ఉప్పెన సినిమా ఎలా ఉంటుందో? హీరోగా వైష్ణవ్ తేజ్ కెరీర్ సంగతేంటో.. తెలీదు గానీ, కథానాయికగా కృతి శెట్టి మరో మరో రెండేళ్లు ఈ టాలీవుడ్ ని ఏలేయడం ఖాయం. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా.. గంపెడు అవకాశాల్ని అందేసుకుంటోంది కృతి శెట్టి. ఇప్పటికే నాని సినిమాలో హీరోయిన్ గా బుక్కయిపోయింది. ఇప్పుడు అఖిల్ – సురేందర్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా తనకే ఛాన్స్ వచ్చినట్టు సమాచారం.
అంతే కాదు.. నాగశౌర్య హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకోబోతోందని, అందులో.. కృతి శెట్టి కథానాయికగా నటిస్తుందని సమాచారం అందుతోంది. తమిళ సినిమా దృష్టి కూడా కృతిపై పడిందని, సూర్య సినిమాలో కథానాయికగా కృతి ఎంపికైపోయిందని ఓ ప్రచారం సాగుతోంది.
అందులో ఎంత వరకూ నిజం ఉందో తెలీదు గానీ.. 2021కి సంబంధించిన కృతి డైరీ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినట్టే. ఉప్పెన గనుక సూపర్ హిట్టయిపోయతే.. 2022 కాల్షీట్లూ ఇప్పుడే ఇచ్చేయాల్సి ఉంటుంది.
This post was last modified on February 8, 2021 12:04 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…