రోజురోజుకీ విస్తరిస్తున్న సోషల్ మీడియా కారణంగా జనాలకు విపరీతమైన స్వేచ్ఛ దొరికింది. చిన్న ఛాన్స్ దొరికితే చాలు… పీఎం దగ్గర్నుంచి సినిమా హీరోల దాకా అందర్నీ ట్రోల్ చేసి చంపేస్తున్నారు. పాజిటివ్గా ట్వీట్ చేసినా కూడా జనాల నుంచి విపరీతమైన నెగిటివిటీకి గురవుతున్నవారి సంగతి చెప్పక్కర్లేదు. తాజాగా అలా సోషల్ మీడియా జనాలకి చిక్కి, మరోసారి ట్రోలింగుకు గురయ్యాడు అల్లు శిరీష్.
మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చినా మిగిలినవారిలా క్రేజ్ దక్కించుకోలేకపోయాడు అల్లు శిరీష్. శిరీష్ ఎంట్రీ మూవీ ‘గౌరవం’ మూవీ నుంచి లేటెస్ట్ మూవీ ‘ఏబీసీడీ’ దాక అన్నీ డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చాయి. మధ్యలో వచ్చిన మారుతి ‘కొత్తజంట’ మాత్రమే సోసో విజయాన్ని అందించింది. ఫలితాలతో సంబంధం లేకుండా ప్రతీ సినిమాకు నూరుశాతం కష్టపడుతున్నాడు శిరీష్. సినిమాల సెలక్షన్కి చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. లాక్డౌన్లో ఉన్న అల్లు శిరీష్… సోషల్ మీడియాలో తెగ యాక్టివ్గా ఉంటున్నాడు. దాంతో ఓ వ్యక్తి ‘బర్త్ డే సరదాగా ఒక నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఇయ్యి అన్నా’ అంటూ శిరీష్కు ట్వీట్ చేశాడు. దానికి సమాధానంగా ‘తీసుకో బ్రో.. యూజర్ నేమ్: దయా… పాస్ వర్డ్: పోలీస్… ఎంజాయ్’ అంటూ జోక్ చేశాడు. టెంపర్ సినిమాలో డైలాగుతో ఆకట్టుకున్నాడు.
కాని ఈ జోక్ను ట్రోలింగ్కి వాడుకుంటున్నారు కొందరు నెటిజన్లు. ‘ఈ జోక్ కంటే నీ కెరీర్ గ్రాఫే చాలా కామెడీగా ఉంది అన్నా’ అంటూ కామెంట్ చేశాడో యువకుడు. ఇలా సరదాగా జోక్ చేయాలని చూసిన మెగా హీరోకి ట్రోల్ చేస్తూ ఓ ఆటాడేసుకున్నారు నెటిజన్లు. శిరీష్కు ఇలాంటి ట్రోలింగ్ కొత్తేమీకాదు. మనోడిని చాలాసార్లు, చాలా విషయాల్లో ట్రోల్ చేశారు సోషల్ మీడియా జనాలు. అయితే వాటిని పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటూ వెళ్తున్నాడు అల్లు శిరీష్.
This post was last modified on May 8, 2020 6:45 pm
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…