ఓ సినిమా కోసం వేసిన సెట్ ని మరో సినిమా కోసమూ వాడేయడం ఈరోజుల్లో అరుదైన విషయమే. ఎందుకంటే.. ప్రేక్షకులు ఇట్టే పట్టేస్తున్నారు. ‘ఇది ఫలానా సినిమాలో ఉంది కదా’ అని చెప్పేస్తున్నారు.
అందుకే… సెట్స్ని రిపీట్ చేయడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో పాత సెట్లకే కొత్త హంగులు పూసి.. వాడుకోవాల్సివస్తుంది. ‘ఆచార్య’ విషయంలో అదే జరుగుతోంది.
‘పుష్ష’ కోసం వేసిన సెట్లో ఇప్పుడు ‘ఆచార్య’ రంగంలోకి దిగబోతున్నాడు. ‘పుష్ష’ షూటింగ్ ఇటీవల మారేడు మల్లిలో జరిగింది. అక్కడ షెడ్యూల్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చే వారంలో ‘ఆచార్య’ షూటింగ్ అక్కడే జరగబోతోంది. మారేడు మల్లిలో ‘పుష్ష’ పెద్ద షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఎక్కువ రోజులు అక్కడ ఉండాల్సిరావడంతో.. కొన్ని గెస్ట్ హోస్లను నిర్మించుకుంది.
అక్కడే ఇప్పుడు ‘ఆచార్య’ యూనిట్ కూడా ఉండబోతోంది. పుష్ష కోసం వేసిన సెట్లని చిన్న చిన్న మార్పులు చేసుకుని ‘ఆచార్య’ కోసం వాడుకోబోతున్నారు. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్పై కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తారట. వారం పది రోజుల్లో ఇక్కడి షెడ్యూల్ పూర్తవుతుందని, ఆ తరవాత హైదరాబాద్ లో చిరు – చరణ్లపై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని సమాచారం. మే 13న ఆచార్య విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన…
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…