ఏప్రిల్ 8తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందంటూ మొన్న ఆసక్తికర ట్వీట్ వేశాడు మెగాస్టార్ చిరంజీవి. ఏప్రిల్ 8 రానే వచ్చింది. ఆ తేదీతో తనకున్న అనుబంధం గురించి చిరు ఏం చెబుతాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ రోజు అల్లు అర్జున్, అక్కినేని అఖిల్, అకీరా నందన్ల పుట్టిన రోజు కావడంతో వాళ్ల గురించే చిరు స్పందిస్తాడని అనుకున్నారు. ఐతే వాళ్ల కంటే ముందు చిరు మరొకరి ప్రస్తావనతో రోజును ఆరంభించాడు. ఆ మరొకరు ఎవరో కాదు.. చిరంజీవికి అత్యంత ఇష్టమైన దేవుడు ఆంజనేయుడు.
ఈ రోజు హనుమజ్జయంతి అని గుర్తు చేస్తూ ఆంజనేయుడితో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర ట్వీట్లు వేశాడు చిరు. ‘‘ఈ రోజు హను మజ్జయంతి. ఆంజనేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది…చిన్నప్పటి నుంచి…1962 లో నాకు ఓ లాటరీలో ఈ బొమ్మ వచ్చింది..అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది..ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్.
కారణం ఏంటో తెలుసా? ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు.. ‘‘ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి” అన్నారు. అప్పటి నా ఫోటో’’ అంటూ ఆంజనేయుడి ఫొటోను చిరు షేర్ చేశాడు. మరో ట్వీట్లో బాపు వేసిన ఆంజనేయుడి చిత్రాన్ని షేర్ చేస్తూ.. ‘‘కొన్ని దశాబ్దాల తరవాత, 2002 లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నేను అది పాలరాతి మీద reproduce చేయింసిచి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా …?
బాపు గారు చెప్పిన మాట “ఏంటోనండి …బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి …అలానే ఉంచేసాను …మార్చలేదు” అన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే. అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు’’ అని చిరు చెప్పాడు.
This post was last modified on April 9, 2020 6:26 pm
నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…
థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…
వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…
మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…
ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…