అగ్ర దర్శకుడు సుకుమార్ ఫేస్ బుక్లో పెట్టిన ఓ పోస్టు వైరల్ అవుతోంది. అది తన మిత్రుడు ప్రసాద్ పుట్టిన రోజును పురస్కరించుకుని పెట్టిన పోస్టు. ప్రసాద్ నెల కిందటే హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. సుకుమార్ దర్శకుడిగా మారిన రోజుల నుంచి ప్రసాద్ ఆయనకు అండగా ఉంటున్నాడు. కాలేజీ రోజుల నుంచి సుక్కుకు ఆయన పరిచయం.
తాను సినిమాల్లో నిలదొక్కుకున్నాక ప్రసాద్ను ఇక్కడికి పిలిపించుకున్నాడు. సుక్కు వ్యక్తిగత, ఆర్థిక, సినిమా సంబంధిత విషయాల్లో ప్రసాద్ పాత్ర కీలకం. ఆయన లేకుండా సుక్కు ఏ పని చేయలేడని అంటారు. సుక్కు అంతగా ఆధారపడే వ్యక్తి నెల కిందట హఠాత్తుగా మరణించారు. ఆయనకు బీపీ, షుగర్ ఉన్నాయి. చాలా ఏళ్లుగా క్రమం తప్పకుండా మందులేసుకుంటూ ఉన్నాడు. ఐతే ఈ మధ్య కొంచెం నిర్లక్ష్యం చేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు.
అప్పటి నుంచి సుక్కు శోకంలో ఉన్నాడు. కొన్ని రోజుల పాటు మిత్రుడు లేక ఆయన డిప్రెషన్లోకి వెళ్లిపోయినట్లు సన్నిహితుల సమాచారం. ఈ మధ్య కొంచెం కోలుకున్నాడు. ఇంతలో ప్రసాద్ పుట్టిన రోజు రావడంతో తన మిత్రుడిని ఉద్దేశించి ఒక హార్ట్ టచింగ్ పోస్టు పెట్టాడు. నెల రోజులకు పైగా కనిపించకుండా పోయిన తన మిత్రుడు మళ్లీ తన దగ్గరికి వచ్చినట్లు.. లాక్ డౌన్లో కూడా స్వేచ్ఛగా తిరిగేస్తున్నట్లు.. మందుల గురించి అడిగితే ఇప్పుడు తనకే ఇబ్బందీ లేదని.. బిందాస్గా తిరిగేస్తున్నానని చెప్పినట్లు.. ఇలా వర్ణించుకుంటూ వెళ్లాడు సుక్కు.
లాక్ డౌన్ అయ్యాక రా చాలా పనుంది అని అంటే.. ప్రసాద్ నవ్వుతూ ఉండిపోగా ఉన్నట్లుండి అలారం మోగి తనకు మెలకువ వచ్చినట్లు సుక్కు పేర్కొన్నాడు. అంటే తన మిత్రుడు మళ్లీ తన దగ్గరికి వచ్చినట్లు సుక్కు కలగన్నాడన్నమాట. వాస్తవంలోకి వచ్చాక ‘‘ఇప్పుడర్థమైంది లేకపోవడం అంటే ఏంటో. లేకపోవడం అంటే ఈ బతుకు అనే లాక్ డౌన్లో బందీగా ఉండటమే’’ అంటూ సుక్కు ముగించాడు. ఇది రాసిన సందర్భం గురించి చెబుతూ.. ‘‘లాక్ డౌన్లో కూడా నా జ్ఞాపకాల్లో స్వేచ్ఛగా తిరిగేస్తున్న బావగాడికి జన్మదిన శుభాకాంక్షలు’’ అని సుక్కు అన్నాడు.
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…