చిరంజీవి ఎప్పుడో పుత్రోత్సాహం పొందాడు.చరణ్ ఆయన పేరును నిలబెడుతూ పెద్ద రేంజికి వెళ్లిపోయాడు. మెగా కుటుంబం నుంచి వస్తున్న కొత్త హీరోలు కూడా ఆయనకు అమితానందాన్ని కలిగిస్తున్నారు. ఇప్పటికే సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ హీరోలుగా స్థిరపడ్డారు. ఇప్పుడు చిరు చిన్న మేనల్లుడు, సాయిధరమ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.
తన చిన్న మేనల్లుడికి హీరోగా ఇలాంటి ఆరంభం దక్కేసరికి చిరు ఆనందం మామూలుగా లేదు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లోనే ఆయన ఆనందం అందరికీ తెలిసిందే. సినిమా పెద్ద హిట్ కాబోతోందని ముందే ఊహించి తన ఉత్సాహాన్ని చూపించాడు. ఆయన అంచనాలకు తగ్గట్లే ఉప్పెన భారీ ఓపెనింగ్స్తో మొదలైంది. వసూళ్ల మోతను కొనసాగిస్తూపెద్ద రేంజికి వెళ్తోంది. ఈ నేపథ్యంలో చిరు చిత్ర బృందానికి తన ప్రేమను పంచాడు.
ఉప్పెన విజయంలో భాగమైన అందరికీ చిరు ప్రత్యేక కానుకలు పంపాడు. సినిమా విజయంలో వారి పాత్రను ప్రస్తుతిస్తూ.. ఒక లేఖ రాయడంతో పాటు ప్రత్యేక బహుమతులు కూడా పంపాడు. ముందుగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తనకు దక్కిన అపురూపమైన కానుకను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఉప్పెన సినిమాలో హైలైట్గా నిలిచిన జలజలపాతం పాటను గుర్తు తెచ్చేలా ఉన్న ఆ కానుకను చూపిస్తూ.. చిరుకు కృతజ్ఞతలు చెబుతూ ఒక వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాడు. అలాగే తనకు చిరు పంపిన అభినందన లేఖను కూడా షేర్ చేశాడు.
మరోవైపు హీరోయిన్ కృతి శెట్టి సైతం చిరు తనను ప్రశంసిస్తూ రాసిన లేఖను షేర్ చేసింది. చిత్ర బృందంలో మిగతా వారికి సైతం చిరు ఇలాగే కానుకలు పంపినట్లు తెలుస్తోంది. తన మేనల్లుడి సినిమా విజయానికి చిరు ఎంత పొంగిపోతున్నారో చెప్పడానికిది నిదర్శనం. తన కుటుంబ సభ్యుల పట్ల చిరుకుండే ప్రేమ గురించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది.
This post was last modified on February 22, 2021 7:34 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…