నా పేరు సూర్య తర్వాత ఏడాదికి గ్యాప్ తీసుకుంటే తీసుకున్నాడు కానీ.. రీఎంట్రీలో అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ను అందించి అభిమానుల్ని సంబరాల్లో ముంచెత్తాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను సుకుమార్ దర్శకత్వంలో కొత్త చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా పట్టాలెక్కబోతోందీ సినిమా. కరోనా ప్రభావం తగ్గాక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కావచ్చు.
ఈ ఏడాది చివరికి ఈ చిత్రాన్ని బన్నీ పూర్తి చేసే అవకాశాలున్నాయి. దాని తర్వాత బన్నీ చేయబోయే సినిమా మీద రకరకాల ప్రచారాలు నడిచాయి. వేణు శ్రీరామ్తో ఐకాన్ మూవీని ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ దాన్ని ఇమ్మీడియట్గా అయితే బన్నీ మొదలుపెట్టేలా లేడు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రేసుగుర్రం సీక్వెల్ గురించి ప్రచారం జరిగింది కానీ.. బన్నీ ఇంకా కమిట్మెంట్ ఏమీ ఇవ్వలేదట. ప్రస్తుతానికి బన్నీ దృష్టి కొరటాల శివ మీద ఉన్నట్లు సమాచారం. తాను సుకుమార్ సినిమా పూర్తి చేసే సమయానికే కొరటాల ఆచార్య పూర్తి చేసి ఖాళీ అవుతాడు.
సామాజికాంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్లు తీసే కొరటాలతో సినిమా చేస్తే తన కెరీర్కు బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇంతకుముందే ఆయనతో సినిమా కోసం ప్రయత్నించాడు కానీ.. కాంబినేషన్ సెట్ కాలేదు.
ఇప్పుడు మెగా కాంపౌండ్లో అడుగు పెట్టిన ఆయనతో సినిమా కోసం బన్నీ ఆసక్తి ప్రదర్శిస్తున్నాడని.. కొరటాల ఓకే అంటే తర్వాతి సినిమాను గీతా ఆర్ట్స్ బేనర్లో ఆయనతోనే చేయొచ్చని అంటున్నారు. బుధవారం బన్నీ పుట్టిన రోజు నేపథ్యంలో కొత్త ప్రాజెక్టుల గురించి ఏమైనా ప్రకటిస్తారేమో చూడాలి.
This post was last modified on April 9, 2020 6:25 pm
నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…
థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…
వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…
మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…
ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…