రోజురోజుకీ విస్తరిస్తున్న సోషల్ మీడియా కారణంగా జనాలకు విపరీతమైన స్వేచ్ఛ దొరికింది. చిన్న ఛాన్స్ దొరికితే చాలు… పీఎం దగ్గర్నుంచి సినిమా హీరోల దాకా అందర్నీ ట్రోల్ చేసి చంపేస్తున్నారు. పాజిటివ్గా ట్వీట్ చేసినా కూడా జనాల నుంచి విపరీతమైన నెగిటివిటీకి గురవుతున్నవారి సంగతి చెప్పక్కర్లేదు. తాజాగా అలా సోషల్ మీడియా జనాలకి చిక్కి, మరోసారి ట్రోలింగుకు గురయ్యాడు అల్లు శిరీష్.
మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చినా మిగిలినవారిలా క్రేజ్ దక్కించుకోలేకపోయాడు అల్లు శిరీష్. శిరీష్ ఎంట్రీ మూవీ ‘గౌరవం’ మూవీ నుంచి లేటెస్ట్ మూవీ ‘ఏబీసీడీ’ దాక అన్నీ డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చాయి. మధ్యలో వచ్చిన మారుతి ‘కొత్తజంట’ మాత్రమే సోసో విజయాన్ని అందించింది. ఫలితాలతో సంబంధం లేకుండా ప్రతీ సినిమాకు నూరుశాతం కష్టపడుతున్నాడు శిరీష్. సినిమాల సెలక్షన్కి చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. లాక్డౌన్లో ఉన్న అల్లు శిరీష్… సోషల్ మీడియాలో తెగ యాక్టివ్గా ఉంటున్నాడు. దాంతో ఓ వ్యక్తి ‘బర్త్ డే సరదాగా ఒక నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఇయ్యి అన్నా’ అంటూ శిరీష్కు ట్వీట్ చేశాడు. దానికి సమాధానంగా ‘తీసుకో బ్రో.. యూజర్ నేమ్: దయా… పాస్ వర్డ్: పోలీస్… ఎంజాయ్’ అంటూ జోక్ చేశాడు. టెంపర్ సినిమాలో డైలాగుతో ఆకట్టుకున్నాడు.
కాని ఈ జోక్ను ట్రోలింగ్కి వాడుకుంటున్నారు కొందరు నెటిజన్లు. ‘ఈ జోక్ కంటే నీ కెరీర్ గ్రాఫే చాలా కామెడీగా ఉంది అన్నా’ అంటూ కామెంట్ చేశాడో యువకుడు. ఇలా సరదాగా జోక్ చేయాలని చూసిన మెగా హీరోకి ట్రోల్ చేస్తూ ఓ ఆటాడేసుకున్నారు నెటిజన్లు. శిరీష్కు ఇలాంటి ట్రోలింగ్ కొత్తేమీకాదు. మనోడిని చాలాసార్లు, చాలా విషయాల్లో ట్రోల్ చేశారు సోషల్ మీడియా జనాలు. అయితే వాటిని పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటూ వెళ్తున్నాడు అల్లు శిరీష్.
This post was last modified on May 8, 2020 6:45 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…