దశాబ్దం వెనక్కి వెళ్తే.. దక్షిణాదిన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ పరంగా సూపర్ స్టార్ రజినీకాంత్కు ఏ హీరో కూడా దరిదాపుల్లో ఉండేవాడు కాదు. ముఖ్యంగా ‘రోబో’ సినిమాతో ఆయన రేంజే మారిపోయింది. మార్కెట్ అసాధారణ స్థాయిలో విస్తరించింది. విజయ్, అజిత్ లాంటి తర్వాతి తరం బడా స్టార్ల మార్కెట్ రజినీతో పోలిస్తే చాలా తక్కువగా ఉండేది. కానీ తర్వాతి కొన్నేళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రజినీ వరుస డిజాస్టర్లతో డౌన్ అయిపోయాడు. విజయ్, అజిత్ వరుస బ్లాక్బస్టర్లతో ఆయనకు దగ్గరగా వచ్చేశారు.
ముఖ్యంగా విజయ్ జోరైతే మామూలుగా లేదు. అతను చేసేవి రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలే. కానీ అవే బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్నందుకుంటూ వచ్చాయి. చూస్తుండగానే అతను రజినీకాంత్కు దగ్గరగా వచ్చేశాడు. ఆయన్ని దాటి కూడా ముందుకెళ్లిపోయాడు. ప్రస్తుతం తమిళంలో ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్, సక్సెస్ రేట్ పరంగా విజయే నంబర్ వన్ హీరో.
ఈ సంక్రాంతికి 50 పర్సంట్ ఆక్యుపెన్సీతో రిలీజై, డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా విజయ్ చిత్రం ‘మాస్టర్’ రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టడం గమనార్హం. రజినీ చివరి సినిమా ‘దర్బార్’ అటు ఇటుగా వంద కోట్లు రాబట్టిందంతే. అంతకుముందు ఆయన్నుంచి వచ్చిన పేట సైతం సరిగా ఆడలేదు. ఇదిలా ఉంటే.. ఇన్నాళ్లూ ఇన్డైరెక్ట్గా సూపర్ స్టార్పై పైచేయి సాధిస్తూ వచ్చిన విజయ్.. ఈసారి ఆయన్ని నేరుగా ఢీకొట్టి తన ఆధిపత్యం చాటాలనుకుంటున్నాడు.
విజయ్కి దీపావళికి సినిమాలు రిలీజ్ చేయడం అలవాటు. చాలా ఏళ్లుగా ఆ పండక్కి సినిమాలు వదులుతున్నాడు. ఐతే గత ఏడాది కరోనా కారణంగా లెక్క తప్పింది. ఈసారి దీపావళికి విజయ్ కంటే ముందు రజినీ తన ‘అన్నాత్తె’ సినిమాను రేసులో నిలబెట్టేశాడు. రజినీ మీద గౌరవంతో అయినా విజయ్.. దీపావళికి దూరంగా ఉంటాడనుకున్నారు. కానీ అతనేమో దిలీప్ నెల్సన్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించే సినిమాను దీపావళికే రిలీజ్ చేయాలని ఫిక్సయ్యాడట. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ అంటున్నారు. దీనిపై అంచనాలు మామూలుగా లేవు. రజినీని నేరుగా ఢీకొట్టి పైచేయి సాధించడం ద్వారా ఆయన్ని తాను దాటేశానని రుజువు చేయాలన్నది విజయ్ ఆలోచనేమో.
This post was last modified on March 4, 2021 2:57 pm
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…