ఓ సినిమా కోసం వేసిన సెట్ ని మరో సినిమా కోసమూ వాడేయడం ఈరోజుల్లో అరుదైన విషయమే. ఎందుకంటే.. ప్రేక్షకులు ఇట్టే పట్టేస్తున్నారు. ‘ఇది ఫలానా సినిమాలో ఉంది కదా’ అని చెప్పేస్తున్నారు.
అందుకే… సెట్స్ని రిపీట్ చేయడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో పాత సెట్లకే కొత్త హంగులు పూసి.. వాడుకోవాల్సివస్తుంది. ‘ఆచార్య’ విషయంలో అదే జరుగుతోంది.
‘పుష్ష’ కోసం వేసిన సెట్లో ఇప్పుడు ‘ఆచార్య’ రంగంలోకి దిగబోతున్నాడు. ‘పుష్ష’ షూటింగ్ ఇటీవల మారేడు మల్లిలో జరిగింది. అక్కడ షెడ్యూల్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చే వారంలో ‘ఆచార్య’ షూటింగ్ అక్కడే జరగబోతోంది. మారేడు మల్లిలో ‘పుష్ష’ పెద్ద షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఎక్కువ రోజులు అక్కడ ఉండాల్సిరావడంతో.. కొన్ని గెస్ట్ హోస్లను నిర్మించుకుంది.
అక్కడే ఇప్పుడు ‘ఆచార్య’ యూనిట్ కూడా ఉండబోతోంది. పుష్ష కోసం వేసిన సెట్లని చిన్న చిన్న మార్పులు చేసుకుని ‘ఆచార్య’ కోసం వాడుకోబోతున్నారు. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్పై కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తారట. వారం పది రోజుల్లో ఇక్కడి షెడ్యూల్ పూర్తవుతుందని, ఆ తరవాత హైదరాబాద్ లో చిరు – చరణ్లపై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని సమాచారం. మే 13న ఆచార్య విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 9, 2021 3:01 pm
రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది. కన్నూ మిన్నూ కానకుండా విచ్చలవిడిగా దారుణాలకు పాల్పడుతుంది. గంజాయి మత్తులో జరుగుతున్న నేరాలు, ఘోరాలు…
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…
తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ పదేళ్ల కెరీర్లో పెద్దగా ఎఫైర్ వార్తలేమీ వచ్చింది లేదు.…
ప్రభాస్ సినిమా అంటే చాలు.. హైప్కు ఏమీ లోటు ఉండదు. రిలీజ్ దగ్గర పడేకొద్దీ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ…
ఇదేమీ ఊహాజనిత వార్తకాదు. కొందరు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలో గత…
ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ఎప్పటి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్పడమే కాదు.. అంతర్జాతీయ వేదికలపైనా ఆయన తన వాణిని…