కెరీర్లో తొలిసారి రెడ్ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు యువ కథానాయకుడు రామ్. తమిళ హిట్ తడమ్కు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. ఆదిత్య, సిద్దార్థ్ పాత్రల్లో రామ్ బాగానే వైవిధ్యం చూపించాడు. ద్విపాత్రాభినయం చేయడంలో ఏమాత్రం తడబడినట్లు కనిపించలేదు. ఈ సినిమా ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో రామ్.. ఈసారి ఏకంగా ట్రిపుల్ రోల్ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా ఒక క్రేజీ రూమర్ టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తుండటం విశేషం.
ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకు రామ్ బాగా ఇంప్రెస్ అయ్యాడట. సినిమా చేస్తానని హామీ ఇచ్చాడట. అందులో రామ్ త్రిపాత్రాభినయం చేస్తాడని అంటున్నారు. రామ్ నుంచి హామీ అందుకున్న ఆ యువ దర్శకుడు ఈ సినిమా గురించి తన సన్నిహితులతో చెప్పుకోగా.. ఈ వార్త బయటికి వచ్చింది.
కొత్త దర్శకుడితో కొంచెం రిస్క్తో కూడుకున్న సబ్జెక్ట్ కావడంతో ఈ చిత్రాన్ని కూడా తన హోం బేనర్ స్రవంతి మూవీస్లోనే రామ్ చేయబోతున్నాడని అంటున్నారు. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశముంది. రెడ్ తర్వాత రామ్ కొత్త సినిమా ఎంచుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు.
రెడ్ గత ఏడాది మార్చిలోనే పూర్తయింది. అప్పట్నుంచి అతను ఖాళీగానే ఉన్నాడు. మధ్యలో త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. కానీ అలాంటి ప్రకటన ఏమీ రాలేదు. త్రివిక్రమ్ ఈ వేసవి నుంచి ఎన్టీఆర్ సినిమాను మొదలుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇటీవలే స్వామి మాల వేసుకున్న రామ్.. కొంచెం గ్యాప్ తీసుకుని త్వరలోనే రీఎంట్రీ ఇస్తానన్నట్లుగా సంకేతాలు ఇచ్చాడు. ఈ మాల తీయగానే రామ్ కొత్త సినిమాను మొదలుపెడతాడని అంటున్నారు.
This post was last modified on February 8, 2021 11:52 am
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…
‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…
పాప్ కార్న్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. కాలక్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్కజొన్న లోని…
ఆగస్ట్ నెల దాదాపు అయిపో వచ్చింది. ఆదర్శ కుటుంబం విడుదల అక్కడి నుంచి కేవలం ఒక నెల రోజులు మాత్రమే…
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…