Movie News

కోలీవుడ్లోకి పూజా బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ

ప్రస్తుతం తెలుగులో నంబర్ వన్ హీరోయిన్ ఎవరు అంటే.. మన ప్రేక్షకులు తడుముకోకుండా పూజా హెగ్డే పేరు చెప్పేస్తారు. ఇప్పటికే మహర్షి, అరవింద సమేత, అల వైకుంఠపురములో లాంటి భారీ చిత్రాల్లో బడా స్టార్లతో నటించిన పూజా.. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సహా మరికొన్ని పెద్ద చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో ఏ పెద్ద సినిమా పట్టాలెక్కినా.. కథానాయిక పాత్ర కోసం పూజా వైపే చూసే పరిస్థితి ఉంది. ఆమెకు హిందీలో సైతం మంచి డిమాండే ఉంది. అక్కడా రెండు మూడు భారీ చిత్రాల్లో నటిస్తోంది.

ఇక ఇండియాలో బాలీవుడ్, టాలీవుడ్ తర్వాత అతి పెద్ద ఇండస్ట్రీ.. హీరోయిన్లు తప్పక నటించాలని కోరుకునే పరిశ్రమ అంటే.. కోలీవుడ్డే. అక్కడ కూడా త్వరలోనే తన హవా మొదలుపెట్టడానికి పూజా రంగం సిద్ధం చేసుకుంది. ఆమె తమిళంలో ఇంకా సినిమా చేయకుండా ఏమీ లేదు. తనకు పెద్దగా గుర్తింపు లేని సమయంలోనే ఇక్కడ జీవా సరసన ‘మాస్క్’ అనే సినిమాలో నటించింది. అది సరిగా ఆడలేదు. పూజాకు పేరు రాలేదు.

ఐతే ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్లో పెద్ద హీరోయిన్ అయ్యాక కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వనుంది పూజా. ఆమె ఒకేసారి విజయ్ లాంటి సూపర్ స్టార్ సినిమాతో కోలీవుడ్లోకి అడుగుపెట్టనున్నట్లు ఇంతకుముందు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయం ఇప్పుడు ఖరారైంది. సంక్రాంతికి ‘మాస్టర్’తో పలకరించిన విజయ్.. దీని తర్వాత దిలీప్ నెల్సన్ కుమార్ అనే యువ దర్శకుడితో సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అందులో పూజానే కథానాయికగా నటించనుంది. ఈ సినిమాకు గాను ఆమె ఏకంగా రూ.3.5 కోట్ల పారితోషకం అందుకోనుందట.

నయనతార కాకుండా తమిళంలో ఈ స్థాయిలో పారితోషకం అందుకున్న కథానాయిక మరొకరు లేరు. తెలుగులో సైతం పూజా ఇంత వరకు ఇంత మొత్తం ఏ సినిమాకూ ఛార్జ్ చేయలేదు. పూజా ఇప్పుడున్న డిమాండ్లో తననే కథానాయికగా తీసుకోవాలనే పట్టుదలతో భారీ పారితోషకం ఆఫర్ చేసి ఈ సినిమాకు ఒప్పించారట.

This post was last modified on March 4, 2021 5:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

12 minutes ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

2 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

6 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

6 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

7 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

7 hours ago