నా పేరు సూర్య తర్వాత ఏడాదికి గ్యాప్ తీసుకుంటే తీసుకున్నాడు కానీ.. రీఎంట్రీలో అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ను అందించి అభిమానుల్ని సంబరాల్లో ముంచెత్తాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను సుకుమార్ దర్శకత్వంలో కొత్త చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా పట్టాలెక్కబోతోందీ సినిమా. కరోనా ప్రభావం తగ్గాక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కావచ్చు.
ఈ ఏడాది చివరికి ఈ చిత్రాన్ని బన్నీ పూర్తి చేసే అవకాశాలున్నాయి. దాని తర్వాత బన్నీ చేయబోయే సినిమా మీద రకరకాల ప్రచారాలు నడిచాయి. వేణు శ్రీరామ్తో ఐకాన్ మూవీని ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ దాన్ని ఇమ్మీడియట్గా అయితే బన్నీ మొదలుపెట్టేలా లేడు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రేసుగుర్రం సీక్వెల్ గురించి ప్రచారం జరిగింది కానీ.. బన్నీ ఇంకా కమిట్మెంట్ ఏమీ ఇవ్వలేదట. ప్రస్తుతానికి బన్నీ దృష్టి కొరటాల శివ మీద ఉన్నట్లు సమాచారం. తాను సుకుమార్ సినిమా పూర్తి చేసే సమయానికే కొరటాల ఆచార్య పూర్తి చేసి ఖాళీ అవుతాడు.
సామాజికాంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్లు తీసే కొరటాలతో సినిమా చేస్తే తన కెరీర్కు బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇంతకుముందే ఆయనతో సినిమా కోసం ప్రయత్నించాడు కానీ.. కాంబినేషన్ సెట్ కాలేదు.
ఇప్పుడు మెగా కాంపౌండ్లో అడుగు పెట్టిన ఆయనతో సినిమా కోసం బన్నీ ఆసక్తి ప్రదర్శిస్తున్నాడని.. కొరటాల ఓకే అంటే తర్వాతి సినిమాను గీతా ఆర్ట్స్ బేనర్లో ఆయనతోనే చేయొచ్చని అంటున్నారు. బుధవారం బన్నీ పుట్టిన రోజు నేపథ్యంలో కొత్త ప్రాజెక్టుల గురించి ఏమైనా ప్రకటిస్తారేమో చూడాలి.
This post was last modified on April 9, 2020 6:25 pm
టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం క్లాసిక్స్ గా ప్రత్యేకమైన చోటు దక్కించుకునే అల్లూరి సీతారామరాజు ఇవాళ 50 వసంతంలోకి అడుగు…
గౌతమీపుత్ర శాతకర్ణి ద్వారా పీరియాడిక్ సినిమాలను తాను ఎంత బాగా డీల్ చేయగలనో నిరూపించుకున్నాక దర్శకుడు క్రిష్ రూటే మారిపోయింది.…
గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ…
కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలకు కాలదోషం ఉండదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వీధుల దాకా తీసుకెళ్లి అక్కడ జెండా పాతేలా…
మాటల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తమ వ్యం గ్యాస్త్రాలు,…
ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్,…