మొదటి సినిమా ‘క్షణం’తోనే తనలోని క్రియేటివిటీని టాలీవుడ్కి పరిచయం చేశాడు డైరెక్టర్ రవికాంత్ పేరెపు. తొలి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న రవికాంత్, బెస్ట్ స్క్రీన్ప్లే రైటర్గా నంది అవార్డు కూడా అందుకున్నాడు.
అయితే ‘క్షణం’ సక్సెస్ క్రెడిట్ మొత్తం హీరో అడవి శేష్కు వెళ్లడంతో సెకండ్ మూవీ స్టార్ట్ చేసేందుకు రవికాంత్కు చాలా టైమ్ పట్టింది. ఎట్టకేలకు ‘గుంటూర్ టాకీస్’ హీరో సిద్ధూ జొన్నలగడ్డతో ‘కృష్ణ అండ్ హీస్ లీల’ అంటూ ఓ యూత్ఫుల్ సబ్జెట్ సినిమాను మొదలెట్టాడు ఈ యంగ్ డైరెక్టర్.
కొన్నాళ్లక్రితం రిలీజ్ చేసిన టీజర్తో యూత్ ఆడియెన్స్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగాడు కూడా. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా, లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో క్లారిటీ రాకపోవడంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీ ఫ్లాట్ఫామ్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట నిర్మాత సురేశ్ బాబు. ఈ లో-బడ్జెట్ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేయడంతో అమ్మేసుకోవాలని భావిస్తున్నారట.
అయితే తన టాలెంట్ను నిరూపించుకునేందుకు ఛాన్స్గా దొరికిన సెకండ్ సినిమాను ఇలా డైరెక్ట్ రిలీజ్ చేయడం దర్శకుడిని ఏ మాత్రం ఇష్టం లేదని, అందుకే లాక్డౌన్ ముగిసేవరకూ ఆగుదామని నిర్మాతను ఎలాగైనా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడట రవికాంత్. అయితే ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సురేశ్ బాబు దానికి ఒప్పుకోవడం లేదని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా విడుదలపై క్లారిటీ వస్తే, ఈ వార్తల్లో నిజం ఎంతనేది తెలీదు.
This post was last modified on May 11, 2020 10:49 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…