ఎన్నో ఆశలతో టాలీవుడ్లో కథానాయికలుగా అరంగేట్రం చేద్దామని చూశారు రాజశేఖర్ కూతుళ్లు. పెద్దమ్మాయి శివాని కథానాయికగా మొదలైన తొలి సినిమా మధ్యలోనే ఆగిపోగా.. రెండో అమ్మాయి శివాత్మిక తొలి చిత్రం దొరసాని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టి ఆమెకు నిరాశను మిగిల్చింది. వీళ్లిద్దరూ తెలుగులో ప్రస్తుతం వేరే ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. కాగా శివాత్మికకు తమిళంలో ఒక పేరున్న సినిమాలో కథానాయికగా నటించే అవకాశం దక్కడం విశేషం. ఆమె తమిళ సీనియర్ నటుడు కార్తీక్ తనయుడైన గౌతమ్ కార్తీక్ సరసన తమిళంలో ఓ సినిమా చేస్తోంది.
ఆ సినిమా పేరు.. ఆనందం విలయాడుమ్ వీడు. ఆనందం విలసిల్లే ఇల్లు అని ఈ టైటిల్ అర్థం. పేరుకు తగ్గట్లే సందడిగా ఉన్న ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదిలారు ఈ సినిమా నుంచి. హీరోయిన్ నాయకత్వంలో ఆడాళ్లంతా ఒకవైపు నిలుచుంటే.. హీరో జట్టు మరోవైపు నిలిచి తాడు లాగే ఆట ఆడుతున్న దృశ్యంతో ఫస్ట్ లుక్ తీర్చిదిద్దారు. ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా అని ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. లాంగ్ షాట్లో ఉన్న ఫస్ట్ లుక్ కావడంతో ఇందులో హీరో హీరోయిన్లు హైలైట్ కాలేదు. శివాత్మిక లంగావోణీలో సంప్రదాయ బద్ధమైన పాత్ర చేస్తున్నట్లుంది.
తన కూతురు తమిళంలో పేరున్న హీరో పక్కన కథానాయికగా పరిచయం అవుతుండటంతో రాజశేఖర్ ఎంతో ఆనందంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను షేర్ చేశారు. ఆయన స్వతహాగా తమిళుడే అన్న సంగతి తెలిసిందే. తమిళ ఇండస్ట్రీలోనూ ఆయనకు పరిచయాలు బాగానే ఉన్నాయి. ఆ పరిచయాలతోనే కూతురిని తమిళ తెరకు పరిచయం చేస్తున్నట్లున్నారు. నంద పెరియస్వామి అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మరి తమిళంలో అయినా శివాత్మిక కెరీర్కు శుభారంభం దక్కుతుందేమో చూడాలి.
This post was last modified on March 2, 2021 12:25 pm
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…
దర్శకుడు శంకర్ రెండో సినిమాగా ప్రేమికుడు మీద మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొరియోగ్రాఫర్ గా ఉన్న…
యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు పరశురామ్.…
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…
లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి..…