Movie News

భీష్మా కు అవార్డ్స్ అంటూ మోసం చేశారు

రీల్ కు రియల్ కు మధ్య వ్యత్యాసం ఎంతలా ఉంటుందన్న విషయాన్ని చెప్పే వైనంగా దీన్ని చెప్పాలి. అపరిమితమైన తెలివితేటలతో.. ప్రత్యర్థులకు మైండ్ గేమ్ తో చుక్కలు చూపించేలా సినిమా తీసిన దర్శకుడు ఆయన. సూపర్ హిట్ సినిమా తీయటమే కాదు.. తన సినిమాలో హీరో చేత మైండ్ గేమ్ ఆడించి.. విలన్లను చిత్తు చేయటం చూశాం. అలాంటి దర్శకుడికి సైబర్ దొంగలు జెల్లకాయ ఇచ్చిన వైనం సంచలనంగా మారింది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు? అంతలా ఆయన ఎలా బుక్ అయ్యారు? ఏ మాటలకు ఆయన పడిపోయారు? అన్న వివరాల్లోకి వెళితే..

గత ఏడాది బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటైన భీష్మ సినిమా గుర్తుంది కదా. లాక్ డౌన్ కు ముందు విడుదలై.. అందరిని విపరీతంగా ఆకట్టుకున్న సినిమా అది. ఆ సినిమా తర్వాత కొన్నిరోజులకే లాక్ డౌన్ పుణ్యమా అని సినిమా థియేటర్లకు వెళ్లలేని పరిస్థితి. దీంతో.. చాలామందికి లాక్ డౌన్ ముందు థియేటర్లో సినిమా చూసిన చివరి సినిమా భీష్మానే. ఆ సినిమాకు దర్శకుడు వెంకీ కుడుముల. హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులకు తాజాగా ఆయన ఫిర్యాదు ఇచ్చారు. తనను సైబర్ దొంగలు మోసం చేసినట్లుగా పేర్కొన్నారు.

దీంతో ఆశ్చర్యపోయిన పోలీసులు.. అసలేం జరిగిందన్న ఆరా తీశారు. జరిగిందేమంటే.. నితిన్ హీరోగా నటించిన భీష్మ చక్కటి విజయాన్ని సాధించిన నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు.. చిత్ర దర్శకుడికి ఫోన్ చేశారు. త్వరలో జరగబోయే అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కు వారి చిత్రాన్ని అన్ని వర్గాల్లో నామినేట్ చేయనున్నట్లు చెప్పారు. వారి మాటలన్ని నమ్మకం కలిగిన దర్శకుడు.. వారు చెప్పినట్లుగా దఫాల వారీగా మొత్తం రూ.66వేలను చెల్లించాడు.

తర్వాత రోజు దర్శకుడికి ఫోన్ చేసిన సైబర్ దొంగలు.. తమ వల్ల చిన్న పొరపాటు జరిగిందని.. ఆరు విభాగాల్లో నామినేట్ చేయటానికి బదులుగా మూడింటిలోనే చేశామని.. వాటిని సరి చేయటానికి మరికొంత డబ్బు కావాలని అడిగారు. అప్పటివరకు వారి మాటల మీద నమ్మకం ఉన్న దర్శకుడు..అనుమానం వచ్చింది. దీంతో.. ఆరా తీశారు. ప్రాథమికంగా సైబర్ నేరగాళ్లుగా గుర్తించారు. దీంతో.. తాను ఇచ్చిన మొత్తం గాల్లో కలిసిపోయిందన్న విషయాన్ని అవగాహనకు వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేశారు. నేరగాళ్లు ఉపయోగించిన ఫోన్ ఇతరత్రా వస్తువులతో వారి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తన సినిమాల్లోమైండ్ బ్లాక్ అయ్యేలా వ్యూహాలు సిద్దం చేసిన హీరోను తెర మీద నడిపించే దర్శకుడు.. ఇలా సైబర్ దొంగల ధాటికి అడ్డంగా బుక్ కావటం షాకింగ్ గా మారింది.

This post was last modified on March 2, 2021 2:36 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

1 hour ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

2 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

3 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

4 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago