మూణ్నాళుగేళ్ల ముందు రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో నంబర్ వన్ హీరోయిన్. సమంత, కాజల్, తమన్నా, అనుష్క లాంటి టాప్ స్టార్ల జోరు తగ్గిపోయిన సమయంలో ఆమె వరుస హిట్లతో దూసుకెళ్లింది. పెద్ద పెద్ద హీరోలతో వరుసగా భారీ చిత్రాలు చేసింది. ఇక ఆమెకు తిరుగులేదని, తనను కొట్టేవాళ్లు లేరని అంతా అనుకుంటే.. ఉన్నట్లుండి తన కెరీర్ డౌన్ అయిపోయింది. వరుస ఫ్లాపులతో రకుల్ వెనుకబడిపోయింది. అవకాశాలు తగ్గిపోయాయి. చూస్తుండగానే తెలుగు సినిమాల నుంచి కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది. చివరగా తెలుగులో రకుల్ నటించిన ‘మన్మథుడు-2’ కూడా పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె టాలీవుడ్లో కనిపించలేదు.
ఐతే చాలా విరామం తర్వాత ఆమె నటించిన ‘చెక్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇందులో రకుల్ ముఖ్య పాత్రే పోషించినట్లు కనిపిస్తోంది. ఐతే గ్యాప్ తర్వాత తెలుగులో తాను నటించిన ఓ ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజవుతుంటే.. రకుల్ ప్రమోషన్లలో ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ముందు ‘చెక్’ టీం ఒక ప్రెస్ మీట్ పెట్టింది. అందులో రకుల్ కనిపించలేదు. దానికి సినిమాలో మరో కథానాయికగా నటిస్తున్న మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ మాత్రం హాజరైంది. రకుల్ ప్రి రిలీజ్ ఈవెంట్కు వస్తుందేమో అనుకున్నారు. కానీ ఆ రోజు కూడా రకుల్ దర్శనమివ్వలేదు. ఆ వేడుకలోనూ ప్రియనే హైలైట్ అయింది. ప్రియ తర్వాత మీడియా వాళ్లనూ స్పెషల్గా మీట్ అయింది. కానీ రకుల్ ఇప్పుడు కూడా కనిపించడం లేదు. ట్విట్టర్లో కూడా ఏదో మొక్కుబడిగా సినిమాకు సంబంధించి ఒకటీ అరా ట్వీట్లు వేస్తోంది తప్ప ఈ సినిమాను రకుల్ ఓన్ చేసుకున్నట్లుగా కనిపించడం లేదు.
అసలే టాలీవుడ్లో కెరీర్ డల్ అయిన టైంలో తాను నటించిన ఓ పేరున్న సినిమా రిలీజవుతుంటే రకుల్ ఎందుకు పట్టించుకోవట్లేదన్నది అర్థం కాని విషయం. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఒక్క రోజు కూడా కేటాయించనంత బిజీగా రకుల్ ఉందా అన్నది సందేహం. ఐతే సినిమాలో తన పాత్ర కంటే ప్రియ క్యారెక్టర్ను పెంచడం, ఆమెకు ఒక పాట కూడా పెట్టడం పట్ల ఆమె హర్ట్ అయిందని, దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో ఇంకేవో మనస్ఫర్థలు వచ్చాయని, ఈ నేపథ్యంలోనే ఆమె ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 25, 2021 12:55 pm
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…
ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…