Movie News

రాజకీయాలకు టాటా.. సినిమాల్లో వేట

తాను రాజకీయాల్లోకి రాబోనంటూ రెండు నెలల కిందటే ప్రకటన చేసి అభిమానులకు పెద్ద షాకిచ్చాడు సూపర్ స్టార్ రజినీకాంత్. దీని తాలూకు ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. అభిమానుల నుంచి నిరసన కొనసాగుతూనే ఉంది. తన నిర్ణయంపై ఆందోళన కార్యక్రమాలు చేయడం, తననకు ఇంకా బాధ పెట్టడం పట్ల రజినీ ఆవేదన వ్యక్తం చేశాడు కూడా. అయినా అభిమానులేమీ తగ్గట్లేదు.

ఇక వాళ్లను పట్టించుకుంటే కష్టమని రజినీ రాజకీయాల సంగతి పూర్తిగా పక్కన పెట్టేసి సినిమాల మీద దృష్టి పెడుతున్నట్లున్నారు. దీపావళికి తన కొత్త చిత్రం ‘అన్నాత్తె’ రిలీజ్ డేట్ ఖరారు చేసిన నేపథ్యంలో త్వరలోనే ఆ సినిమా షూటింగ్‌ను పున:ప్రారంభించాలనుకుంటున్నారు రజినీ. అంతే కాక మరో కొత్త సినిమాకు కూడా ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ‘అన్నాత్తె’ పూర్తి కాగానే ఆ చిత్రం మొదలుపెట్టబోతున్నారు రజినీ.

తనతో ‘పేట’ సినిమా తీసిన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజినీ మళ్లీ నటించబోతున్నారు. వీరి కలయికలో మరో సినిమా రావొచ్చని ఇంతకుముందే ప్రచారం జరిగింది. తాజాగా ఆ సినిమా ఖరారైనట్లు సమాచారం. ఒక అభిమానిలా ‘పేట’లో రజినీని ప్రెజెంట్ చేసి ప్రశంసలందుకున్నాడు కార్తీక్. కానీ అందులో అతడి మార్కు కథాకథనాలు మిస్సయ్యాయనే విమర్శలు వచ్చాయి. సినిమా అనుకున్నంతగా ఆడలేదు. ఈసారి మాత్రం రజినీకి పెద్ద హిట్టివ్వాలని పట్టుదలతో ఉన్నాడు కార్తీక్.

‘పేట’ తర్వాత రజినీ అల్లుడు ధనుష్‌తో కార్తీక్ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ‘జగమే తంత్రం’ పేరుతో తెరకెక్కిన ఆ చిత్రం త్వరలోనే నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజవుతుందంటున్నారు. లాక్ డౌన్ కంటే ముందే ఈ సినిమా పూర్తయింది. దీంతో ఖాళీ టైంలో కార్తీక్.. రజినీకాంత్ కోసం స్క్రిప్టు రెడీ చేశాడు. ఇటీవల ఆయన్ని కలిసి కథ వినిపించడం, ఆయన ఓకే చేయడం జరిగాయట. ఈ సినిమాను ఏ బేనర్లో చేస్తాడో తెలియదు కానీ.. త్వరలోనే దీనిపై ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కూడా ఓపిక ఉన్నంత వరకు సినిమాలు చేసి అభిమానులను ఆ రకంగా అయినా అలరించాలని రజినీ నిర్ణయించుకున్నాడట.

This post was last modified on February 11, 2021 10:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

33 minutes ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

2 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

2 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

4 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

4 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

4 hours ago