చిరంజీవి ఎప్పుడో పుత్రోత్సాహం పొందాడు.చరణ్ ఆయన పేరును నిలబెడుతూ పెద్ద రేంజికి వెళ్లిపోయాడు. మెగా కుటుంబం నుంచి వస్తున్న కొత్త హీరోలు కూడా ఆయనకు అమితానందాన్ని కలిగిస్తున్నారు. ఇప్పటికే సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ హీరోలుగా స్థిరపడ్డారు. ఇప్పుడు చిరు చిన్న మేనల్లుడు, సాయిధరమ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.
తన చిన్న మేనల్లుడికి హీరోగా ఇలాంటి ఆరంభం దక్కేసరికి చిరు ఆనందం మామూలుగా లేదు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లోనే ఆయన ఆనందం అందరికీ తెలిసిందే. సినిమా పెద్ద హిట్ కాబోతోందని ముందే ఊహించి తన ఉత్సాహాన్ని చూపించాడు. ఆయన అంచనాలకు తగ్గట్లే ఉప్పెన భారీ ఓపెనింగ్స్తో మొదలైంది. వసూళ్ల మోతను కొనసాగిస్తూపెద్ద రేంజికి వెళ్తోంది. ఈ నేపథ్యంలో చిరు చిత్ర బృందానికి తన ప్రేమను పంచాడు.
ఉప్పెన విజయంలో భాగమైన అందరికీ చిరు ప్రత్యేక కానుకలు పంపాడు. సినిమా విజయంలో వారి పాత్రను ప్రస్తుతిస్తూ.. ఒక లేఖ రాయడంతో పాటు ప్రత్యేక బహుమతులు కూడా పంపాడు. ముందుగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తనకు దక్కిన అపురూపమైన కానుకను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఉప్పెన సినిమాలో హైలైట్గా నిలిచిన జలజలపాతం పాటను గుర్తు తెచ్చేలా ఉన్న ఆ కానుకను చూపిస్తూ.. చిరుకు కృతజ్ఞతలు చెబుతూ ఒక వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాడు. అలాగే తనకు చిరు పంపిన అభినందన లేఖను కూడా షేర్ చేశాడు.
మరోవైపు హీరోయిన్ కృతి శెట్టి సైతం చిరు తనను ప్రశంసిస్తూ రాసిన లేఖను షేర్ చేసింది. చిత్ర బృందంలో మిగతా వారికి సైతం చిరు ఇలాగే కానుకలు పంపినట్లు తెలుస్తోంది. తన మేనల్లుడి సినిమా విజయానికి చిరు ఎంత పొంగిపోతున్నారో చెప్పడానికిది నిదర్శనం. తన కుటుంబ సభ్యుల పట్ల చిరుకుండే ప్రేమ గురించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది.
This post was last modified on February 22, 2021 7:34 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…