ఇండియాలో టాలీవుడ్ అనే కాదు.. అన్ని సినీ పరిశ్రమలూ హీరోల చుట్టూనే తిరుగుతాయి. సినిమాలో హీరోల పాత్రలకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. ప్రమోషన్లలో సైతం వారికే ప్రయారిటీ ఇస్తారు. ఏవో కొన్ని సినిమాల్లో మాత్రమే హీరోయిన్లు హైలైట్ అవుతుంటారు. ప్రమోషన్లలోనూ వారికి తగిన ప్రాధాన్యం లభిస్తుంటుంది. ఐతే విరాటపర్వం సినిమాలో హీరోకు దీటుగా, ఇంకా చెప్పాలంటే హీరోను మించి హీరోయిన్ పాత్ర ఉంటుందేమో అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి.
సినిమా సంగతేమో కానీ.. ప్రమోషన్లలో ఆమెకిస్తున్న ప్రాధాన్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోల్లో రానాను మించి సాయిపల్లవి హైలైట్ అవుతోంది. ఆమె ఫస్ట్ లుక్ ప్రత్యేకంగా రిలీజ్ చేశారు. అలాగే ఏ ప్రోమో వదిలినా సాయిపల్లవి హైలైట్ అవుతోంది. అంతే కాక పోస్టర్ మీద ఆమె పేరుకు ఇస్తున్న ప్రాధాన్యం చర్చనీయాంశం అవుతోంది.
విరాటపర్వంకు సంబంధించి ఏ పోస్టర్ వదిలినా ముందు సాయిపల్లవి పేరు వేసి, తర్వాత రానా పేరు ఉండేలా చూస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన కోలు కోలు పాట పోస్టర్లోనూ అదే చేశారు. ఈ గౌరవం అందరు హీరోయిన్లకూ దక్కదు. అంటే ఈ సినిమాలో రానా కంటే సాయిపల్లవి పాత్రే కీలకం అన్నమాట. సినిమాలో అలా ఉన్నప్పటికీ మన ఇండస్ట్రీ సంప్రదాయం ప్రకారం చూస్తే హీరో పేరే ముందుంటుంది.
రానా కూడా చిన్న హీరో ఏమీ కాదు. బాహుబలితో అంతర్జాతీయ గుర్తింపు సంపాదించాడు. హీరోగా అతడికంటూ మార్కెట్ కూడా ఉంది. ఇలాంటి హీరో తన పేరు వెనుక ఉండటానికి ఒప్పుకోవడం విశేషమే. ఈ సినిమాను నిర్మిస్తున్నది కూడా రానా తండ్రి సురేష్ బాబే. ఆయన కూడా కొడుకు పేరు పోస్టర్లో ఇలా పడేలా ఒప్పుకోవడం గొప్ప విషయమే. నటిగా సాయిపల్లవి స్థాయి ఏంటో అందరికీ తెలిసిందే కాబట్టి బలమైన, ఇంటెన్స్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సినిమా ఆమె కెరీర్లో మరో మైలురాయి అవుతుందని భావిస్తున్నారు.
This post was last modified on February 23, 2021 9:26 am
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…