నా పేరు సూర్య తర్వాత ఏడాదికి గ్యాప్ తీసుకుంటే తీసుకున్నాడు కానీ.. రీఎంట్రీలో అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ను అందించి అభిమానుల్ని సంబరాల్లో ముంచెత్తాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను సుకుమార్ దర్శకత్వంలో కొత్త చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా పట్టాలెక్కబోతోందీ సినిమా. కరోనా ప్రభావం తగ్గాక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కావచ్చు.
ఈ ఏడాది చివరికి ఈ చిత్రాన్ని బన్నీ పూర్తి చేసే అవకాశాలున్నాయి. దాని తర్వాత బన్నీ చేయబోయే సినిమా మీద రకరకాల ప్రచారాలు నడిచాయి. వేణు శ్రీరామ్తో ఐకాన్ మూవీని ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ దాన్ని ఇమ్మీడియట్గా అయితే బన్నీ మొదలుపెట్టేలా లేడు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రేసుగుర్రం సీక్వెల్ గురించి ప్రచారం జరిగింది కానీ.. బన్నీ ఇంకా కమిట్మెంట్ ఏమీ ఇవ్వలేదట. ప్రస్తుతానికి బన్నీ దృష్టి కొరటాల శివ మీద ఉన్నట్లు సమాచారం. తాను సుకుమార్ సినిమా పూర్తి చేసే సమయానికే కొరటాల ఆచార్య పూర్తి చేసి ఖాళీ అవుతాడు.
సామాజికాంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్లు తీసే కొరటాలతో సినిమా చేస్తే తన కెరీర్కు బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇంతకుముందే ఆయనతో సినిమా కోసం ప్రయత్నించాడు కానీ.. కాంబినేషన్ సెట్ కాలేదు.
ఇప్పుడు మెగా కాంపౌండ్లో అడుగు పెట్టిన ఆయనతో సినిమా కోసం బన్నీ ఆసక్తి ప్రదర్శిస్తున్నాడని.. కొరటాల ఓకే అంటే తర్వాతి సినిమాను గీతా ఆర్ట్స్ బేనర్లో ఆయనతోనే చేయొచ్చని అంటున్నారు. బుధవారం బన్నీ పుట్టిన రోజు నేపథ్యంలో కొత్త ప్రాజెక్టుల గురించి ఏమైనా ప్రకటిస్తారేమో చూడాలి.
This post was last modified on April 9, 2020 6:25 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…