేశారో.. ఈ చిత్రానికి కూడా అంతే కష్టపడ్డారు. ఈ సినిమాను దర్శకేంద్రుడు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో.. ఈ సినిమా ఫలితమేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చారిత్రక విజయాన్నందుకున్న ఈ సినిమా తర్వాత చిరు, రాఘవేంద్రరావు కలిసి ‘ఘరానా మొగుడు’ రూపంలో మరో ఇండస్ట్రీ హిట్ డెలివర్ చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on May 10, 2020 8:41 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…