Movie News

ప్రొడ్యూసర్ సై! డైరక్టర్‌ నై నై!!

మొదటి సినిమా ‘క్షణం’తోనే తనలోని క్రియేటివిటీని టాలీవుడ్‌కి పరిచయం చేశాడు డైరెక్టర్ రవికాంత్ పేరెపు. తొలి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న రవికాంత్, బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్‌గా నంది అవార్డు కూడా అందుకున్నాడు.

అయితే ‘క్షణం’ సక్సెస్ క్రెడిట్ మొత్తం హీరో అడవి శేష్‌కు వెళ్లడంతో సెకండ్ మూవీ స్టార్ట్ చేసేందుకు రవికాంత్‌కు చాలా టైమ్ పట్టింది. ఎట్టకేలకు ‘గుంటూర్ టాకీస్’ హీరో సిద్ధూ జొన్నలగడ్డతో ‘కృష్ణ అండ్ హీస్ లీల’ అంటూ ఓ యూత్‌ఫుల్ సబ్జెట్ సినిమాను మొదలెట్టాడు ఈ యంగ్ డైరెక్టర్.

కొన్నాళ్లక్రితం రిలీజ్ చేసిన టీజర్‌తో యూత్ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగాడు కూడా. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా, లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో క్లారిటీ రాకపోవడంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట నిర్మాత సురేశ్ బాబు. ఈ లో-బడ్జెట్ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేయడంతో అమ్మేసుకోవాలని భావిస్తున్నారట.

అయితే తన టాలెంట్‌ను నిరూపించుకునేందుకు ఛాన్స్‌గా దొరికిన సెకండ్ సినిమాను ఇలా డైరెక్ట్ రిలీజ్ చేయడం దర్శకుడిని ఏ మాత్రం ఇష్టం లేదని, అందుకే లాక్‌డౌన్ ముగిసేవరకూ ఆగుదామని నిర్మాతను ఎలాగైనా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడట రవికాంత్. అయితే ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సురేశ్ బాబు దానికి ఒప్పుకోవడం లేదని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా విడుదలపై క్లారిటీ వస్తే, ఈ వార్తల్లో నిజం ఎంతనేది తెలీదు.

This post was last modified on May 11, 2020 10:49 pm

Share

Recent Posts

తెలుగు రామాయణ మీద 100 కోట్లు సేఫేనా

నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…

4 minutes ago

ఓజి 2 సౌండ్ చెయ్యడం లేదేంటి

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…

22 minutes ago

రాఖీ రాజీ చేసేనా? సీఎం ఇంటికి కొండా సురేఖ!

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఇటీవల చోటుచేసుకున్న వివాదం తర్వాత తొలిసారిగా ఆమె…

35 minutes ago

ప్రాణాలు తీసుకునే ముందు… ఆ పాప గుర్తుకు రాలేదా?

అప్పుల బాధతో దంపతులు గోదావరిలో దూకిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నింపింది. మూడేళ్ల చిన్నారిని వంతెనపై స్కూటీ వద్ద…

2 hours ago

పార్ల‌మెంటు డీలిమిటేష‌న్‌పై కాంగ్రెస్ భయం దేనికి?

దేశ‌వ్యాప్తంగా 543 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంపై కాంగ్రెస్ పార్టీ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను వ‌చ్చే 25 ఏళ్ల…

3 hours ago

బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌… `ప‌ర్స‌న‌లైజ్` అవుతున్న పార్టీలు!

రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్‌లో గ‌తానికి భిన్న‌మైన `వ్య‌క్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇందిర‌మ్మ హ‌యాంలో…

5 hours ago