కొన్ని వారాల కిందట టాలీవుడ్లో రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ల జాతర నడిచింది. ఒకరిని చూసి ఒకరు వరుసగా కొత్త చిత్రాల విడుదల తేదీలు ప్రకటించారు. వేరే వాళ్లతో మాట్లాడకుండా.. ఎప్పుడే సినిమా వస్తుందో తెలియకుండా హడావుడిగా ప్రకటనలు చేసేశారు. తర్వాత చూస్తే క్లాష్ తప్పదని, తమకు నష్టం వాటిల్లుతుందని అర్థమైంది. దీంతో ఒకరి తర్వాత ఒకరు డేట్లు మార్చుకునే పనిలో పడ్డారు.
టక్ జగదీష్, సీటీమార్, నారప్ప లాంటి సినిమాలకు ఇలాగే డేట్లు మారబోతున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలోకి వరుణ్ తేజ్ కొత్త చిత్రం ‘గని’ కూడా చేరబోతుండటం స్పష్టం. ఈ చిత్రాన్ని జులై 30న విడుదల చేయనున్నట్లు గత నెలలో ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిన వారాంతంలో సినిమాను షెడ్యూల్ చేసుకున్నాడంటూ వరుణ్ అభిమానులు సంతోషించారు. కానీ ఇప్పుడు ఆ డేట్ను వదులుకోక తప్పట్లేదు.
ప్రభాస్ భారీ చిత్రం ‘రాధేశ్యామ్’ను అదే తేదీకి ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇది పాన్ ఇండియా మూవీ. వివిధ పరిశ్రమల్లో సంప్రదింపులు జరిపి, ఇతర భాషల్లో పోటీ లేకుండా చూసుకుని ఈ డేట్ అనౌన్స్ చేశారు. ‘గని’కి డేట్ ఇచ్చేశారు కదా అని వాళ్లేమీ రాజీ పడట్లేదు. ‘రాధేశ్యామ్’ ఈ తేదీకి రావొచ్చని ముందే సంకేతాలు అందినా తమను సంప్రదించకుండా డేట్ ఇచ్చేసిన నేపథ్యంలో యువి క్రియేషన్స్ వాళ్లు వెనక్కి తగ్గేలా లేరు. అలాగని ‘రాధేశ్యామ్’కు పోటీగా ‘గని’ని విడుదల చేయడమూ శ్రేయస్కరం కాదు. ఈ నేపథ్యంలో ఆ చిత్రానికి వేరే డేట్ చూసుకోక తప్పదు.
హడావుడిగా డేట్ ఇచ్చేశారు కానీ.. ‘గని’ షూటింగ్ చాలానే మిగిలుంది. ఇప్పుడే ఆ చిత్రం సెకండ్ షెడ్యూల్ను మొదలుపెట్టింది. కాబట్టి హడావుడి లేకుండా ఈ చిత్రాన్ని సెప్టెంబరులో విడుదల చేద్దామని ఫిక్సయ్యారట. ఆగస్టులోనూ ‘పుష్ప’ సహా కొన్ని భారీ చిత్రాలు షెడ్యూల్ అయి ఉన్న నేపథ్యంలో సెప్టెంబరు మొదటి వారానికి ‘గని’ని వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంకొన్ని రోజుల తర్వాత పూర్తి స్పష్టత వచ్చాక డేట్ అనౌన్స్ చేస్తారట.
This post was last modified on February 18, 2021 7:03 pm
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…