ఉప్పెన.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల నోళ్లలో నానుతున్న సినిమా. పరిశ్రమలో కూడా ఈ సినిమా చర్చలే ఎక్కడ చూసినా. ఈ సినిమా తీసిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా పేరు కూడా మార్మోగిపోతోంది ఇండస్ట్రీలో. తొలి సినిమాతో హిట్టు కొడితే ఆ దర్శకుడి జాతకం ఒక్క రాత్రిలో మారిపోతుంది. రిలీజ్ రోజు సాయంత్రం నుంచే కాల్స్తో ఫోన్ మోత మోగిపోతుంది. అందులో అభినందనల కాల్స్తో పాటు ఆఫర్ల కాల్స్ కూడా పెద్ద ఎత్తునే ఉంటాయి. ఐతే ‘ఉప్పెన’ సినిమా ఔట్ పుట్ చూసి బుచ్చిబాబు టాలెంట్ ఏంటో పసిగట్టిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు.. అతణ్ని వెంటనే బయటికి వదలకూడదని ఫిక్సయిపోయారట.
ప్రస్తుతం టాలీవుడ్లో ఫామ్లో ఉన్న ఏ దర్శకుడూ, ఏ హీరోనూ వదలుకుండా కమిట్మెంట్లు తీసుకుంటున్న మైత్రీ సంస్థ.. తమ సంస్థలోనే పరిచయం అయిన ప్రతిభావంతుడైన దర్శకుడిని ఎలా వదిలి పెడుతుంది? ‘ఉప్పెన’ రిలీజ్ కంటే ముందు అతడిని మైత్రీ అధినేతలు లాక్ చేసేసినట్లు సమాచారం.
బుచ్చిబాబు మరో రెండు సినిమాలు మైత్రీకే చేశాకే బయటికి వెళ్లేలా అగ్రిమెంట్ ఎప్పుడో రాయించేసినట్లు సమాచారం. బుచ్చిబాబు రెండో సినిమాకు కథ కూడా ఎప్పుడో రెడీ అయిందట. అది ఒక వింటేజ్ స్పోర్ట్స్ డ్రామా అని తెలిసింది. లాక్ డౌన్ టైంలో బుచ్చిబాబు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు ఒక కథ చెప్పి ఇంప్రెస్ చేసినట్లు వార్తలొచ్చాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్తో సైతం బుచ్చిబాబు టచ్లో ఉన్నాడు.
ఈ ఇద్దరిలో ఒకరిని బుచ్చిబాబు తర్వాతి సినిమాకు కమిట్ చేయించాలని మైత్రీ అధినేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్లతో కుదరకుంటే ఇంకెవరైనా పెద్ద స్టార్తోనే బుచ్చిబాబు రెండో సినిమా చేయించాలని వారు భావిస్తున్నారట. మైత్రీతో ఉన్న కమిట్మెంట్ల ప్రకారం చూస్తే బుచ్చిబాబు ఇంకో రెండేళ్లకు పైగా ఆ కాంపౌండ్ దాటే అవకాశాలు కనిపించడం లేదు.
ఇప్పటిదాకా సుకుమార్ శిష్యులందరిలో అతి పెద్ద విజయాన్నందుకుంది, తన ముద్రను ప్రత్యేకంగా చూపించింది బుచ్చిబాబే. గురువుకు తగ్గ శిష్యుడంటే అతణ్ని ఇండస్ట్రీ జనాలు ఆకాశానికెత్తేస్తున్నారు. ఐతే తొలి సినిమాతో అంచనాలు పెంచాక సుకుమార్ సహా చాలామంది దర్శకులు ద్వితీయ విఘ్నంతో ఇబ్బంది పడ్డవాళ్లే. మరి బుచ్చిబాబు ఏం చేస్తాడో చూడాలి.
This post was last modified on February 17, 2021 5:42 pm
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…