చిరంజీవి ఎప్పుడో పుత్రోత్సాహం పొందాడు.చరణ్ ఆయన పేరును నిలబెడుతూ పెద్ద రేంజికి వెళ్లిపోయాడు. మెగా కుటుంబం నుంచి వస్తున్న కొత్త హీరోలు కూడా ఆయనకు అమితానందాన్ని కలిగిస్తున్నారు. ఇప్పటికే సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ హీరోలుగా స్థిరపడ్డారు. ఇప్పుడు చిరు చిన్న మేనల్లుడు, సాయిధరమ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.
తన చిన్న మేనల్లుడికి హీరోగా ఇలాంటి ఆరంభం దక్కేసరికి చిరు ఆనందం మామూలుగా లేదు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లోనే ఆయన ఆనందం అందరికీ తెలిసిందే. సినిమా పెద్ద హిట్ కాబోతోందని ముందే ఊహించి తన ఉత్సాహాన్ని చూపించాడు. ఆయన అంచనాలకు తగ్గట్లే ఉప్పెన భారీ ఓపెనింగ్స్తో మొదలైంది. వసూళ్ల మోతను కొనసాగిస్తూపెద్ద రేంజికి వెళ్తోంది. ఈ నేపథ్యంలో చిరు చిత్ర బృందానికి తన ప్రేమను పంచాడు.
ఉప్పెన విజయంలో భాగమైన అందరికీ చిరు ప్రత్యేక కానుకలు పంపాడు. సినిమా విజయంలో వారి పాత్రను ప్రస్తుతిస్తూ.. ఒక లేఖ రాయడంతో పాటు ప్రత్యేక బహుమతులు కూడా పంపాడు. ముందుగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తనకు దక్కిన అపురూపమైన కానుకను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఉప్పెన సినిమాలో హైలైట్గా నిలిచిన జలజలపాతం పాటను గుర్తు తెచ్చేలా ఉన్న ఆ కానుకను చూపిస్తూ.. చిరుకు కృతజ్ఞతలు చెబుతూ ఒక వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాడు. అలాగే తనకు చిరు పంపిన అభినందన లేఖను కూడా షేర్ చేశాడు.
మరోవైపు హీరోయిన్ కృతి శెట్టి సైతం చిరు తనను ప్రశంసిస్తూ రాసిన లేఖను షేర్ చేసింది. చిత్ర బృందంలో మిగతా వారికి సైతం చిరు ఇలాగే కానుకలు పంపినట్లు తెలుస్తోంది. తన మేనల్లుడి సినిమా విజయానికి చిరు ఎంత పొంగిపోతున్నారో చెప్పడానికిది నిదర్శనం. తన కుటుంబ సభ్యుల పట్ల చిరుకుండే ప్రేమ గురించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది.
This post was last modified on February 22, 2021 7:34 am
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…