ఫారియా అబ్దుల్లా.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న కొత్త అందం. జాతిరత్నాలు సినిమాతో కథానాయికగా పరిచయం అవుతోందీ లోకల్ బ్యూటీ. చిట్టి నీ నవ్వంటే అంటూ నవీన్ పొలిశెట్టి మైమరిచిపోయి పాడేస్తుంటే.. ఈ అమ్మాయి అందం చూసి కుర్రాళ్లు కూడా అదే భావనలోకి వెళ్లిపోయారు. రెగ్యులర్ హీరోయిన్లకు భిన్నమైన అందం, హావభావాలతో ఈ అమ్మాయి ప్రేక్షకులను దృష్టిని ఆకర్షించింది.
ఆరేళ్లకు పైగా థియేటర్ ఫీల్డ్లో అనుభవం సాధించి మరీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోందీ అమ్మాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో పుట్టి పెరిగిన తనకు సినిమా అవకాశం అనుకోకుండా వచ్చిందని ఆమె వెల్లడించింది. జాతిరత్నాలు నిర్మాత అయిన ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ కాలేజీ వేడుకలో తనను చూసి ఈ సినిమాకు ఎంపిక చేసినట్లు ఆమె తెలిపింది.
తాను హైదరాబాద్ లయోలా కాలేజీలో చదువుకున్నానని.. ఆ కాలేజీ పూర్వ విద్యార్థుల సమావేశానికి వెళ్లినపుడు ముఖ్య అతిథిగా వచ్చిన నాగ్ అశ్విన్కు కలిసి తనకున్న సినిమా ఆసక్తి గురించి చెప్పానని.. ఆ తర్వాత కొంత కాలానికి ఆయన పిలిచి ఆడిషన్ చేసి జాతిరత్నాలు సినిమాకు కథానాయికగా ఎంపిక చేశారని ఫారియా వెల్లడించింది. జాతిరత్నాలులో తన పాత్ర ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని, తనకీ సినిమా పెద్ద బ్రేక్ ఇస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ సినిమా తర్వాత ఎవరితో నటించాలని ఆశిస్తున్నారు అని అడిగితే.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్కు తాను వీరాభిమానిని అని.. ఆయనతో నటించాలని ఉందని చెప్పిన ఫారియా.. తెలుగులో మాత్రం విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయాలన్నది తన కోరిక అని వెల్లడించింది. జాతిరత్నాలు ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 3, 2021 10:57 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…