Movie News

‘దృశ్యం’లో అలా.. నిజంగా ఏం జరిగిందో తెలుసా?

ఒక భాషలో విజయవంతం అయిన సినిమా ఇంకో భాషలో ఆడుతుందని గ్యారెంటీ లేదు. ఇలా దెబ్బ తిన్న సినిమాలు చాలానే కనిపిస్తాయి. కానీ తీసిన ప్రతి భాషలోనూ సూపర్ సక్సెస్ అయిన అరుదైన సినిమాల్లో ‘దృశ్యం’ ఒకటి. ముందుగా మలయాళంలో తెరకెక్కి ఇండస్ట్రీ హిట్ అయిన ‘దృశ్యం’ను ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో రీమేక్ చేస్తే అన్ని చోట్లా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ‘దృశ్యం-2’ సైతం అపూర్వ ఆదరణను దక్కించుకుంటోంది.

ఇంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్న కథ పుట్టింది వాస్తవ ఘటనల నుంచే అంటున్నాడు దర్శకుడు జీతు జోసెఫ్. తాను ఏ కథ రాసినా.. దానికి చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు లేదంటే వార్తా కథనాల నుంచి స్ఫూర్తి పొందుతానని.. ‘దృశ్యం’ కూడా అందుకు మినహాయింపు కాదని జీతు తెలిపాడు. ఇందులో ప్రధాన పాత్రధారి అయిన జార్జి కుట్టి అనే వ్యక్తి నిజంగా ఉన్నట్లు అతను వెల్లడించాడు.

‘దృశ్యం’ తొలి భాగంలో చూపించిన హత్య.. దాన్ని మరుగుపరిచేందుకు ఓ కుటుంబం చేసే ప్రయత్నం అంతా కూడా నిజంగా జరిగిందే అని జీతు తెలిపాడు. ఐతే వాస్తవంగా ఆ వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడని.. ఐతే పోలీసులకు దొరక్కుండా ఆ వ్యక్తి పకడ్బందీగా వ్యవహరిస్తే ఎలా ఉండేదన్న ఆలోచనతో తాను ‘దృశ్యం’ స్క్రిప్టు రాశానని అతను వెల్లడించాడు. ఇక జార్జి కుట్టి పాత్రలో చాలా లక్షణాలు తాను తన తండ్రి నుంచి తీసుకున్నట్లు జీతు చెప్పాడు. హీరో సినిమా పిచ్చి అంతా తన నుంచి పుట్టిందన్నాడు.

‘దృశ్యం’ చిత్రాన్ని అందరూ థ్రిల్లర్ అనుకుంటారని.. నిజానికి అది ఒక ఫ్యామిలీ డ్రామా అని.. ప్రేక్షకులను ఎక్కువ ఆకట్టుకున్నది కూడా కుటుంబానికి సంబంధించిన విషయాలే అని.. భాషా భేదం లేకుండా అందరూ ఈ సినిమాతో కనెక్ట్ అయ్యారంటే కూడా ఇందులో చూపించిన సార్వజనీనమైన ఫ్యామిలీ ఎమోషన్లే కారణమని.. కుటుంబం కోసం ఓ వ్యక్తి ఎంత దూరమైనా వెళ్లడమే ప్రేక్షకులను నచ్చిందని జీతు అభిప్రాయపడ్డాడు.

This post was last modified on February 28, 2021 1:02 pm

Share
Show comments
Published by
Satya
Tags: Drishyam

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

4 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

6 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

10 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

10 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

11 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

11 hours ago