జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా పనిలో బిజీగా ఉంటే.. దాని తర్వాత అతను నటించే సినిమా కోసం మరోవైపు చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఇంకో మూడు నెలల్లోపే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 20న తారక్ పుట్టిన రోజే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంటుందని సంకేతాలు కూడా అందుతున్నాయి.
ప్రి ప్రొడక్షన్ వర్క్ పనులు సాగిస్తూనే.. కాస్ట్ అండ్ క్రూ ఎంపికపై దృష్టిసారించాడట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు కథానాయిక, సంగీత దర్శకుడు ఖరారయ్యారట. అలాగే సినిమా రిలీజ్ విషయంలోనూ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు సమాచారం.
తారక్-త్రివిక్రమ్ సినిమాకు రష్మిక మందన్నా కథానాయికగా ఓకే అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఎన్టీఆర్ జత కట్టనిది రష్మికతో మాత్రమే. ఆమె ప్రస్తుతం ఎలాంటి ఫాంలో ఉందో కూడా తెలిసిందే. సౌత్ ఇండియాలోనే అత్యంత డిమాండ్ ఉన్న రష్మికను పెట్టుకుంటే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఎంతో చలాకీగా నటించే రష్మికకు త్రివిక్రమ్ మార్కు క్యారెక్టర్ ఇస్తే భలేగా పేలుతుందనడంలో సందేహం లేదు.
ఇక ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు ముందు నుంచి అనుకుంటున్నట్లే తమనే సంగీత దర్శకుడిగా ఖరారైనట్లు సమాచారం. వరుసగా త్రివిక్రమ్ మూడో సినిమాకు అతను సంగీతం అందించనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని 2022 వేసవిలో విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. ముందు 2022 సంక్రాంతినే టార్గెట్ చేశారు కానీ.. అప్పటికి సినిమాను రెడీ చేయడం కష్టం. పైగా ఆ సీజన్కు ఆల్రెడీ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ల సినిమాలు ఖరారయ్యాయి కాబట్టి వేసవికి ఈ చిత్రాన్ని షెడ్యూల్ చేయనున్నట్లు తెలిసింది.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…