సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ వచ్చే ఏడాది కార్యరూపం దాల్చబోతోంది. దర్శక ధీరుడు రాజమౌళి.. మహేష్ బాబుతో చేయబోయే సినిమా ఇప్పటికే ఖరారైంది. ఐతే ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందన్నదానిపై స్పష్టత లేదు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి తీయబోయే సినిమా మాత్రం ఇదే. కానీ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి రాజమౌళి బయటికి రావడానికే ఇంకా ఏడెనిమిది నెలలు పట్టేలా ఉంది.
మిగతా దర్శకుల్లాగా ఒక సినిమా పూర్తయిన వెంటనే ఇంకోటి మొదలుపెట్టేసే రకం కాదు జక్కన్న. సినిమా సినిమాకూ తనపై పెరిగే అంచనాలు అందుకోవడం కోసం స్క్రిప్టు మీద చాలా సమయం వెచ్చిస్తాడు. ప్రి ప్రొడక్షన్ వర్క్ కూడా ఆషామాషీగా జరగదు. ఈ నేపథ్యంలోనే 2022 ద్వితీయార్ధంలో కానీ తాను సినిమా మొదలుపెట్టలేనని మహేష్కు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడట జక్కన్న.
ఈ నేపథ్యంలో ‘సర్కారు వారి పాట’ అయ్యాక రాజమౌళి సినిమా మొదలుపెట్టడానికి ముందు ఒకటి లేదా రెండు సినిమాలు చేయొచ్చని మహేష్ భావిస్తున్నాడు. రెండో సినిమా సంగతేమో కానీ.. ఒక సినిమా అయితే మాత్రం పక్కాగా చేయబోతున్నాడు. దాన్ని ఖరారు చేసే పనిలో మహేష్ ప్రస్తుతం ఉన్నట్లు సమాచారం. ‘సర్కారు వారి పాట’ దుబాయ్ షెడ్యూల్ ముగించుకుని కొంచెం గ్యాప్ తీసుకున్న మహేష్.. అందుబాటులో ఉన్న దర్శకుల నుంచి కథలు వినే పనిలో పడ్డాడట.
అతడితో ఇప్పటికే సినిమాలు చేసిన అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లిలు ముందు వరసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు మహేష్తో ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమా చేసిన అనిల్.. ఈసారి కొంచెం భిన్నమైన కథతో మహేష్ను కలుస్తున్నట్లు సమాచారం. మరోవైపు ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్ తనతో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ కావడంతో నిరాశపడ్డ వంశీ పైడిపల్లి.. మరోసారి సూపర్ స్టార్ను మెప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వీళ్లిద్దరిలో ఒకరితో రాజమౌళి సినిమాకు ముందు మహేష్ కలిసి పని చేసే అవకాశముంది. అనిల్తోనే మూవీ ఖరారవ్వచ్చని అంటున్నారు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…