ఎన్నో ఆశలతో టాలీవుడ్లో కథానాయికలుగా అరంగేట్రం చేద్దామని చూశారు రాజశేఖర్ కూతుళ్లు. పెద్దమ్మాయి శివాని కథానాయికగా మొదలైన తొలి సినిమా మధ్యలోనే ఆగిపోగా.. రెండో అమ్మాయి శివాత్మిక తొలి చిత్రం దొరసాని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టి ఆమెకు నిరాశను మిగిల్చింది. వీళ్లిద్దరూ తెలుగులో ప్రస్తుతం వేరే ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. కాగా శివాత్మికకు తమిళంలో ఒక పేరున్న సినిమాలో కథానాయికగా నటించే అవకాశం దక్కడం విశేషం. ఆమె తమిళ సీనియర్ నటుడు కార్తీక్ తనయుడైన గౌతమ్ కార్తీక్ సరసన తమిళంలో ఓ సినిమా చేస్తోంది.
ఆ సినిమా పేరు.. ఆనందం విలయాడుమ్ వీడు. ఆనందం విలసిల్లే ఇల్లు అని ఈ టైటిల్ అర్థం. పేరుకు తగ్గట్లే సందడిగా ఉన్న ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదిలారు ఈ సినిమా నుంచి. హీరోయిన్ నాయకత్వంలో ఆడాళ్లంతా ఒకవైపు నిలుచుంటే.. హీరో జట్టు మరోవైపు నిలిచి తాడు లాగే ఆట ఆడుతున్న దృశ్యంతో ఫస్ట్ లుక్ తీర్చిదిద్దారు. ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా అని ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. లాంగ్ షాట్లో ఉన్న ఫస్ట్ లుక్ కావడంతో ఇందులో హీరో హీరోయిన్లు హైలైట్ కాలేదు. శివాత్మిక లంగావోణీలో సంప్రదాయ బద్ధమైన పాత్ర చేస్తున్నట్లుంది.
తన కూతురు తమిళంలో పేరున్న హీరో పక్కన కథానాయికగా పరిచయం అవుతుండటంతో రాజశేఖర్ ఎంతో ఆనందంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను షేర్ చేశారు. ఆయన స్వతహాగా తమిళుడే అన్న సంగతి తెలిసిందే. తమిళ ఇండస్ట్రీలోనూ ఆయనకు పరిచయాలు బాగానే ఉన్నాయి. ఆ పరిచయాలతోనే కూతురిని తమిళ తెరకు పరిచయం చేస్తున్నట్లున్నారు. నంద పెరియస్వామి అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మరి తమిళంలో అయినా శివాత్మిక కెరీర్కు శుభారంభం దక్కుతుందేమో చూడాలి.
This post was last modified on March 2, 2021 12:25 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…