ఇండియాలో టాలీవుడ్ అనే కాదు.. అన్ని సినీ పరిశ్రమలూ హీరోల చుట్టూనే తిరుగుతాయి. సినిమాలో హీరోల పాత్రలకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. ప్రమోషన్లలో సైతం వారికే ప్రయారిటీ ఇస్తారు. ఏవో కొన్ని సినిమాల్లో మాత్రమే హీరోయిన్లు హైలైట్ అవుతుంటారు. ప్రమోషన్లలోనూ వారికి తగిన ప్రాధాన్యం లభిస్తుంటుంది. ఐతే విరాటపర్వం సినిమాలో హీరోకు దీటుగా, ఇంకా చెప్పాలంటే హీరోను మించి హీరోయిన్ పాత్ర ఉంటుందేమో అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి.
సినిమా సంగతేమో కానీ.. ప్రమోషన్లలో ఆమెకిస్తున్న ప్రాధాన్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోల్లో రానాను మించి సాయిపల్లవి హైలైట్ అవుతోంది. ఆమె ఫస్ట్ లుక్ ప్రత్యేకంగా రిలీజ్ చేశారు. అలాగే ఏ ప్రోమో వదిలినా సాయిపల్లవి హైలైట్ అవుతోంది. అంతే కాక పోస్టర్ మీద ఆమె పేరుకు ఇస్తున్న ప్రాధాన్యం చర్చనీయాంశం అవుతోంది.
విరాటపర్వంకు సంబంధించి ఏ పోస్టర్ వదిలినా ముందు సాయిపల్లవి పేరు వేసి, తర్వాత రానా పేరు ఉండేలా చూస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన కోలు కోలు పాట పోస్టర్లోనూ అదే చేశారు. ఈ గౌరవం అందరు హీరోయిన్లకూ దక్కదు. అంటే ఈ సినిమాలో రానా కంటే సాయిపల్లవి పాత్రే కీలకం అన్నమాట. సినిమాలో అలా ఉన్నప్పటికీ మన ఇండస్ట్రీ సంప్రదాయం ప్రకారం చూస్తే హీరో పేరే ముందుంటుంది.
రానా కూడా చిన్న హీరో ఏమీ కాదు. బాహుబలితో అంతర్జాతీయ గుర్తింపు సంపాదించాడు. హీరోగా అతడికంటూ మార్కెట్ కూడా ఉంది. ఇలాంటి హీరో తన పేరు వెనుక ఉండటానికి ఒప్పుకోవడం విశేషమే. ఈ సినిమాను నిర్మిస్తున్నది కూడా రానా తండ్రి సురేష్ బాబే. ఆయన కూడా కొడుకు పేరు పోస్టర్లో ఇలా పడేలా ఒప్పుకోవడం గొప్ప విషయమే. నటిగా సాయిపల్లవి స్థాయి ఏంటో అందరికీ తెలిసిందే కాబట్టి బలమైన, ఇంటెన్స్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సినిమా ఆమె కెరీర్లో మరో మైలురాయి అవుతుందని భావిస్తున్నారు.
This post was last modified on February 23, 2021 9:26 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…