బాలీవుడ్లో సుదీర్ఘ చరిత్ర ఉన్న బేనర్లలో యశ్ రాజ్ ఫిలిమ్స్ ఒకటి. 50 ఏళ్ల ఘన ప్రస్థానం ఆ సంస్థది. ఏడాదిగా ఆ సంబరాలను కొనసాగిస్తోందా సంస్థ. గత ఏడాది కరోనా లేకుంటే 50వ వార్షికోత్సవాన్ని గత ఏడాది వరుసగా సినిమాలు రిలీజ్ చేయడం ద్వారా సెలబ్రేట్ చేయాలని అనుకుంది యశ్ రాజ్ ఫిలిమ్స్. కానీ వైరస్ ఆ ప్రణాళికల్ని దెబ్బ తీసింది. ఐతే కొత్త ఏడాదిలో యశ్ రాజ్ ఫిలిమ్స్ పేరు మార్మోగేలా పక్కా ప్లాన్తో రంగంలోకి దిగుతోంది ఆ సంస్థ. ఈ ఏడాది ఐదు సినిమాలు తమ సంస్థ నుంచి రాబోతున్నట్లు వెల్లడించిన యశ్ రాజ్ ఫిలిమ్స్.. ఆ ఐదు చిత్రాల రిలీజ్ డేట్లను ఒకే రోజు ప్రకటించడం విశేషం.
ముందుగా అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా జంటగా దివాకర్ బెనర్జీ రూపొందించిన సందీప్ ఔర్ పింకీ ఫరార్ను మార్చి 19న విడుదల చేయబోతోంది యశ్ రాజ్ ఫిలిమ్స్. తర్వాత తమ సంస్థ సూపర్ హిట్లలో ఒకటైన బంటీ ఔర్ బబ్లీకి సీక్వెల్గా తెరకెక్కిన చిత్రాన్ని ఏప్రిల్ 23న రిలీజ్ చేయనున్నారు. వరుణ్ శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, రాణీ ముఖుర్జీ, సిద్దాంత్ చతుర్వేది కీలక పాత్రలు పోషించారు. ఆపై రణబీర్ కపూర్, వాణి కపూర్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కరణ్ మల్హోత్రా రూపొందించిన భారీ చిత్రం షంషేరాను జూన్ 25న రిలీజ్ చేయబోతున్నారు.
రణ్వీర్ సింగ్, షాలిని పాండే (అర్జున్ రెడ్డి హీరోయిన్) జంటగా దివ్యాంగ్ ఠక్కర్ రూపొందించిన జయేష్ బాయ్ జోర్దార్ చిత్రం ఆగస్టు 27న విడుదల కాబోతోంది. చివరగా యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి ఈ ఏడాది పృథ్వీరాజ్ లాంటి భారీ చిత్రం రానుంది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో చంద్రప్రకాశ్ ద్వివేది ఈ భారీ చారిత్రక చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం నవంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక షారుఖ్ ఖాన్ హీరోగా యశ్ రాజ్ ఫిలిమ్స్ రూపొందిస్తున్న పఠాన్ సంగతే తేలాల్సి ఉంది. అది ఈ ఏడాది విడుదలవుతుందో లేదో చెప్పలేం.
This post was last modified on February 18, 2021 7:57 am
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…