కేవలం రెండు సినిమాల సినిమాల అనుభవంతో ప్రభాస్ లాంటి పెద్ద స్టార్తో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు యువ దర్శకుడు నాగ్ అశ్విన్. అందులోనూ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న సినిమాతో పరిచయం అయిన అతను… ఇంత త్వరగా ప్రభాస్తో మూణ్నాలుగు వందల కోట్ల సినిమా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. అతడికి ఇంత పెద్ద అవకాశం రావడానికి కారణం ‘మహానటి’.
ప్రభాస్తో అశ్విన్ ఎలాంటి సినిమా తీస్తాడా అని ఈ చిత్రం అనౌన్స్ చేసినపుడు అందరూ ఉత్కంఠకు గురయ్యారు. అతను ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్నట్లుగా సంకేతాలు అందాయి. అది ‘ఆదిత్య 369’ తరహాలో ఉంటుందని కూడా అంటున్నారు. ఈ మధ్య ఈ సినిమా టెక్నీషియన్ల గురించి వెల్లడించిన సందర్భంగా ఈ సినిమాతో భవిష్యత్తులోకి ప్రయాణం చేయబోతున్నట్లు చెప్పడం ద్వారా ఇది ఎలాంటి చిత్రమో సంకేతాలు ఇచ్చాడు నాగి. ‘ఆదిత్య 369’లో హీరో గతంలోకి వెళ్లి వచ్చాక అనుకోకుండా భవిష్యత్తులోకి కూడా వెళ్తాడన్న సంగతి తెలిసిందే. ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాలో ‘గతం’ ఏమీ ఉండదని.. మొత్తం భవిష్యత్ నేపథ్యంలోనే నడుస్తుందని భావిస్తున్నారు.
హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలకు దీటుగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాలని నాగి అండ్ టీమ్ కసరత్తు చేస్తోంది. ఐతే ఈ చిత్రాన్ని మొదలుపెట్టడానికి ముందు తాను ఇలాంటి సబ్జెక్టును ఎలా డీల్ చేస్తానో సంకేతాలు ఇవ్వడానికి.. తనను తాను టెస్ట్ చేసుకోవడానికి ‘పిట్టకథలు’లో ‘ఎక్స్ లైఫ్’ ఎపిసోడ్ను నాగి డైరెక్ట్ చేశాడేమో అనిపిస్తుంది. ఇది సైంటిఫిక్ టచ్ ఉన్న స్టోరీ. హ్యూమన్ ఎమోషన్లను టెక్నాలజీ ఎలా డామినేట్ చేస్తుందో ఇందులో చూపించారు. వర్చువల్ రియాలిటీ తర్వాత ఉన్న చోటు నుంచే ప్రపంచంలో కోరుకున్న ఎక్కడికైనా వెళ్లే అనుభవాన్ని ఇందులో డిస్కస్ చేశాడు నాగి.
ఇందులో పాత్రలు, డైలాగులు, సెట్స్ అన్నీ కూడా భవిష్యత్ దర్శనాన్ని చూపించాయి. ఐతే ఐడియా బాగున్నప్పటికీ అనుకున్నంత ఎఫెక్టివ్గా మాత్రం ఈ ఎపిసోడ్ను డీల్ చేయలేకపోయాడు నాగి. దీన్ని చూసి ప్రభాస్ సినిమా మీద సందేహాలు పెట్టుకోవాల్సిన పని లేదు కానీ.. నాగి నుంచి ప్రేక్షకులు మాత్రం బెటర్ ఔట్ పుట్ ఆశించారు. ఈ ఎపిసోడ్కు వచ్చే ఫీడ్ బ్యాక్ను బట్టి నాగి తప్పులు దిద్దుకుని ప్రభాస్ సినిమాను పకడ్బందీగా తీస్తాడని ఆశిద్దాం.
This post was last modified on February 20, 2021 2:08 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…