చిరంజీవి ఎప్పుడో పుత్రోత్సాహం పొందాడు.చరణ్ ఆయన పేరును నిలబెడుతూ పెద్ద రేంజికి వెళ్లిపోయాడు. మెగా కుటుంబం నుంచి వస్తున్న కొత్త హీరోలు కూడా ఆయనకు అమితానందాన్ని కలిగిస్తున్నారు. ఇప్పటికే సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ హీరోలుగా స్థిరపడ్డారు. ఇప్పుడు చిరు చిన్న మేనల్లుడు, సాయిధరమ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.
తన చిన్న మేనల్లుడికి హీరోగా ఇలాంటి ఆరంభం దక్కేసరికి చిరు ఆనందం మామూలుగా లేదు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లోనే ఆయన ఆనందం అందరికీ తెలిసిందే. సినిమా పెద్ద హిట్ కాబోతోందని ముందే ఊహించి తన ఉత్సాహాన్ని చూపించాడు. ఆయన అంచనాలకు తగ్గట్లే ఉప్పెన భారీ ఓపెనింగ్స్తో మొదలైంది. వసూళ్ల మోతను కొనసాగిస్తూపెద్ద రేంజికి వెళ్తోంది. ఈ నేపథ్యంలో చిరు చిత్ర బృందానికి తన ప్రేమను పంచాడు.
ఉప్పెన విజయంలో భాగమైన అందరికీ చిరు ప్రత్యేక కానుకలు పంపాడు. సినిమా విజయంలో వారి పాత్రను ప్రస్తుతిస్తూ.. ఒక లేఖ రాయడంతో పాటు ప్రత్యేక బహుమతులు కూడా పంపాడు. ముందుగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తనకు దక్కిన అపురూపమైన కానుకను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఉప్పెన సినిమాలో హైలైట్గా నిలిచిన జలజలపాతం పాటను గుర్తు తెచ్చేలా ఉన్న ఆ కానుకను చూపిస్తూ.. చిరుకు కృతజ్ఞతలు చెబుతూ ఒక వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాడు. అలాగే తనకు చిరు పంపిన అభినందన లేఖను కూడా షేర్ చేశాడు.
మరోవైపు హీరోయిన్ కృతి శెట్టి సైతం చిరు తనను ప్రశంసిస్తూ రాసిన లేఖను షేర్ చేసింది. చిత్ర బృందంలో మిగతా వారికి సైతం చిరు ఇలాగే కానుకలు పంపినట్లు తెలుస్తోంది. తన మేనల్లుడి సినిమా విజయానికి చిరు ఎంత పొంగిపోతున్నారో చెప్పడానికిది నిదర్శనం. తన కుటుంబ సభ్యుల పట్ల చిరుకుండే ప్రేమ గురించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది.
This post was last modified on February 22, 2021 7:34 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…