జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా పనిలో బిజీగా ఉంటే.. దాని తర్వాత అతను నటించే సినిమా కోసం మరోవైపు చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఇంకో మూడు నెలల్లోపే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 20న తారక్ పుట్టిన రోజే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంటుందని సంకేతాలు కూడా అందుతున్నాయి.
ప్రి ప్రొడక్షన్ వర్క్ పనులు సాగిస్తూనే.. కాస్ట్ అండ్ క్రూ ఎంపికపై దృష్టిసారించాడట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు కథానాయిక, సంగీత దర్శకుడు ఖరారయ్యారట. అలాగే సినిమా రిలీజ్ విషయంలోనూ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు సమాచారం.
తారక్-త్రివిక్రమ్ సినిమాకు రష్మిక మందన్నా కథానాయికగా ఓకే అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఎన్టీఆర్ జత కట్టనిది రష్మికతో మాత్రమే. ఆమె ప్రస్తుతం ఎలాంటి ఫాంలో ఉందో కూడా తెలిసిందే. సౌత్ ఇండియాలోనే అత్యంత డిమాండ్ ఉన్న రష్మికను పెట్టుకుంటే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఎంతో చలాకీగా నటించే రష్మికకు త్రివిక్రమ్ మార్కు క్యారెక్టర్ ఇస్తే భలేగా పేలుతుందనడంలో సందేహం లేదు.
ఇక ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు ముందు నుంచి అనుకుంటున్నట్లే తమనే సంగీత దర్శకుడిగా ఖరారైనట్లు సమాచారం. వరుసగా త్రివిక్రమ్ మూడో సినిమాకు అతను సంగీతం అందించనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని 2022 వేసవిలో విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. ముందు 2022 సంక్రాంతినే టార్గెట్ చేశారు కానీ.. అప్పటికి సినిమాను రెడీ చేయడం కష్టం. పైగా ఆ సీజన్కు ఆల్రెడీ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ల సినిమాలు ఖరారయ్యాయి కాబట్టి వేసవికి ఈ చిత్రాన్ని షెడ్యూల్ చేయనున్నట్లు తెలిసింది.
ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…