Movie News

మెగా హీరో జోకేస్తే.. ట్రోల్ చేస్తున్నారు

రోజురోజుకీ విస్తరిస్తున్న సోషల్ మీడియా కారణంగా జనాలకు విపరీతమైన స్వేచ్ఛ దొరికింది. చిన్న ఛాన్స్ దొరికితే చాలు… పీఎం దగ్గర్నుంచి సినిమా హీరోల దాకా అందర్నీ ట్రోల్ చేసి చంపేస్తున్నారు. పాజిటివ్‌గా ట్వీట్ చేసినా కూడా జనాల నుంచి విపరీతమైన నెగిటివిటీకి గురవుతున్నవారి సంగతి చెప్పక్కర్లేదు. తాజాగా అలా సోషల్ మీడియా జనాలకి చిక్కి, మరోసారి ట్రోలింగుకు గురయ్యాడు అల్లు శిరీష్.

మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చినా మిగిలినవారిలా క్రేజ్ దక్కించుకోలేకపోయాడు అల్లు శిరీష్. శిరీష్ ఎంట్రీ మూవీ ‘గౌరవం’ మూవీ నుంచి లేటెస్ట్ మూవీ ‘ఏబీసీడీ’ దాక అన్నీ డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చాయి. మధ్యలో వచ్చిన మారుతి ‘కొత్తజంట’ మాత్రమే సోసో విజయాన్ని అందించింది. ఫలితాలతో సంబంధం లేకుండా ప్రతీ సినిమాకు నూరుశాతం కష్టపడుతున్నాడు శిరీష్. సినిమాల సెలక్షన్‌కి చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. లాక్‌డౌన్‌లో ఉన్న అల్లు శిరీష్… సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటున్నాడు. దాంతో ఓ వ్యక్తి ‘బర్త్ డే సరదాగా ఒక నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఇయ్యి అన్నా’ అంటూ శిరీష్‌కు ట్వీట్ చేశాడు. దానికి సమాధానంగా ‘తీసుకో బ్రో.. యూజర్ నేమ్: దయా… పాస్ వర్డ్: పోలీస్… ఎంజాయ్’ అంటూ జోక్ చేశాడు. టెంపర్ సినిమాలో డైలాగుతో ఆకట్టుకున్నాడు.

కాని ఈ జోక్‌ను ట్రోలింగ్‌కి వాడుకుంటున్నారు కొందరు నెటిజన్లు. ‘ఈ జోక్ కంటే నీ కెరీర్ గ్రాఫే చాలా కామెడీగా ఉంది అన్నా’ అంటూ కామెంట్ చేశాడో యువకుడు. ఇలా సరదాగా జోక్ చేయాలని చూసిన మెగా హీరోకి ట్రోల్ చేస్తూ ఓ ఆటాడేసుకున్నారు నెటిజన్లు. శిరీష్‌కు ఇలాంటి ట్రోలింగ్ కొత్తేమీకాదు. మనోడిని చాలాసార్లు, చాలా విషయాల్లో ట్రోల్ చేశారు సోషల్ మీడియా జనాలు. అయితే వాటిని పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటూ వెళ్తున్నాడు అల్లు శిరీష్.

This post was last modified on May 8, 2020 6:45 pm

Share
Show comments
Published by
Satya
Tags: Allu Sireesh

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

37 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago