‘మహానటి’ సినిమా తర్వాత కీర్తి సురేశ్ కెరీర్ గ్రాఫ్ మొత్తం మారిపోయింది. ‘మహానటి’ సావిత్రి పాత్రలో పరకాయప్రవేశం చేసిన కీర్తిసురేశ్ నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా దక్కింది. ఈ సినిమా తర్వాత కీర్తిసురేశ్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కవుట్ కాకపోయినా… ఆమెకు లెక్కకు మించిన ఆఫర్స్, అంతకుమించి రూమర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి.
ప్రస్తుతం తెలుగులో ‘మిస్ ఇండియా’, ‘గుడ్లక్ సఖి’, ‘రంగ్ దే’ సినిమాల్లో నటిస్తున్న కీర్తిసురేశ్… కోలీవుడ్లో రెండు, మలయాళంలో ఓ సినిమాతో ఫుల్లు బిజీగా ఉంది. ప్రస్తుతం కీర్తిసురేశ్తో కలిసి ‘రంగ్ దే’ సినిమా చేస్తున్న నితిన్, తన తర్వాతి సినిమాలో కూడా కీర్తినే హీరోయిన్గా ఎంచుకున్నాడట.
కృష్ణచైతన్య డైరెక్షన్లో ‘పవర్ పేట’ అనే సినిమాను కన్ఫార్మ్ చేసిన నితిన్, ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. అందుకే కీర్తిసురేశ్ అయితే అక్కడ కూడా కావాల్సినంత క్రేజ్ వస్తుందని నితిన్ ఆలోచన.
ఇదేకాకుండా పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే చిత్రంలో కూడా కీర్తిసురేశ్నే హీరోయిన్గా అనుకుంటున్నారట. అధికారికంగా అనౌన్స్మెంట్ రావడమే తరువాయి అని టాక్ నడుస్తోంది. ‘మహానటి’ సినిమా తర్వాత సెట్స్లో కీర్తిసురేశ్ బిహేవియర్లో ఛేంజ్ వచ్చినా… ఆమె టాలెంట్, క్రేజ్ కారణంగా వరుస ఆఫర్స్ పట్టేస్తోందనమాట.
This post was last modified on May 8, 2020 6:44 pm
అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, కాబట్టి సమావేశాలకు తాను హాజరు కావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ పదే…
వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. పైకి అందరూ బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం పై ఎత్తులు వేసుకుంటు.. నాయకులు…
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ చేయడంతో కొత్త ఆవిష్కరణలు…
వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి.. ఆ రెండు పదవులు వదులుకున్న విషయం తెలిసిందే. అయితే.. సాయిరెడ్డి…
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి ఆయన…
ఏపీ అసెంబ్లీలో తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని.. ఆలా అయితేనే తాను అసెంబ్లీకి వస్తానని వైసీపీ అధినేత…