ఓ సినిమా కోసం వేసిన సెట్ ని మరో సినిమా కోసమూ వాడేయడం ఈరోజుల్లో అరుదైన విషయమే. ఎందుకంటే.. ప్రేక్షకులు ఇట్టే పట్టేస్తున్నారు. ‘ఇది ఫలానా సినిమాలో ఉంది కదా’ అని చెప్పేస్తున్నారు.
అందుకే… సెట్స్ని రిపీట్ చేయడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో పాత సెట్లకే కొత్త హంగులు పూసి.. వాడుకోవాల్సివస్తుంది. ‘ఆచార్య’ విషయంలో అదే జరుగుతోంది.
‘పుష్ష’ కోసం వేసిన సెట్లో ఇప్పుడు ‘ఆచార్య’ రంగంలోకి దిగబోతున్నాడు. ‘పుష్ష’ షూటింగ్ ఇటీవల మారేడు మల్లిలో జరిగింది. అక్కడ షెడ్యూల్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చే వారంలో ‘ఆచార్య’ షూటింగ్ అక్కడే జరగబోతోంది. మారేడు మల్లిలో ‘పుష్ష’ పెద్ద షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఎక్కువ రోజులు అక్కడ ఉండాల్సిరావడంతో.. కొన్ని గెస్ట్ హోస్లను నిర్మించుకుంది.
అక్కడే ఇప్పుడు ‘ఆచార్య’ యూనిట్ కూడా ఉండబోతోంది. పుష్ష కోసం వేసిన సెట్లని చిన్న చిన్న మార్పులు చేసుకుని ‘ఆచార్య’ కోసం వాడుకోబోతున్నారు. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్పై కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తారట. వారం పది రోజుల్లో ఇక్కడి షెడ్యూల్ పూర్తవుతుందని, ఆ తరవాత హైదరాబాద్ లో చిరు – చరణ్లపై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని సమాచారం. మే 13న ఆచార్య విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 9, 2021 3:01 pm
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…