బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకు కుదిరే కాంబినేషన్లు చూస్తే జనాలకు భలే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అతనేమీ పెద్ద బ్యాగ్రౌండ్ నుంచి రాలేదు. హీరోగా తొలి సినిమాను మినహాయిస్తే మరే చిత్రాన్ని అతడి తండ్రి బెల్లంకొండ సురేష్ నిర్మించలేదు. చాలా వరకు పెద్దగా పేరు లేని బేనర్లలోనే నటించాడు. కానీ ఆ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్లలో తెరకెక్కాయి. పెద్ద పెద్ద దర్శకులు, టెక్నీషియన్లు, నటీనటులతో అతడికి కాంబినేషన్లు కుదిరాయి. ఏమాత్రం రాజీ లేకుండా ఆయా సినిమాలను నిర్మించారు.
శ్రీనివాస్ చివరగా నటించిన ‘అల్లుడు అదుర్స్’ను సైతం పెద్ద బడ్జెట్లో ఓ కొత్త నిర్మాత ప్రొడ్యూస్ చేశాడు. దీని తారాగణం, టెక్నీషియన్ల సంగతి తెలిసిందే. ఐతే ఇండస్ట్రీలో ఉన్న టాక్ ఏంటంటే సురేష్ తెర వెనుక ఉండి వేరే నిర్మాతల్ని పెట్టి కొడుకుతో సినిమాలు తీయిస్తాడని. ఆ సినిమాలను మార్కెట్ చేయడం, పెద్ద ఎత్తున రిలీజ్ చేయడం, నష్టాలొస్తే డిస్ట్రిబ్యూటర్లకు సెటిల్ చేయడం అంతా సురేషే చూసుకుంటాడని అంటారు.
ఐతే బెల్లంకొండ శ్రీనివాస్ను పెద్ద స్టార్ లాగా అతడి సినిమాల్లో ప్రొజెక్ట్ చేయడం చూస్తుంటాం కానీ.. అతడిని ఏ పేరున్న బేనర్ కూడా పిలిచి సినిమా చేసిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. ఐతే తొలిసారిగా ఓ పెద్ద సంస్థలో అతను ఓ సినిమా చేయబోతున్నాడన్నది తాజా సమాచారం. ప్రస్తుతం శ్రీనివాస్ దృష్టంతా ‘ఛత్రపతి’ బాలీవుడ్ రీమేక్ మీదే ఉంది. ఈ సినిమా కోసమే ముంబయిలో ఉండి ప్రిపేరవుతున్నాడతను. ఆ సినిమా పూర్తి చేశాక తిరిగి టాలీవుడ్కు వచ్చి యువి క్రియేషన్స్ బేనర్లో ఓ సినిమా చేస్తాడట శ్రీనివాస్. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడట.
‘మిర్చి’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన యువి క్రియేషన్స్ ఓ వైపు భారీ చిత్రాలను నిర్మిస్తూనే మరోవైపు మీడియం బడ్జెట్లో యువ కథానాయకులతో సినిమాలు తీస్తూ వస్తోంది. ఈ కోవలోనే శ్రీనివాస్ హీరోగా కొత్త దర్శకుడితో తక్కువ బడ్జెట్లో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసిందట. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన వస్తుందని సమాచారం.
This post was last modified on February 16, 2021 8:41 pm
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…